ETV Bharat / offbeat

అటు ఆధ్యాత్మిక దర్శనాలు - ఇటు పర్యాటక ప్రదేశాలు - IRCTC అద్భుత ప్యాకేజీ! ధర కూడా తక్కువేనండోయ్​!

-ఎనిమిది రోజుల పాటు ఐఆర్​సీటీసీ ఉత్తరాఖండ్​ టూర్​ -ధర కూడా చాలా తక్కువ

author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Green Triangle of Uttarakhand Package
Green Triangle of Uttarakhand Package (ETV Bharat)

IRCTC Green Triangle of Uttarakhand Package : ఉత్తరాఖండ్ అంటేనే ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అందుకే ఈ ప్రదేశాన్ని దేవభూమిగా పిలుస్తుంటారు. అయితే ఇక్కడ ఉన్న దేవాలయాలను దర్శించుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసం ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ ఓ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. ​ ఒకే టూర్​లో అటు ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఇటు పర్యాటక ప్రదేశాలు చూసేలా ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఎంత ఖర్చవుతుందనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గ్రీన్​ ట్రయాంగిల్​ ఆఫ్​ ఉత్తరాఖండ్​ పేరుతో ఐఆర్​సీటీసీ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్​ మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా నైనితాల్​, అల్మోరా, మక్తేశ్వర్​, దిల్లీ వంటి ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు హైదరాబాద్​ నుంచి ఉదయం 6 గంటలకు ట్రైన్(నెం 12723)​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 8 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని హోటల్​కు చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్​ అయ్యి బ్రేక్​ఫాస్ట్​ కంప్లీట్​ చేసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కార్బెట్​ బయలుదేరుతారు. సాయంత్రానికి అక్కడికి చేరుకుని హోటల్లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత సఫారీ, కార్బెట్​ వాటర్​ ఫాల్స్​ విజిట్​ చేస్తారు. అక్కడి నుంచి నైనితాల్​ స్టార్ట్​ అవుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
  • నాలుగో రోజు నైనితాల్​లో పర్యాటక ప్రదేశాలను విజిట్​ చేస్తారు. ఆ రాత్రికీ అక్కడే ఉంటారు.
  • ఐదో రోజు అల్మోరా, ముక్తేశ్వర్​ సందర్శిస్తారు. ఆ రాత్రి కూడా నైనితాల్​లోనే బస చేస్తారు.
  • ఆరో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి దిల్లీకి బయలుదేరుతారు. అక్కడకు చేరుకున్న తర్వాత అక్షరధామ్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రికి దిల్లీలోనే బస చేస్తారు.
  • ఏడో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి కుతుబ్​ మినార్​, లోటస్​ టెంపుల్​ సందర్శిస్తారు. అనంతరం దిల్లీ రైల్వే స్టేషన్​లో డ్రాప్​ చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు దిల్లీ నుంచి ట్రైన్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • ఎనిమిదో రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ధర వివరాలు చూస్తే:

1 నుంచి ముగ్గురు ప్రయాణికులకు..

  • కంఫర్ట్​లో(3A) సింగిల్​ షేరింగ్​కు రూ.60,910, డబుల్​ షేరింగ్​కు రూ.34,480, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.27,020 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.19,960, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.18,440 పే చేయాలి.
  • స్టాండర్డ్​(SL)లో సింగిల్​ షేరింగ్​కు రూ.58,220, డబుల్​ షేరింగ్​కు రూ.31,630, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.24,120 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.16,970, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.15,440 పే చేయాలి.

4 నుంచి ఆరుగురు ప్రయాణికులకు:

  • కంఫర్ట్​లో(3A) డబుల్​ షేరింగ్​కు రూ.29,730, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకిరూ.25,530 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.19,960, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.18,440 పే చేయాలి.
  • స్టాండర్డ్​(SL) డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.26,870, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.22,640 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.16,970, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.15,440 పే చేయాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • హోటల్​ అకామిడేషన్​
  • 6 బ్రేక్​ఫాస్ట్​లు
  • సైట్​ సీయింగ్​ కోసం ప్యాకేజీని బట్టి వెహికల్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 12వ తేదీన అందుబాటులో ఉంది. ఇతర తేదీలు కూడా ఉన్నాయి.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి..

