ETV Bharat / offbeat

కేవలం 10 నిమిషాల్లోనే రుచికరమైన "పల్లీల రైస్"​ - పిల్లల లంచ్ బాక్స్​లోకి పర్ఫెక్ట్​ రెసిపీ!

-ఉదయాన్నే హడావుడి లేకుండా క్షణాల్లో తయారయ్యే పల్లీల రైస్​ -ఇలా చేస్తే పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగల్చరు!

author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Peanut Rice Recipe
How to Make Peanut Rice Recipe (ETV Bharat)

How to Make Peanut Rice Recipe : చాలా మంది తల్లులకు ఉదయాన్నే పిల్లలకు లంచ్​ బాక్స్ రెడీ చేసివ్వడం కష్టమైన పని. ఎందుకంటే, ఇంటి పని పూర్తి చేసిన తర్వాత వంట చేయడానికి ఎక్కువగా టైమ్​ ఉండదు. ఈలోపు స్కూల్​ బస్సు​ వస్తుందని లేదా టైమ్​ అవుతోందని ఎంతో హడావుడిగా ఉంటుంది. ఈ టెన్షన్​ నుంచి రిలీఫ్​ కావడానికి మీ కోసమే కేవలం పది నిమిషాల్లో రెడీ అయ్యే సూపర్​ లంచ్​బాక్స్​ రెసిపీని తీసుకొచ్చాం. అదే "కమ్మటి పల్లీల రైస్​". ఈ విధంగా రైస్​ చేసి పిల్లల లంచ్​బాక్స్​లో పెడితే మెతుకు మిగల్చకుండా పూర్తిగా తింటారు. అలాగే ఈ రైస్​ హెల్దీ కూడా. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా పల్లీల రైస్​ చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన టేస్టీ పల్లీల రైస్​ ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • అన్నం- పెద్ద కప్పు
  • పల్లీలు-పావు కప్పు
  • ఎండుమిర్చి-6
  • పచ్చి కొబ్బరి -అర కప్పు
  • నువ్వులు -పావు కప్పు
  • ఉప్పు రుచికి సరిపడా

తాలింపు కోసం..

  • నూనె -2 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు-అరటీస్పూన్​
  • శనగపప్పు-టీస్పూన్​
  • మినప్పప్పు-టీస్పూన్​
  • కరివేపాకు-2

తయారీ విధానం..

  • ముందుగా స్టౌపై కడాయి పెట్టి పల్లీలు దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
  • అదే కడాయిలో ఎండుమిర్చి వేసుకుని వేపుకుని పక్కకు పెట్టుకోండి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దోరగా ఫ్రై చేయండి. కొద్దిసేపటి తర్వాత నువ్వులు వేసి కాస్త వేయించండి.
  • ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, ఫ్రై చేసిన మిర్చి, కొబ్బరి, నువ్వుల మిశ్రమాన్ని వేసుకుని కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. అందుకోసం కడాయిలో ఆయిల్​ పోయండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు మగ్గిన తర్వాత ఇందులోకి అన్నం, రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్​ చేసుకున్న పల్లీల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్​ చేసుకుంటే.. వేడివేడిగా ఎంతో రుచిగా ఉండే పల్లీల రైస్​ రెడీ. దీనిపై గార్నిష్​ కోసం కొత్తిమీర చల్లుకున్నా టేస్ట్​ బాగుంటుంది. అంతేకాదు పల్లీలను నూనెలో వేయించి కూడా ఈ రైస్​లో కలుపుకోవచ్చు.
  • నచ్చితే మీరు కూడా ఇలా పల్లీల రైస్​ ట్రై చేయండి. ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా లాగించేస్తారు.

క్షణాల్లో అద్దిరిపోయే "మినప్పప్పు ఫ్రైడ్​ రైస్​"- ఒక్కసారి ఇలా చేయండి- రుచి అస్సలు మర్చిపోరు!

రాత్రి మిగిలిన అన్నం పొద్దున ఎవ్వరూ తినట్లేదా? - ఇలా పుదీనా పులావ్ చేయండి - మెతుకు మిగిలితే అడగండి!

How to Make Peanut Rice Recipe : చాలా మంది తల్లులకు ఉదయాన్నే పిల్లలకు లంచ్​ బాక్స్ రెడీ చేసివ్వడం కష్టమైన పని. ఎందుకంటే, ఇంటి పని పూర్తి చేసిన తర్వాత వంట చేయడానికి ఎక్కువగా టైమ్​ ఉండదు. ఈలోపు స్కూల్​ బస్సు​ వస్తుందని లేదా టైమ్​ అవుతోందని ఎంతో హడావుడిగా ఉంటుంది. ఈ టెన్షన్​ నుంచి రిలీఫ్​ కావడానికి మీ కోసమే కేవలం పది నిమిషాల్లో రెడీ అయ్యే సూపర్​ లంచ్​బాక్స్​ రెసిపీని తీసుకొచ్చాం. అదే "కమ్మటి పల్లీల రైస్​". ఈ విధంగా రైస్​ చేసి పిల్లల లంచ్​బాక్స్​లో పెడితే మెతుకు మిగల్చకుండా పూర్తిగా తింటారు. అలాగే ఈ రైస్​ హెల్దీ కూడా. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా పల్లీల రైస్​ చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన టేస్టీ పల్లీల రైస్​ ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • అన్నం- పెద్ద కప్పు
  • పల్లీలు-పావు కప్పు
  • ఎండుమిర్చి-6
  • పచ్చి కొబ్బరి -అర కప్పు
  • నువ్వులు -పావు కప్పు
  • ఉప్పు రుచికి సరిపడా

తాలింపు కోసం..

  • నూనె -2 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు-అరటీస్పూన్​
  • శనగపప్పు-టీస్పూన్​
  • మినప్పప్పు-టీస్పూన్​
  • కరివేపాకు-2

తయారీ విధానం..

  • ముందుగా స్టౌపై కడాయి పెట్టి పల్లీలు దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
  • అదే కడాయిలో ఎండుమిర్చి వేసుకుని వేపుకుని పక్కకు పెట్టుకోండి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దోరగా ఫ్రై చేయండి. కొద్దిసేపటి తర్వాత నువ్వులు వేసి కాస్త వేయించండి.
  • ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, ఫ్రై చేసిన మిర్చి, కొబ్బరి, నువ్వుల మిశ్రమాన్ని వేసుకుని కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. అందుకోసం కడాయిలో ఆయిల్​ పోయండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు మగ్గిన తర్వాత ఇందులోకి అన్నం, రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్​ చేసుకున్న పల్లీల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్​ చేసుకుంటే.. వేడివేడిగా ఎంతో రుచిగా ఉండే పల్లీల రైస్​ రెడీ. దీనిపై గార్నిష్​ కోసం కొత్తిమీర చల్లుకున్నా టేస్ట్​ బాగుంటుంది. అంతేకాదు పల్లీలను నూనెలో వేయించి కూడా ఈ రైస్​లో కలుపుకోవచ్చు.
  • నచ్చితే మీరు కూడా ఇలా పల్లీల రైస్​ ట్రై చేయండి. ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా లాగించేస్తారు.

క్షణాల్లో అద్దిరిపోయే "మినప్పప్పు ఫ్రైడ్​ రైస్​"- ఒక్కసారి ఇలా చేయండి- రుచి అస్సలు మర్చిపోరు!

రాత్రి మిగిలిన అన్నం పొద్దున ఎవ్వరూ తినట్లేదా? - ఇలా పుదీనా పులావ్ చేయండి - మెతుకు మిగిలితే అడగండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.