ETV Bharat / international

కువైట్​ అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వాల అండ- రంగంలోకి వాయుసేన - Kuwait Fire Accident Indians

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 4:12 PM IST

Kuwait Fire Accident Indians : కువైట్‌ అగ్నిప్రమాద ఘటనలో బాధితులకు కేంద్రం, బాధిత రాష్ట్రాల ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. అగ్నిప్రమాదంలో 49 మంది చనిపోగా 42మంది భారతీయులే అని తెలియడం వల్ల విదేశాంగశాఖ సహాయమంత్రి క్రితి వర్దన్ సింగ్‌ను ప్రధాని మోదీ కువైట్ పంపారు. భారతీయుల మృతదేహాలను స్వదేశం తెచ్చే కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. ప్రమాదంలో కాలిపోయిన మృతదేహాలను గుర్తించేందుకు కువైట్‌ ప్రభుత్వం DNA పరీక్షలు చేయిస్తోంది.

Kuwait Fire Accident Indians
Kuwait Fire Accident Indians (Associated Press)

Kuwait Fire Accident Indians : కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి క్రితి వర్దన్‌ సింగ్‌ ఇప్పటికే కువైట్ చేరుకుని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని ఆదేశాల మేరకు కువైట్ చేరుకున్న ఆయన, ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తెచ్చే చర్యలను పర్యవేక్షించనున్నారు.
కువైట్‌లో సజీవదహనమైనవారి భౌతిక కాయాలకు అక్కడి అధికారులు DNA పరీక్షలు చేయిస్తున్నారు. DNA పరీక్షల తర్వాత భారతీయులను మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వాయుసేన విమానాన్ని సిద్ధంగా ఉంచింది.

మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్​గ్రేషియా
కువైట్‌లోని అల్‌-మాంగాఫ్‌ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 42 మంది భారతీయులేనని తెలుస్తోంది. మిగిలినవారు పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్‌, నేపాలీ వాసులని సమాచారం. ఇది చాలా విషాదకరమైన ఘటనగా అభివర్ణించిన ప్రధాని మోదీ, కేంద్రం తరపున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కువైట్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ భారతీయుల మృతదేహాలను వీలైనంత త్వరగా పంపే ఏర్పాటు చేయాలని కోరారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కృతి వర్దన్ సింగ్‌ ఇప్పటికే కువైట్‌ చేరుకుని ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

24మంది కేరళ వాసులు మృతి
కువైట్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన కేరళ వాసుల సంఖ్య 24కు పెరిగింది. మరో ఏడుగురు కేరళవాసులు తీవ్ర గాయాలతో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దేశ, విదేశాల్లో ఉండే కేరళ వాసుల సంక్షేమం కోసం 1996లో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాన్‌రెసిడెంట్‌ కేరలైట్స్ ఎఫైర్స్‌-N.O.R.K.A” సంస్థ కువైట్ ఘటన బాధితులకు సహాయ సహకారాలు అందిస్తోంది. N.O.R.K.A ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ కువైట్‌లోని భారత దౌత్యకార్యాలయంతో సమన్వయం చేసుకుంటోంది. అక్కడ మృతిచెందిన కేరళ వాసుల మృతదేహాలను తెచ్చేందుకు అవసరమైన పత్రాలు నింపేందుకు సహకరిస్తోంది.

బాధితులకు కేరళ ప్రభుత్వం ఆర్థిక సాయం
కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై అత్యవసరంగా సమావేశమైన కేరళ మంత్రివర్గం, మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించింది. క్షతగాత్రలకు లక్షచొప్పున అందిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కేరళ ఆరోగ్యమంత్రి

వీణా జార్జ్‌, అధికారులతో కలిసి కువైట్‌ వెళ్లి, సహాయ చర్యలను సమన్వయం చేస్తారని CMO తెలిపింది. కేరళకు చెందిన వ్యాపారవేత్త MA యూసుఫ్‌ అలీ, అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున, మరో వ్యాపారవేత్త రవి పిళ్లై, రెండేసి లక్షల రూపాయల చొప్పున ఇస్తామని కేరళ ప్రభుత్వానికి చెప్పారు. మొత్తంగా కేరళకు చెందిన మృతుల కుటుంబాలకు రూ.12లక్షల చొప్పున సాయం అందజేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

నలుగురు తమిళనాడు వాసులు మృతి
కువైట్‌ ఘటనలో ఐదుగురు తమిళులు చనిపోయినట్లు తమిళనాడు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి గింజీ కె.ఎస్. మస్తాన్‌ ప్రకటించారు. బాధితులంతా తంజావూరు, రామనాథపురం, పెరవురని ప్రాంతాలకు చెందిన వారిని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకు మృతదేహాలను తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. క్షతగాత్రులు కోలుకునేందుకు సాయం చేస్తామన్నారు.

