ETV Bharat / politics

'మీకు లక్షన్నర రుణమాఫీ కాలేదా? - ఐతే ఈ నంబర్​కు వాట్సాప్ చేయండి' - NIRANJAN REDDY ON CROP LOAN WAIVER

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 1:51 PM IST

Updated : Aug 5, 2024, 2:19 PM IST

Niranjan Reddy Comments On Congress : ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర సర్కార్‌ రుణమాఫీ విషయంలో అన్ని అబద్దాలే మాట్లాడుతుందని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. రుణమాఫీ మొత్తం చేసినట్లు మాట్లాడుతున్నారే తప్ప ఎంత మందికి ఇచ్చారనేది లెక్క ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అర్హులై ఉండి లక్షన్నర లోపు రుణమాఫీ కాని రైతులు వారి వివరాలు తెలంగాణభవన్​కు వాట్సాప్ ద్వారా 8374852619 నంబర్​కు పంపాలని కోరారు.

BRS Leader Niranjan Reddy On Rythu Runa Mafi
BRS Leader Niranjan Reddy Comments On Congress (ETV Bharat)

Niranjan Reddy On Rythu Runa Mafi : అందరికి రుణమాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సాకు వెతుకుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. అర్హులై ఉండి లక్షన్నర లోపు రుణమాఫీ కాని రైతులు వారి వివరాలు తెలంగాణ భవన్​కు వాట్సాప్ ద్వారా 8374852619 నంబర్​కు పంపాలని కోరారు. అనుభవజ్ఞులు వాటిని పరిశీలిస్తారని, పార్టీ తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అమెరికా నుంచి డాలర్లు తీసుకొస్తారేమోనని ఎద్దేవా చేశారు.

రైతులకు రుణమాఫీ కాలేదు : స్పష్టత ఇవ్వకుండా మొత్తం ఇచ్చినట్లు దబాయింపు చేస్తున్నారని, రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. రుణమాఫీ కాలేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. పాసు బుక్కులో, బ్యాంకు ఖాతాలో పేర్లు వేరుగా ఉన్నాయని కూడా రుణమాఫీ చేయడం లేదని, లక్షన్నర లోపు రుణం ఉండి ఇంకా మాఫీ కాని రైతులు ఉన్నారని, గ్రామాల్లోకి వస్తే చూపిస్తామని చెప్పారు.

సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులు ఒక రకంగా చెబుతుంటే కొర్రీలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. రైతులు ఈ సర్కార్​పై భ్రమల్లో ఉండాల్సిన అవసరం లేదన్న నిరంజన్ రెడ్డి రుణమాఫీ కాని వారి వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ సర్కార్​ను కోరుతున్నామన్న ఆయన ఏ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.

రైతుకు పెట్టుబడి సాయం ఏది?: రైతుబంధు ఎగ్గొట్టి కాలం గడిపేసుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, అదే వారిని కాటు వేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ తరహాలోనే రైతులకు పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనర్హులు ఉంటే ఏరి వేయాలి కానీ, మొత్తం మూసివేస్తారా అని ధ్వజమెత్తారు. సాకులతో హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందని రైతు భరోసా ఏం చేశారని అసెంబ్లీ సమావేశాల్లో చర్చ ఎందుకు పెట్టలేదని మాజీ మంత్రి ప్రశ్నించారు.

రుణమాఫీ, రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా ప్రభుత్వం పారిపోయింది. రైతులకు సమాధానం చెప్పాలని అడిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. బడ్జెట్ అంతా ట్రాష్, గ్యాస్. ఒకటో, రెండో తప్పులు చూపి మొత్తం ఎగనాం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వంద రోజుల్లో చేస్తామని చేయనుందుకే ప్రజలు కాంగ్రెస్ ను నమ్మడం లేదు. ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా రైతులను మోసం చేస్తున్నారు. - నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి

రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను వంచిస్తోంది : నిరంజన్​ రెడ్డి

రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే : హరీశ్‌రావు - BRS Party ON LOAN WAIVER

Niranjan Reddy On Rythu Runa Mafi : అందరికి రుణమాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సాకు వెతుకుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. అర్హులై ఉండి లక్షన్నర లోపు రుణమాఫీ కాని రైతులు వారి వివరాలు తెలంగాణ భవన్​కు వాట్సాప్ ద్వారా 8374852619 నంబర్​కు పంపాలని కోరారు. అనుభవజ్ఞులు వాటిని పరిశీలిస్తారని, పార్టీ తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అమెరికా నుంచి డాలర్లు తీసుకొస్తారేమోనని ఎద్దేవా చేశారు.

రైతులకు రుణమాఫీ కాలేదు : స్పష్టత ఇవ్వకుండా మొత్తం ఇచ్చినట్లు దబాయింపు చేస్తున్నారని, రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. రుణమాఫీ కాలేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. పాసు బుక్కులో, బ్యాంకు ఖాతాలో పేర్లు వేరుగా ఉన్నాయని కూడా రుణమాఫీ చేయడం లేదని, లక్షన్నర లోపు రుణం ఉండి ఇంకా మాఫీ కాని రైతులు ఉన్నారని, గ్రామాల్లోకి వస్తే చూపిస్తామని చెప్పారు.

సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులు ఒక రకంగా చెబుతుంటే కొర్రీలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. రైతులు ఈ సర్కార్​పై భ్రమల్లో ఉండాల్సిన అవసరం లేదన్న నిరంజన్ రెడ్డి రుణమాఫీ కాని వారి వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ సర్కార్​ను కోరుతున్నామన్న ఆయన ఏ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.

రైతుకు పెట్టుబడి సాయం ఏది?: రైతుబంధు ఎగ్గొట్టి కాలం గడిపేసుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, అదే వారిని కాటు వేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ తరహాలోనే రైతులకు పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనర్హులు ఉంటే ఏరి వేయాలి కానీ, మొత్తం మూసివేస్తారా అని ధ్వజమెత్తారు. సాకులతో హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందని రైతు భరోసా ఏం చేశారని అసెంబ్లీ సమావేశాల్లో చర్చ ఎందుకు పెట్టలేదని మాజీ మంత్రి ప్రశ్నించారు.

రుణమాఫీ, రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా ప్రభుత్వం పారిపోయింది. రైతులకు సమాధానం చెప్పాలని అడిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. బడ్జెట్ అంతా ట్రాష్, గ్యాస్. ఒకటో, రెండో తప్పులు చూపి మొత్తం ఎగనాం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వంద రోజుల్లో చేస్తామని చేయనుందుకే ప్రజలు కాంగ్రెస్ ను నమ్మడం లేదు. ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా రైతులను మోసం చేస్తున్నారు. - నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి

రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను వంచిస్తోంది : నిరంజన్​ రెడ్డి

రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే : హరీశ్‌రావు - BRS Party ON LOAN WAIVER

Last Updated : Aug 5, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.