ETV Bharat / international

41ఏళ్లలో ఆస్ట్రియాకు తొలిసారి భారత ప్రధాని- ఇరు దేశాల మధ్య బాండింగ్ ఫుల్ స్ట్రాంగ్ అన్న మోదీ! - PM Modi Foreign Tour

PM Modi Austria Visit : భారత్- ఆస్ట్రియా మధ్య స్నేహబంధం రానున్న కాలంలో మరింత బలపడనుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆస్ట్రియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మార్ ఆతిథ్య విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇరుదేశాల బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 10:51 AM IST

Updated : Jul 10, 2024, 11:10 AM IST

PM Modi Austria Visit
PM Modi Austria Visit (ANI)

PM Modi Austria Visit : భారత్-ఆస్ట్రియా మధ్య స్నేహబంధం దృఢంగా ఉందని, రానున్న కాలంలో మరింత బలపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రియాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ఆతిథ్య విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత్- ఆస్ట్రియా బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక చర్చలకు ముందు ప్రధాని మోదీకి కార్ల్ నెహమ్మర్ విందు ఇచ్చారు.

అంతకుముందు వియన్నాకు చేరుకున్న ప్రధాని మోదీని కార్ల్ నెహమ్మర్ కౌగిలించుకున్నారు. అలాగే ప్రధానితో సెల్ఫీ సైతం దిగారు. "ప్రధాని మోదీకి స్వాగతం. మిమ్మల్ని ఆస్ట్రియాకు స్వాగతించడం ఆనందంగా, గౌరవంగా ఉంది. ఆస్ట్రియా- భారత్ మిత్ర దేశాలు. ఇరుదేశాల మధ్య బలమైన చర్చలు కోసం ఎదురుచూస్తున్నా" అని ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

41ఏళ్ల తర్వాత ఆస్ట్రియాకు
రష్యా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆస్ట్రియా చేరుకున్నారు. ఆస్ట్రియాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్‌ బర్గ్, భారత రాయబారి శంభు కుమారన్, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. కాగా, భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి. అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు.

కాగా, ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. "భారత్-ఆస్ట్రియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రధాని మోదీకి ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ వ్యక్తిగత ఆతిథ్యం ఇచ్చారు. ఇది ఇద్దరు నాయకుల మధ్య మొదటి సమావేశం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ముందుకు సాగుతున్నాయి." అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్​లో పోస్ట్ చేశారు. అలాగే ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.

ఛాన్సలర్ కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్​కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. "వియన్నాలో కార్ల్ నెహమ్మర్​ను కలవడం ఆనందంగా ఉంది. మీ ఆదరణ పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మన మధ్య జరిగే చర్చల కోసం ఎదురుచూస్తున్నాను. ఇరుదేశాలు ప్రపంచ ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తూనే ఉంటాయి. భారత్-ఆస్ట్రియా స్నేహం బలంగా ఉంది. రాబోయే కాలంలో అది మరింత బలపడుతుంది. ఆస్ట్రియా సంగీత సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. వందేమాతరం ట్యూన్ చేసినందుకు ఆస్ట్రియాకు ధన్యవాదాలు. " అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

వీటిపై చర్చంచే అవకాశం!
ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం, వివిధ బౌగోళిక రాజకీయ సవాళ్లపై చర్చించనున్నారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్, ఛాన్సలర్ కార్ల నెహమ్మర్ తో ప్రధాని మోదీ బుధవారం చర్చలు జరపనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

'బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు సఫలం కావు'- పుతిన్​కు ప్రధాని మోదీ పిలుపు! - Modi Russia Visit

PM Modi Austria Visit : భారత్-ఆస్ట్రియా మధ్య స్నేహబంధం దృఢంగా ఉందని, రానున్న కాలంలో మరింత బలపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రియాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ఆతిథ్య విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత్- ఆస్ట్రియా బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక చర్చలకు ముందు ప్రధాని మోదీకి కార్ల్ నెహమ్మర్ విందు ఇచ్చారు.

అంతకుముందు వియన్నాకు చేరుకున్న ప్రధాని మోదీని కార్ల్ నెహమ్మర్ కౌగిలించుకున్నారు. అలాగే ప్రధానితో సెల్ఫీ సైతం దిగారు. "ప్రధాని మోదీకి స్వాగతం. మిమ్మల్ని ఆస్ట్రియాకు స్వాగతించడం ఆనందంగా, గౌరవంగా ఉంది. ఆస్ట్రియా- భారత్ మిత్ర దేశాలు. ఇరుదేశాల మధ్య బలమైన చర్చలు కోసం ఎదురుచూస్తున్నా" అని ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

41ఏళ్ల తర్వాత ఆస్ట్రియాకు
రష్యా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆస్ట్రియా చేరుకున్నారు. ఆస్ట్రియాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్‌ బర్గ్, భారత రాయబారి శంభు కుమారన్, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. కాగా, భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి. అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధాని హోదాలో ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు.

కాగా, ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. "భారత్-ఆస్ట్రియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రధాని మోదీకి ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ వ్యక్తిగత ఆతిథ్యం ఇచ్చారు. ఇది ఇద్దరు నాయకుల మధ్య మొదటి సమావేశం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ముందుకు సాగుతున్నాయి." అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్​లో పోస్ట్ చేశారు. అలాగే ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.

ఛాన్సలర్ కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్​కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. "వియన్నాలో కార్ల్ నెహమ్మర్​ను కలవడం ఆనందంగా ఉంది. మీ ఆదరణ పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మన మధ్య జరిగే చర్చల కోసం ఎదురుచూస్తున్నాను. ఇరుదేశాలు ప్రపంచ ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తూనే ఉంటాయి. భారత్-ఆస్ట్రియా స్నేహం బలంగా ఉంది. రాబోయే కాలంలో అది మరింత బలపడుతుంది. ఆస్ట్రియా సంగీత సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. వందేమాతరం ట్యూన్ చేసినందుకు ఆస్ట్రియాకు ధన్యవాదాలు. " అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

వీటిపై చర్చంచే అవకాశం!
ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం, వివిధ బౌగోళిక రాజకీయ సవాళ్లపై చర్చించనున్నారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్, ఛాన్సలర్ కార్ల నెహమ్మర్ తో ప్రధాని మోదీ బుధవారం చర్చలు జరపనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

'బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు సఫలం కావు'- పుతిన్​కు ప్రధాని మోదీ పిలుపు! - Modi Russia Visit

Last Updated : Jul 10, 2024, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.