రాజస్థాన్​ కోటల రాజసం చూసేందుకు IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా చాలా తక్కువ!

ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ - ఆరు రోజుల పాటు మేఘాలయ, అస్సాం అందాలు చూడొచ్చు!

IRCTC Green Triangle of Uttarakhand Package : ఉత్తరాఖండ్ అంటేనే ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అందుకే ఈ ప్రదేశాన్ని దేవభూమిగా పిలుస్తుంటారు. అయితే ఇక్కడ ఉన్న దేవాలయాలను దర్శించుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసం ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ ఓ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. ​ ఒకే టూర్​లో అటు ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఇటు పర్యాటక ప్రదేశాలు చూసేలా ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఎంత ఖర్చవుతుందనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గ్రీన్​ ట్రయాంగిల్​ ఆఫ్​ ఉత్తరాఖండ్​ పేరుతో ఐఆర్​సీటీసీ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్​ మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా నైనితాల్​, అల్మోరా, మక్తేశ్వర్​, దిల్లీ వంటి ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు హైదరాబాద్​ నుంచి ఉదయం 6 గంటలకు ట్రైన్(నెం 12723)​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 8 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని హోటల్​కు చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్​ అయ్యి బ్రేక్​ఫాస్ట్​ కంప్లీట్​ చేసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కార్బెట్​ బయలుదేరుతారు. సాయంత్రానికి అక్కడికి చేరుకుని హోటల్లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత సఫారీ, కార్బెట్​ వాటర్​ ఫాల్స్​ విజిట్​ చేస్తారు. అక్కడి నుంచి నైనితాల్​ స్టార్ట్​ అవుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
  • నాలుగో రోజు నైనితాల్​లో పర్యాటక ప్రదేశాలను విజిట్​ చేస్తారు. ఆ రాత్రికీ అక్కడే ఉంటారు.
  • ఐదో రోజు అల్మోరా, ముక్తేశ్వర్​ సందర్శిస్తారు. ఆ రాత్రి కూడా నైనితాల్​లోనే బస చేస్తారు.
  • ఆరో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి దిల్లీకి బయలుదేరుతారు. అక్కడకు చేరుకున్న తర్వాత అక్షరధామ్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రికి దిల్లీలోనే బస చేస్తారు.
  • ఏడో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి కుతుబ్​ మినార్​, లోటస్​ టెంపుల్​ సందర్శిస్తారు. అనంతరం దిల్లీ రైల్వే స్టేషన్​లో డ్రాప్​ చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు దిల్లీ నుంచి ట్రైన్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • ఎనిమిదో రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ధర వివరాలు చూస్తే:

1 నుంచి ముగ్గురు ప్రయాణికులకు..

  • కంఫర్ట్​లో(3A) సింగిల్​ షేరింగ్​కు రూ.60,910, డబుల్​ షేరింగ్​కు రూ.34,480, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.27,020 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.19,960, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.18,440 పే చేయాలి.
  • స్టాండర్డ్​(SL)లో సింగిల్​ షేరింగ్​కు రూ.58,220, డబుల్​ షేరింగ్​కు రూ.31,630, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.24,120 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.16,970, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.15,440 పే చేయాలి.

4 నుంచి ఆరుగురు ప్రయాణికులకు:

  • కంఫర్ట్​లో(3A) డబుల్​ షేరింగ్​కు రూ.29,730, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకిరూ.25,530 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.19,960, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.18,440 పే చేయాలి.
  • స్టాండర్డ్​(SL) డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.26,870, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.22,640 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.16,970, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.15,440 పే చేయాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • హోటల్​ అకామిడేషన్​
  • 6 బ్రేక్​ఫాస్ట్​లు
  • సైట్​ సీయింగ్​ కోసం ప్యాకేజీని బట్టి వెహికల్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 12వ తేదీన అందుబాటులో ఉంది. ఇతర తేదీలు కూడా ఉన్నాయి.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి..

రాజస్థాన్​ కోటల రాజసం చూసేందుకు IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా చాలా తక్కువ!

ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ - ఆరు రోజుల పాటు మేఘాలయ, అస్సాం అందాలు చూడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.