ETV Bharat / offbeat

హైదరాబాద్​ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! - IRCTC Ganga Sarayu Darshan Package

author img

By ETV Bharat Features Team

Published : Aug 21, 2024, 5:07 PM IST

IRCTC Latest Tour Packages: దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వారణాసి, అయోధ్యను దర్శించుకోవాలనుకుంటున్నారా? అది కూడా తక్కువ ధరలోనే కావాలా? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఆ ప్యాకేజీ వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

IRCTC Ganga Sarayu Darshan Tour
IRCTC Ganga Sarayu Darshan Package (ETV Bharat)

IRCTC Ganga Sarayu Darshan Package: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకొనే భక్తులకు, ప్రకృతి అందాలు వీక్షించాలనుకునే టూరిస్టుల కోసం ఇండియన్‌ రైల్వే అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అనేక టూరిజం ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తున్న సంగతి తెలిసిందే. అవి కూడా అందరికీ అందుబాటు ధరలోనే టూర్​లు నిర్వహిస్తోంది. మరి మీరు కూడా ఐఆర్​సీటీసీ ప్యాకేజీలు ఉపయోగించి పలు ప్రదేశాలు కవర్​ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. తాజాగా అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ టూర్​ ప్రయాణం ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు? ధర ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

గంగా సరయూ దర్శన్‌ (GANGA SARAYU DARSHAN) పేరిట IRCTC కొత్త టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. సికింద్రాబాద్​ నుంచి టూర్​ స్టార్ట్​ అవుతుంది. యాత్ర ముగించుకున్నాక సికింద్రాబాద్‌లో దిగాల్సి ఉంటుంది. ఈ ట్రిప్‌ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. అయోధ్య, వారణాసిలోని పలు ప్రదేశాలను సందర్శించవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

ప్రయాణం కొనసాగుతుందిలా..

  • మెదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్‌ (దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ నం: 12791) నుంచి టూర్​ ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని ముందుగా బుక్‌ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఆరోజు సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం, గంగ హారతి వీక్షిస్తారు. ఆ రాత్రి అక్కడే బస ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్ తర్వాత​ వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను (కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్‌ మందిర్‌, బిర్లా మందిర్​ను) సందర్శించుకోవచ్చు. సాయంత్రం షాపింగ్‌ ఉంటుంది. ఆ రాత్రి కూడాఅక్కడే స్టే చేయాలి.
  • నాలుగో రోజు టిఫెన్‌ తిన్నాక హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి అయోధ్య స్టార్ట్​ అవుతారు. అక్కడ హోటల్‌లో చెకిన్​ అయిన తర్వాత.. అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్‌ మహల్‌ను చూసి వస్తారు. ఇక సాయంత్రం సరయు ఘాట్‌ చూసేందుకు వెళ్తారు.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేస్తారు. ఆ తర్వాత ప్రయాగరాజ్​ స్టార్ట్​ అవుతారు. సాయంత్రానికి ప్రయాగరాజ్​ రైల్వే స్టేషన్​ చేరుకుంటారు. రాత్రి 7:15నిమిషాలకు సికింద్రాబాద్‌ (ట్రైన్‌ నం: 12792)కు ట్రైన్​ బయలుదేరుతుంది.
  • ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

హైద్రాబాద్​ To శ్రీలంక - రామాయణ జ్ఞాపకాలు చూసొస్తారా? - IRCTC స్పెషల్​ ప్యాకేజీ!

ఛార్జీలు ఇలా:

  • కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌): ఒక్కో ప్రయాణికుడికి రూమ్‌ సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.41,090, డబుల్​ షేరింగ్‌కు రూ.24,350, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.19,720గా నిర్ణయించారు. 5-11 ఏళ్ల మధ్య పిల్లలకు విత్ బెడ్‌ రూ.15,390, విత్ అవుట్ బెడ్ రూ.13,790గా చెల్లించాలి.
  • స్టాండర్డ్​(SL): ఒక్కో ప్రయాణికుడికి రూమ్​ సింగిల్​ షేరింగ్​ అయితే రూ.21,620, డబుల్​ షేరింగ్​ అయితే రూ.17,720, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.16,710గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 సంవత్సరాల మధ్య చిన్నారులకు విక్​ బెడ్​ అయితే రూ.13,620, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.12,010గా నిర్ణయించారు.

ఇవి గుర్తుంచుకోండి..

  • ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో (3 ఏసీ/ స్లీపర్‌ క్లాస్‌) ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి స్థానికంగా ప్రయాణానికి ఏసీ గదులు, వాహనం ఏర్పాటు చేస్తారు.
  • మూడు రోజులు బ్రేక్​ఫాస్ట్​, డిన్నర్​ ఉంటుంది.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ఎంట్రీ ఫీజులు ఉంటే సందర్శకులే చెల్లించాలి.
  • ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ సెప్టెంబర్​ 22, అక్టోబర్​ 6, 13, 20, 27వ తేదీల నుంచి అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్‌ కోసం ఈ లింక్​పై క్లిక్‌ చేయండి..

