ETV Bharat / politics

వాళ్లు వెళ్లారు - వీళ్లు వచ్చారు - క్యాంపు రాజకీయాలకు అడ్డాగా హైదరాబాద్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 10:11 AM IST

Updated : Feb 5, 2024, 7:16 PM IST

Bihar MLAs Camp in Hyderabad : క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్​ వేదికగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఏదైనా రాజకీయ అనిశ్చితి ఏర్పడితే ఏఐసీసీ హైదరాబాద్​ను సురక్షిత ప్రాంతంగా ఎంచుకుంటుంది. ఆదివారం సాయంత్రం ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేలు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లగానే, బిహార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను నగరానికి తరలించింది.

Bihar MLAs Camp in Hyderabad
Bihar MLAs Camp in Hyderabad

Bihar MLAs Camp in Hyderabad : క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్​ వేదికైంది. బిహార్‌లో ఇటీవల జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో భాగంగా అక్కడి శాసనసభలో ఈ నెల 12న బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బిహార్‌లోని 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్​కు తరలించారు. వారు ప్రత్యేక విమానంలో పట్నా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్వాగతం పలికారు.

12 వరకు ఇక్కడే బిహార్‌ ఎమ్మెల్యేలు : స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో ఉండేలా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ రిసార్ట్స్​కు తీసుకెళ్లారు. ఇతరులెవరూ వారిని కలవకుండా కాంగ్రెస్‌ నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బిహార్‌ ఎమ్మెల్యేలను (Bihar Congress MLAs) ఈ నెల 12 వరకూ రిసార్టులోనే ఉంచాలని పై నుంచి ఆదేశాలున్నాయని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈలోగా పరిణామాలేమైనా మారితే తప్ప, 12వ తేదీ ఉదయం దాకా వారు ఇక్కడే ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలను ఒకే రిసార్ట్స్​లో ఉంచకుండా ప్రతి రెండు రోజులకు ఒకసారి వారిని రిసార్ట్స్ మార్చాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తొమ్మిదోసారి సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణం- డిప్యూటీలుగా సామ్రాట్, విజయ్

Bihar Congress MLAs in Hyderabad : బీజేపీ, జేడీయూ ప్రభుత్వం (Bihar Political Crisis)తమ పార్టీకి చెందిన బిహార్‌ ఎమ్మెల్యేలను వారి పక్షంలోకి లాగేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నందునే కాంగ్రెస్‌ హైకమాండ్ అప్రమత్తమై హైదరాబాద్‌కు పంపినట్లు సమాచారం. కాంగ్రెస్‌ శాసనసభ్యులు చీలిపోతారనే వదంతులు వ్యాప్తిలో ఉన్నా నిజానికి జేడీ(యూ) ఎమ్మెల్యేలపైనే విపరీతమైన ఒత్తిడి ఉందని ఏఐసీసీ బిహార్‌ వ్యవహారాల ఇంఛార్జ్ మోహన్‌ ప్రకాశ్‌ పట్నాలో తెలిపారు.

నేడు ఝార్ఖండ్‌ శాసనసభలో ప్రభుత్వం బలనిరూపణ : మరోవైపు గత మూడు రోజులుగా హైదరాబాద్‌ శివారు రిసార్ట్స్​లో ఉన్న ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేలు (Jharkhand MLAs)ఆదివారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్​పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లారు. ఈరోజు ఝార్ఖండ్‌ శాసనసభలో జేఎంఎం, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఉన్నందున వారు ఓటు వేసేందుకు వెళ్లారు. వారు ఇక్కడ ఉన్న మూడు రోజులూ రిసార్ట్స్​లో ఇతరులు ఎవ్వరినీ కలవకుండా రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంఛార్జ్ దీపా దాస్‌మున్షీ, ఇతర నాయకులు జాగ్రత్తలు తీసుకుని తిరిగి పంపారు.

చంపయీ బలపరీక్ష- అధిష్ఠానంపై ఎమ్మెల్యేల ఫైర్! ఏం జరిగింది?

Jharkhand Political Crisis 2024 : ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రిసార్ట్స్​కు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా వారిని కలుస్తారని ప్రచారం జరిగినా వెళ్లలేదు. జేఎంఎం, కాంగ్రెస్‌లకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ఎక్కడ తమవైపు తిప్పుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కడ కూలదోస్తుందో అన్న అనుమానంతో వారిని కాపాడుకునేందకు హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. మీడియాను కూడా దరిదాపుల్లోకి రానివ్వలేదు.

