ETV Bharat / offbeat

హైదరాబాద్​ To తిరుపతి - ఉచితంగా శ్రీవారి శీఘ్రదర్శనం - పైగా ఈ ప్రదేశాలు కూడా! - Telangana Tourism Tirumala Tour

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 7:43 PM IST

Telangana Tourism Tirumala Tour: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. తెలంగాణ టూరిజం తిరుమల వెళ్లేందుకు అద్దరిపోయే టూర్‌ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana Tourism Tirupati Tirumala Tour
Telangana Tourism Tirupati Tirumala Tour (ETV Bharat)

Telangana Tourism Tirupati Tirumala Tour Details: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. ట్రైన్​, బస్సు.. అంటూ ఎలా వీలైతే అలా చేరుకుంటారు. అయితే ఎలా వెళ్లినా.. స్వామి వారిని దర్శించుకోవాలంటే ముందుగానే ప్లాన్​ చేసుకోవాలి. లేదంటే టికెట్లు లభించక లైన్లలో గంటల తరబడి వెయిట్​ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక పై అలాంటి అవసరం లేకుండా తెలంగాణ టూరిజం సంస్థ.. స్వామి వారిని దర్శించుకునేందుకు ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. అది కూడా తక్కువ ధరలోనే వెళ్లేందుకు అవకాశం కల్పిస్తోంది. మరి ధర ఎంత? ప్రయాణం ఎన్ని రోజులు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

TIRUPATI - TIRUMALA TOUR’ పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని అందుబాటులో తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ టూర్​ ఉంటుంది. ఈ ప్యాకేజీ 2 రాత్రులు, 1పగలు ఉంటుంది. ఈ ప్యాకేజీలో తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి.

ప్రయాణం వివరాలివే:

  • మొదటి రోజు సాయంత్రం 5 గంటలకు కూకట్​పల్లిలోని IRO నుంచి బస్సు బయల్దేరుతుంది. సాయత్రం 6 గంటలకు సికింద్రాబాద్​కు,​ 6:15 గంటలకు బేగంపేట్ టూరిజం ప్లాజాకు చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు బషీర్​బాగ్​ చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్లారు. ఫ్రెషప్ అయిన తర్వాత.. స్థానికంగా ఉన్న పలు ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత శ్రీవారి శీఘ్ర దర్శనం ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు. అక్కడ లంచ్​ చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్​కు రిటర్న్ జర్నీ స్టార్ట్​ అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్​కు చేరుకోవటంతో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.

శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్​ వే, బోట్​ జర్నీ! - తెలంగాణ టూరిజం సూపర్​ ప్యాకేజీలు!

ధరల వివరాలు చూస్తే:

  • ఈ ప్యాకేజీని బుక్​ చేసుకునేందుకు పెద్దలు రూ 3,700, పిల్లలు రూ. 2,960 చెల్లించాలి.
  • ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది.

ఇవి గమనించాలి:

  • ఈ ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాలి. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్ల కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారు. మీ డబ్బులు వాపస్ కూడా ఇవ్వరు.
  • అలాగే తిరుమల వెళ్లాలనుకుంటే వారం రోజుల ముందుగానే బుక్​ చేసుకోవాలి.
  • ఇక ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

"అల పాపికొండల్లో విహరిద్దామా" - తక్కువ ధరలో తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ!

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే గొప్ప అవకాశం - కేవలం 2 వేలకే "టెంపుల్​ టూర్" ప్యాకేజ్!

హైదరాబాద్​ To తిరుపతి - ఒక్కరోజులో శ్రీనివాసుడి దర్శనం! టికెట్​ ధర ఎంతంటే!

Telangana Tourism Tirupati Tirumala Tour Details: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. ట్రైన్​, బస్సు.. అంటూ ఎలా వీలైతే అలా చేరుకుంటారు. అయితే ఎలా వెళ్లినా.. స్వామి వారిని దర్శించుకోవాలంటే ముందుగానే ప్లాన్​ చేసుకోవాలి. లేదంటే టికెట్లు లభించక లైన్లలో గంటల తరబడి వెయిట్​ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక పై అలాంటి అవసరం లేకుండా తెలంగాణ టూరిజం సంస్థ.. స్వామి వారిని దర్శించుకునేందుకు ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. అది కూడా తక్కువ ధరలోనే వెళ్లేందుకు అవకాశం కల్పిస్తోంది. మరి ధర ఎంత? ప్రయాణం ఎన్ని రోజులు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

TIRUPATI - TIRUMALA TOUR’ పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని అందుబాటులో తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ టూర్​ ఉంటుంది. ఈ ప్యాకేజీ 2 రాత్రులు, 1పగలు ఉంటుంది. ఈ ప్యాకేజీలో తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి.

ప్రయాణం వివరాలివే:

  • మొదటి రోజు సాయంత్రం 5 గంటలకు కూకట్​పల్లిలోని IRO నుంచి బస్సు బయల్దేరుతుంది. సాయత్రం 6 గంటలకు సికింద్రాబాద్​కు,​ 6:15 గంటలకు బేగంపేట్ టూరిజం ప్లాజాకు చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు బషీర్​బాగ్​ చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్లారు. ఫ్రెషప్ అయిన తర్వాత.. స్థానికంగా ఉన్న పలు ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత శ్రీవారి శీఘ్ర దర్శనం ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు. అక్కడ లంచ్​ చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్​కు రిటర్న్ జర్నీ స్టార్ట్​ అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్​కు చేరుకోవటంతో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.

శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్​ వే, బోట్​ జర్నీ! - తెలంగాణ టూరిజం సూపర్​ ప్యాకేజీలు!

ధరల వివరాలు చూస్తే:

  • ఈ ప్యాకేజీని బుక్​ చేసుకునేందుకు పెద్దలు రూ 3,700, పిల్లలు రూ. 2,960 చెల్లించాలి.
  • ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది.

ఇవి గమనించాలి:

  • ఈ ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాలి. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్ల కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారు. మీ డబ్బులు వాపస్ కూడా ఇవ్వరు.
  • అలాగే తిరుమల వెళ్లాలనుకుంటే వారం రోజుల ముందుగానే బుక్​ చేసుకోవాలి.
  • ఇక ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

"అల పాపికొండల్లో విహరిద్దామా" - తక్కువ ధరలో తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ!

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే గొప్ప అవకాశం - కేవలం 2 వేలకే "టెంపుల్​ టూర్" ప్యాకేజ్!

హైదరాబాద్​ To తిరుపతి - ఒక్కరోజులో శ్రీనివాసుడి దర్శనం! టికెట్​ ధర ఎంతంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.