పూరీ జగన్నాథ ఆలయం To శ్రీరాముని జన్మస్థలం - వయా వారణాసి

ప్రకృతి అందాలకు నిలయమైన 'ఊటీ' చూసొస్తారా? - బడ్జెట్​ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

IRCTC Ganga Sarayu Darshan Package: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకొనే భక్తులకు, ప్రకృతి అందాలు వీక్షించాలనుకునే టూరిస్టుల కోసం ఇండియన్‌ రైల్వే అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అనేక టూరిజం ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తున్న సంగతి తెలిసిందే. అవి కూడా అందరికీ అందుబాటు ధరలోనే టూర్​లు నిర్వహిస్తోంది. మరి మీరు కూడా ఐఆర్​సీటీసీ ప్యాకేజీలు ఉపయోగించి పలు ప్రదేశాలు కవర్​ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. తాజాగా అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ టూర్​ ప్రయాణం ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు? ధర ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

గంగా సరయూ దర్శన్‌ (GANGA SARAYU DARSHAN) పేరిట IRCTC కొత్త టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. సికింద్రాబాద్​ నుంచి టూర్​ స్టార్ట్​ అవుతుంది. యాత్ర ముగించుకున్నాక సికింద్రాబాద్‌లో దిగాల్సి ఉంటుంది. ఈ ట్రిప్‌ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. అయోధ్య, వారణాసిలోని పలు ప్రదేశాలను సందర్శించవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

ప్రయాణం కొనసాగుతుందిలా..

  • మెదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్‌ (దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ నం: 12791) నుంచి టూర్​ ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని ముందుగా బుక్‌ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఆరోజు సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం, గంగ హారతి వీక్షిస్తారు. ఆ రాత్రి అక్కడే బస ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్ తర్వాత​ వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను (కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్‌ మందిర్‌, బిర్లా మందిర్​ను) సందర్శించుకోవచ్చు. సాయంత్రం షాపింగ్‌ ఉంటుంది. ఆ రాత్రి కూడాఅక్కడే స్టే చేయాలి.
  • నాలుగో రోజు టిఫెన్‌ తిన్నాక హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి అయోధ్య స్టార్ట్​ అవుతారు. అక్కడ హోటల్‌లో చెకిన్​ అయిన తర్వాత.. అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్‌ మహల్‌ను చూసి వస్తారు. ఇక సాయంత్రం సరయు ఘాట్‌ చూసేందుకు వెళ్తారు.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేస్తారు. ఆ తర్వాత ప్రయాగరాజ్​ స్టార్ట్​ అవుతారు. సాయంత్రానికి ప్రయాగరాజ్​ రైల్వే స్టేషన్​ చేరుకుంటారు. రాత్రి 7:15నిమిషాలకు సికింద్రాబాద్‌ (ట్రైన్‌ నం: 12792)కు ట్రైన్​ బయలుదేరుతుంది.
  • ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

హైద్రాబాద్​ To శ్రీలంక - రామాయణ జ్ఞాపకాలు చూసొస్తారా? - IRCTC స్పెషల్​ ప్యాకేజీ!

ఛార్జీలు ఇలా:

  • కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌): ఒక్కో ప్రయాణికుడికి రూమ్‌ సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.41,090, డబుల్​ షేరింగ్‌కు రూ.24,350, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.19,720గా నిర్ణయించారు. 5-11 ఏళ్ల మధ్య పిల్లలకు విత్ బెడ్‌ రూ.15,390, విత్ అవుట్ బెడ్ రూ.13,790గా చెల్లించాలి.
  • స్టాండర్డ్​(SL): ఒక్కో ప్రయాణికుడికి రూమ్​ సింగిల్​ షేరింగ్​ అయితే రూ.21,620, డబుల్​ షేరింగ్​ అయితే రూ.17,720, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.16,710గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 సంవత్సరాల మధ్య చిన్నారులకు విక్​ బెడ్​ అయితే రూ.13,620, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.12,010గా నిర్ణయించారు.

ఇవి గుర్తుంచుకోండి..

  • ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో (3 ఏసీ/ స్లీపర్‌ క్లాస్‌) ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి స్థానికంగా ప్రయాణానికి ఏసీ గదులు, వాహనం ఏర్పాటు చేస్తారు.
  • మూడు రోజులు బ్రేక్​ఫాస్ట్​, డిన్నర్​ ఉంటుంది.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ఎంట్రీ ఫీజులు ఉంటే సందర్శకులే చెల్లించాలి.
  • ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ సెప్టెంబర్​ 22, అక్టోబర్​ 6, 13, 20, 27వ తేదీల నుంచి అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్‌ కోసం ఈ లింక్​పై క్లిక్‌ చేయండి..

పూరీ జగన్నాథ ఆలయం To శ్రీరాముని జన్మస్థలం - వయా వారణాసి

ప్రకృతి అందాలకు నిలయమైన 'ఊటీ' చూసొస్తారా? - బడ్జెట్​ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.