బిహార్ అసెంబ్లీ స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం! సీఎం తొలి కేబినెట్ మీటింగ్

జేడీయూ చేరిక NDAకు లాభమేనా? 40 సీట్లు క్లీన్​స్వీప్​ చేస్తారా?

Bihar MLAs Camp in Hyderabad : క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్​ వేదికైంది. బిహార్‌లో ఇటీవల జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో భాగంగా అక్కడి శాసనసభలో ఈ నెల 12న బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బిహార్‌లోని 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్​కు తరలించారు. వారు ప్రత్యేక విమానంలో పట్నా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్వాగతం పలికారు.

12 వరకు ఇక్కడే బిహార్‌ ఎమ్మెల్యేలు : స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో ఉండేలా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ రిసార్ట్స్​కు తీసుకెళ్లారు. ఇతరులెవరూ వారిని కలవకుండా కాంగ్రెస్‌ నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బిహార్‌ ఎమ్మెల్యేలను (Bihar Congress MLAs) ఈ నెల 12 వరకూ రిసార్టులోనే ఉంచాలని పై నుంచి ఆదేశాలున్నాయని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈలోగా పరిణామాలేమైనా మారితే తప్ప, 12వ తేదీ ఉదయం దాకా వారు ఇక్కడే ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలను ఒకే రిసార్ట్స్​లో ఉంచకుండా ప్రతి రెండు రోజులకు ఒకసారి వారిని రిసార్ట్స్ మార్చాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తొమ్మిదోసారి సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణం- డిప్యూటీలుగా సామ్రాట్, విజయ్

Bihar Congress MLAs in Hyderabad : బీజేపీ, జేడీయూ ప్రభుత్వం (Bihar Political Crisis)తమ పార్టీకి చెందిన బిహార్‌ ఎమ్మెల్యేలను వారి పక్షంలోకి లాగేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నందునే కాంగ్రెస్‌ హైకమాండ్ అప్రమత్తమై హైదరాబాద్‌కు పంపినట్లు సమాచారం. కాంగ్రెస్‌ శాసనసభ్యులు చీలిపోతారనే వదంతులు వ్యాప్తిలో ఉన్నా నిజానికి జేడీ(యూ) ఎమ్మెల్యేలపైనే విపరీతమైన ఒత్తిడి ఉందని ఏఐసీసీ బిహార్‌ వ్యవహారాల ఇంఛార్జ్ మోహన్‌ ప్రకాశ్‌ పట్నాలో తెలిపారు.

నేడు ఝార్ఖండ్‌ శాసనసభలో ప్రభుత్వం బలనిరూపణ : మరోవైపు గత మూడు రోజులుగా హైదరాబాద్‌ శివారు రిసార్ట్స్​లో ఉన్న ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేలు (Jharkhand MLAs)ఆదివారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్​పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లారు. ఈరోజు ఝార్ఖండ్‌ శాసనసభలో జేఎంఎం, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఉన్నందున వారు ఓటు వేసేందుకు వెళ్లారు. వారు ఇక్కడ ఉన్న మూడు రోజులూ రిసార్ట్స్​లో ఇతరులు ఎవ్వరినీ కలవకుండా రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంఛార్జ్ దీపా దాస్‌మున్షీ, ఇతర నాయకులు జాగ్రత్తలు తీసుకుని తిరిగి పంపారు.

చంపయీ బలపరీక్ష- అధిష్ఠానంపై ఎమ్మెల్యేల ఫైర్! ఏం జరిగింది?

Jharkhand Political Crisis 2024 : ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రిసార్ట్స్​కు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా వారిని కలుస్తారని ప్రచారం జరిగినా వెళ్లలేదు. జేఎంఎం, కాంగ్రెస్‌లకు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ ఎక్కడ తమవైపు తిప్పుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కడ కూలదోస్తుందో అన్న అనుమానంతో వారిని కాపాడుకునేందకు హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. మీడియాను కూడా దరిదాపుల్లోకి రానివ్వలేదు.

బిహార్ అసెంబ్లీ స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం! సీఎం తొలి కేబినెట్ మీటింగ్

జేడీయూ చేరిక NDAకు లాభమేనా? 40 సీట్లు క్లీన్​స్వీప్​ చేస్తారా?

Last Updated : Feb 5, 2024, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.