ETV Bharat / politics

'కింది స్థాయి పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఆదేశాలను పాటిస్తున్నారు' - Jagadish Reddy on CM Revanth

author img

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

Updated : 7 hours ago

BRS leaders Meet DGP : కాంగ్రెస్ నేతల ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌పై దాడి చేసినా చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే తీరు మార్చుకోవాలంటూ హితవు పలికారు. గురువారం బీఆర్​ఎస్​ నేతలపై దాడులు, శాంతిభద్రతలపై డీజీపీకి ఆ పార్టీ నేతల బృందం ఫిర్యాదు చేసింది.

Jagadish reddy about Congress attack on BRS
BRS leaders Meet DGP (ETV Bharat)

Jagadish reddy about Congress attack on BRS : రాష్ట్రంలో కింది స్థాయి పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఆదేశాలను పాటిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించి వస్తున్న తమ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక పోలీస్​లు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​పైనా దాడి చేస్తే చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వస్తుంటే ఏసీపీ, సీఐ అడ్డుకోలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఏసీపీ, సీఐపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

జగదీశ్​రెడ్డి నేతృత్వంలో గురువారం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌ రెడ్డి, వివేకానంద గౌడ్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌ రాష్ట్ర డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, బీఆర్​ఎస్​ నేతలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. పోలీస్‌ శాఖ ప్రతిష్ఠ దిగజారిపోతుందని, ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి భాష, ప్రవర్తనే ఈ ఘటనలకు కారణమని విమర్శించారు. సీఎం రేవంత్​ వేదికేదో అర్థంకాక సోయిలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కాంగ్రెస్​ నేతలు దాడికి సొంతంగా రాలేదు. పోలీసులను వెంటపెట్టుకుని వచ్చారు. లేదా పోలీసులే కాంగ్రెస్​ నాయకులను తీసుకొని వచ్చారు. ఇద్దరు కలిసి బీఆర్​ఎస్​ నేతలపై దాడులు చేస్తున్నారు. దీని వల్ల పోలీసు శాఖకు భంగం కలుగుతోంది. ప్రజలకు సైతం పోలీసుల మీద నమ్మకం పోతోంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డీజీపీకి ఉంది. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కారణం. పార్టీ శ్రేణులను ఆయన రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలుపై కేసీఆర్​ బాధ పడుతున్నారు. ఈ చిల్లర దాడులు మమ్మల్ని భయపెట్టవు. వాస్తవానికి దాడులపై సీఎం రేవంత్​ చర్యలు తీసుకోవాలి'-జగదీశ్‌రెడ్డి, మాజీమంత్రి

పార్టీ శ్రేణులను రేవంత్​రెడ్డి రెచ్చగొడుతున్నారు : పార్టీ శ్రేణులను రేవంత్​రెడ్డి రెచ్చగొడుతున్నారని మాజీమంత్రి జగదీశ్​ రెడ్డి దుయ్యబట్టారు. రేవంత్‌ రెడ్డి తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. చిల్లర దాడులు తమను భయపట్ట లేవన్నారు. తాము ఉద్యమాల నుంచి వచ్చామని, ఎలాంటి దాడులనైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. నల్గొండలో బీఆర్​ఎస్​ కార్యాలయంతో పాటు వివిధ పార్టీల కార్యాలయాలు ఉన్నాయని, ఇతర పార్టీల కార్యాలయాల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కష్టం కేసీఆర్‌దైతే బటన్‌ నొక్కేది మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు : జగదీశ్ రెడ్డి - BRS Jagadish Reddy On Sitarama

Jagadish reddy about Congress attack on BRS : రాష్ట్రంలో కింది స్థాయి పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఆదేశాలను పాటిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించి వస్తున్న తమ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక పోలీస్​లు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​పైనా దాడి చేస్తే చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వస్తుంటే ఏసీపీ, సీఐ అడ్డుకోలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఏసీపీ, సీఐపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

జగదీశ్​రెడ్డి నేతృత్వంలో గురువారం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌ రెడ్డి, వివేకానంద గౌడ్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌ రాష్ట్ర డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, బీఆర్​ఎస్​ నేతలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. పోలీస్‌ శాఖ ప్రతిష్ఠ దిగజారిపోతుందని, ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి భాష, ప్రవర్తనే ఈ ఘటనలకు కారణమని విమర్శించారు. సీఎం రేవంత్​ వేదికేదో అర్థంకాక సోయిలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కాంగ్రెస్​ నేతలు దాడికి సొంతంగా రాలేదు. పోలీసులను వెంటపెట్టుకుని వచ్చారు. లేదా పోలీసులే కాంగ్రెస్​ నాయకులను తీసుకొని వచ్చారు. ఇద్దరు కలిసి బీఆర్​ఎస్​ నేతలపై దాడులు చేస్తున్నారు. దీని వల్ల పోలీసు శాఖకు భంగం కలుగుతోంది. ప్రజలకు సైతం పోలీసుల మీద నమ్మకం పోతోంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డీజీపీకి ఉంది. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కారణం. పార్టీ శ్రేణులను ఆయన రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలుపై కేసీఆర్​ బాధ పడుతున్నారు. ఈ చిల్లర దాడులు మమ్మల్ని భయపెట్టవు. వాస్తవానికి దాడులపై సీఎం రేవంత్​ చర్యలు తీసుకోవాలి'-జగదీశ్‌రెడ్డి, మాజీమంత్రి

పార్టీ శ్రేణులను రేవంత్​రెడ్డి రెచ్చగొడుతున్నారు : పార్టీ శ్రేణులను రేవంత్​రెడ్డి రెచ్చగొడుతున్నారని మాజీమంత్రి జగదీశ్​ రెడ్డి దుయ్యబట్టారు. రేవంత్‌ రెడ్డి తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. చిల్లర దాడులు తమను భయపట్ట లేవన్నారు. తాము ఉద్యమాల నుంచి వచ్చామని, ఎలాంటి దాడులనైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. నల్గొండలో బీఆర్​ఎస్​ కార్యాలయంతో పాటు వివిధ పార్టీల కార్యాలయాలు ఉన్నాయని, ఇతర పార్టీల కార్యాలయాల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కష్టం కేసీఆర్‌దైతే బటన్‌ నొక్కేది మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు : జగదీశ్ రెడ్డి - BRS Jagadish Reddy On Sitarama

Last Updated : 7 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.