కువైట్​ అగ్నిప్రమాదంపై మోదీ సమీక్ష- రూ.2లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటన- ఘటనపై జైశంకర్ ఆరా - Kuwait Fire Accident

ఇంట్లో చెలరేగిన మంటలు- ఒకే ఫ్యామిలీలోని ఐదుగురు సజీవదహనం- కారణం అదేనా?

Kuwait Fire Accident Indians : కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి క్రితి వర్దన్‌ సింగ్‌ ఇప్పటికే కువైట్ చేరుకుని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని ఆదేశాల మేరకు కువైట్ చేరుకున్న ఆయన, ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తెచ్చే చర్యలను పర్యవేక్షించనున్నారు.
కువైట్‌లో సజీవదహనమైనవారి భౌతిక కాయాలకు అక్కడి అధికారులు DNA పరీక్షలు చేయిస్తున్నారు. DNA పరీక్షల తర్వాత భారతీయులను మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వాయుసేన విమానాన్ని సిద్ధంగా ఉంచింది.

మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్​గ్రేషియా
కువైట్‌లోని అల్‌-మాంగాఫ్‌ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 42 మంది భారతీయులేనని తెలుస్తోంది. మిగిలినవారు పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్‌, నేపాలీ వాసులని సమాచారం. ఇది చాలా విషాదకరమైన ఘటనగా అభివర్ణించిన ప్రధాని మోదీ, కేంద్రం తరపున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కువైట్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ భారతీయుల మృతదేహాలను వీలైనంత త్వరగా పంపే ఏర్పాటు చేయాలని కోరారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కృతి వర్దన్ సింగ్‌ ఇప్పటికే కువైట్‌ చేరుకుని ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

24మంది కేరళ వాసులు మృతి
కువైట్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన కేరళ వాసుల సంఖ్య 24కు పెరిగింది. మరో ఏడుగురు కేరళవాసులు తీవ్ర గాయాలతో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దేశ, విదేశాల్లో ఉండే కేరళ వాసుల సంక్షేమం కోసం 1996లో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాన్‌రెసిడెంట్‌ కేరలైట్స్ ఎఫైర్స్‌-N.O.R.K.A” సంస్థ కువైట్ ఘటన బాధితులకు సహాయ సహకారాలు అందిస్తోంది. N.O.R.K.A ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ కువైట్‌లోని భారత దౌత్యకార్యాలయంతో సమన్వయం చేసుకుంటోంది. అక్కడ మృతిచెందిన కేరళ వాసుల మృతదేహాలను తెచ్చేందుకు అవసరమైన పత్రాలు నింపేందుకు సహకరిస్తోంది.

బాధితులకు కేరళ ప్రభుత్వం ఆర్థిక సాయం
కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై అత్యవసరంగా సమావేశమైన కేరళ మంత్రివర్గం, మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించింది. క్షతగాత్రలకు లక్షచొప్పున అందిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కేరళ ఆరోగ్యమంత్రి

వీణా జార్జ్‌, అధికారులతో కలిసి కువైట్‌ వెళ్లి, సహాయ చర్యలను సమన్వయం చేస్తారని CMO తెలిపింది. కేరళకు చెందిన వ్యాపారవేత్త MA యూసుఫ్‌ అలీ, అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున, మరో వ్యాపారవేత్త రవి పిళ్లై, రెండేసి లక్షల రూపాయల చొప్పున ఇస్తామని కేరళ ప్రభుత్వానికి చెప్పారు. మొత్తంగా కేరళకు చెందిన మృతుల కుటుంబాలకు రూ.12లక్షల చొప్పున సాయం అందజేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

నలుగురు తమిళనాడు వాసులు మృతి
కువైట్‌ ఘటనలో ఐదుగురు తమిళులు చనిపోయినట్లు తమిళనాడు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి గింజీ కె.ఎస్. మస్తాన్‌ ప్రకటించారు. బాధితులంతా తంజావూరు, రామనాథపురం, పెరవురని ప్రాంతాలకు చెందిన వారిని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకు మృతదేహాలను తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. క్షతగాత్రులు కోలుకునేందుకు సాయం చేస్తామన్నారు.

కువైట్​ అగ్నిప్రమాదంపై మోదీ సమీక్ష- రూ.2లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటన- ఘటనపై జైశంకర్ ఆరా - Kuwait Fire Accident

ఇంట్లో చెలరేగిన మంటలు- ఒకే ఫ్యామిలీలోని ఐదుగురు సజీవదహనం- కారణం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.