CM Chandrababu Review On Various Policies: రాష్ట్రంలో మైనింగ్ పాలసీపై సీఎం చంద్రబాబు తుది కసరత్తు చేస్తున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన క్వారీల వేలం వేయడమా అన్న అంశంపై మేథోమథనం చేస్తున్నారు. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రీచ్ల్లో తవ్వకాలను అనుమతించాలని ఇటీవలే ఇసుక పాలసీలో మార్పులు చేసింది. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సీఎం చర్చించనున్నారు. ఆదాయార్జన శాఖలపై సమీక్ష చేయనున్నారు. కేంద్ర పథకాలకు యూసీలు ఇచ్చే అంశంపైనా సమీక్షించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా చర్చించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.
'ఎంప్లాయిమెంట్ ఫస్ట్' ప్రభుత్వ విధానం - పెట్టుబడులు వచ్చేలా పాలసీలు: సీఎం చంద్రబాబు
సంక్రాంతికి 'పల్లె' కళకళలాడాలి - చంద్రబాబు అనుభవం మాకు ఎంతో బలం: పవన్ కల్యాణ్