ETV Bharat / international

లెక్చరర్ టు ప్రభుత్వ సారథి- ఎవరీ మహ్మద్‌ యూనస్? - Bangladesh Crisis

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 3:39 PM IST

Muhammad Yunus History : సాధారణ లెక్చరర్‌గా మొదలైన ఆయన కెరీర్ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త మైలురాయికి చేరింది. త్వరలోనే బంగ్లాదేశ్‌లో ఏర్పడనున్న మధ్యంతర ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్‌ సారథ్యం వహించనున్నారు. ఆయన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Muhammad Yunus History
Muhammad Yunus History (Associated Press)

Muhammad Yunus History : షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఏర్పడనున్న మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు నోబెల్‌ గ్రహీత మహ్మద్ యూనస్‌ అంగీకరించారు. ఈమేరకు బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాల వేదిక చేసిన విజ్ఞప్తికి ఆయన ఓకే చెప్పారు. తనపై విశ్వాసంతో ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించాలని నిరసనకారులు కోరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల కోసం ఎటువంటి బాధ్యతలనైనా తీసుకుంటానని అన్నారు. అంతేకాకుండా దేశంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎవరీ యూనస్‌?
మహ్మద్‌ యూనస్ 1940 సంవత్సరం జూన్ 28న బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జన్మించారు. ఆయన ఎంఏ ఎకానమిక్స్‌ కోర్సును పూర్తి చేశాక, 1961లో చిట్టగాంగ్‌లోని ఓ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా సేవలు అందించారు. 1965 సంవత్సరంలో యూనస్‌కు అమెరికాలో ఉన్నత విద్య కోసం 'ఫుల్‌బ్రైట్' స్కాలర్‌షిప్ లభించింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లి వ్యాండర్ బిల్ట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో పీహెచ్‌డీ చేశారు. 1969 నుంచి 1972 వరకు మర్‌ఫ్రీ‌స్ బోరోలో ఉన్న మిడిల్ టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా యూనస్ సేవలు అందించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం సందర్భంగా ఓ పౌర సంఘాన్ని ఆయన స్థాపించారు. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పోరాటానికి మద్దతును సంపాదించేందుకు అమెరికా కేంద్రంగా బంగ్లాదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను యూనస్ నడిపారు. బంగ్లాదేశ్ ఒక దేశంగా ఆవిర్భవించిన తర్వాత ఆయన స్వదేశానికి తిరిగొచ్చారు. వెంటనే ఆయనకు దేశ ప్లానింగ్ కమిషన్‌లో సభ్యుడిగా అవకాశం లభించింది.

గ్రామీణ బ్యాంకు ఏర్పాటు
బంగ్లాదేశ్‌కు చెందిన చాలా రంగాల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు యూనస్ చాలా ప్రయత్నాలు చేశారు. గ్రామీణంలో బ్యాంక్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా లక్షలాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారు. సొంతంగా చిరు వ్యాపారాలను ప్రారంభించేందుకు తన మైక్రో ఫైనాన్స్ బ్యాంకు ద్వారా పేదలకు దీర్ఘకాలిక రుణాలను అందించారు. బంగ్లాదేశ్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో తన వంతు కృషి చేసినందుకు ఆయనను 2006లో నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. 2009లో యునైటెడ్‌ స్టేట్స్‌ ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌, 2010లో కాంగ్రెషనల్‌ గోల్డ్‌ మెడల్‌ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను యూనస్ పొందారు. 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్‌ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గానూ సేవలు అందించారు.

Muhammad Yunus History : షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఏర్పడనున్న మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు నోబెల్‌ గ్రహీత మహ్మద్ యూనస్‌ అంగీకరించారు. ఈమేరకు బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాల వేదిక చేసిన విజ్ఞప్తికి ఆయన ఓకే చెప్పారు. తనపై విశ్వాసంతో ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించాలని నిరసనకారులు కోరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల కోసం ఎటువంటి బాధ్యతలనైనా తీసుకుంటానని అన్నారు. అంతేకాకుండా దేశంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎవరీ యూనస్‌?
మహ్మద్‌ యూనస్ 1940 సంవత్సరం జూన్ 28న బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జన్మించారు. ఆయన ఎంఏ ఎకానమిక్స్‌ కోర్సును పూర్తి చేశాక, 1961లో చిట్టగాంగ్‌లోని ఓ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా సేవలు అందించారు. 1965 సంవత్సరంలో యూనస్‌కు అమెరికాలో ఉన్నత విద్య కోసం 'ఫుల్‌బ్రైట్' స్కాలర్‌షిప్ లభించింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లి వ్యాండర్ బిల్ట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో పీహెచ్‌డీ చేశారు. 1969 నుంచి 1972 వరకు మర్‌ఫ్రీ‌స్ బోరోలో ఉన్న మిడిల్ టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా యూనస్ సేవలు అందించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం సందర్భంగా ఓ పౌర సంఘాన్ని ఆయన స్థాపించారు. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పోరాటానికి మద్దతును సంపాదించేందుకు అమెరికా కేంద్రంగా బంగ్లాదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను యూనస్ నడిపారు. బంగ్లాదేశ్ ఒక దేశంగా ఆవిర్భవించిన తర్వాత ఆయన స్వదేశానికి తిరిగొచ్చారు. వెంటనే ఆయనకు దేశ ప్లానింగ్ కమిషన్‌లో సభ్యుడిగా అవకాశం లభించింది.

గ్రామీణ బ్యాంకు ఏర్పాటు
బంగ్లాదేశ్‌కు చెందిన చాలా రంగాల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు యూనస్ చాలా ప్రయత్నాలు చేశారు. గ్రామీణంలో బ్యాంక్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా లక్షలాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారు. సొంతంగా చిరు వ్యాపారాలను ప్రారంభించేందుకు తన మైక్రో ఫైనాన్స్ బ్యాంకు ద్వారా పేదలకు దీర్ఘకాలిక రుణాలను అందించారు. బంగ్లాదేశ్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో తన వంతు కృషి చేసినందుకు ఆయనను 2006లో నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. 2009లో యునైటెడ్‌ స్టేట్స్‌ ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌, 2010లో కాంగ్రెషనల్‌ గోల్డ్‌ మెడల్‌ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను యూనస్ పొందారు. 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్‌ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గానూ సేవలు అందించారు.

రగులుతున్న బంగ్లాదేశ్​- వెంటాడి, వేటాడి హసీనా పార్టీ నేతల ఊచకోత- హీరోను కూడా వదల్లేదు! - bangladesh crisis Updates

'దేశ వనరులు వృథా చేస్తున్నారు' - బంగ్లాదేశ్ అల్లర్లుపై మాజీ ప్రధాని ఖలీదా జియా ఆవేదన! - Bangladesh Crisis

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.