ETV Bharat / international

ప్రాసిక్యూటర్​ టు ప్రెసిడెంట్​- ఎవరీ రైసీ? నెక్స్ట్​ అధ్యక్షుడు ఆయనే - iran president helicopter crash

Iran President Helicopter Crash : ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ ఇబ్రహీం రైసీని భావించే వారు. చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఆయన ఎదిగారు. ప్రాసిక్యూటర్‌గా జీవితం మొదలుపెట్టిన ఇబ్రహీం రైసీ, ఇరాన్‌ అధ్యక్ష స్థానానికి చేరుకొన్నారు. భవిష్యత్తులో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ పీఠాన్ని అధిరోహిస్తారని భావించిన వేళ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం ఆ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.

author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 1:31 PM IST

Updated : May 20, 2024, 2:33 PM IST

Iran President Helicopter Crash
Iran President Helicopter Crash (Associated Press)

Iran President Helicopter Crash : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం, సిరియా సంక్షోభం, అణు ఒప్పందం, ఎర్ర సముద్రంలో హూతీ రెబెల్స్‌ దాడులు వంటి పలు సంక్షోభాలు నెలకొన్న వేళ ఇరాన్‌ వ్యూహాలను నడిపించాల్సిన అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి ఇద్దరూ హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ దేశానికి ఎదురు దెబ్బే.

మహమ్మద్‌ రైసీ ఇరాన్‌లోని బలమైన సంప్రదాయ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన 15వ ఏట క్వామ్‌లో మత విద్యను అభ్యసించారు. అక్కడే గతంలో ఇరాన్‌లోని ప్రముఖ ముస్లిం స్కాలర్లు కూడా చదువుకొన్నారు. రైసీ 20వ ఏట ఆయన్ను ప్రభుత్వం ప్రాసిక్యూటర్‌గా నియమించింది. పలు నగరాల్లో రైసీ విధులు నిర్వహించారు. 1983లో జమైలానుమను రైసీ వివాహం చేసుకొన్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1988లో రైసీ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన బాధ్యతలను స్వీకరించారు. రాజకీయ ఖైదీలకు మరణశిక్షలను ఆయన పర్యవేక్షించారు. ఈ పదవితో ఆయన ప్రతిపక్షాల్లో అపఖ్యాతి పాలయ్యారు. అమెరికా కూడా ఆయనపై ఆంక్షలు విధించింది.

తొలిసారి పోటీ చేసి ఓటమి
1989లో ఖొమైనీ మరణం తర్వాత టెహ్రాన్‌ ప్రాసిక్యూటర్‌గా రైసీ బాధ్యతలను అందుకొన్నారు. 2016లో మషాద్‌లోని అస్టాన్‌ ఖుద్స్‌ రజావీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2015లో ఇరాన్‌ అణుఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో నాటి అధ్యక్షుడు హసన్‌ రౌహానీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ, దేశంలోని అతివాద వర్గం నుంచి బలమైన మద్దతు ఆయనకు లభించింది. నాటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. 2021లో ఆయన కల నెరవేరి ఆ ఎన్నికల్లో గెలిచారు. అప్పటికే ట్రంప్‌ అమెరికాను అణుఒప్పందం నుంచి బయటకు తెచ్చేశారు.

దివంగత ఖొమైనీ, ప్రస్తుతం సుప్రీం లీడర్‌ ఖమేనీలతో రైసీకి మంచి సంబంధాలున్నాయి. ఆయన సైన్యం, న్యాయ, పాలన విభాగాలతో అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తారనే పేరుంది. 2022లో మాషా అమిని అనే యువతిపై ఇరాన్‌ మోరల్‌ పోలీసులు దాడి చేసి చంపడం వల్ల రైసీ సర్కారుపై దేశవ్యాప్తంగా తొలిసారి వ్యతిరేకత వచ్చింది. ఈ అల్లర్లలో దాదాపు 500 మంది చనిపోయి ఉంటారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌, హుతీల దుందుడుకు చర్యలు వంటి వివాదాల్లో ఇరాన్‌ వైఖరిని రైసీనే నిర్దేశించారు. దీనికి తోడు సిరియాలో ఇరాన్‌ దౌత్యకార్యాలయంపై దాడికి తీవ్రంగా స్పందించారు. నేరుగా ఇజ్రాయెల్‌పైకి వందల కొద్దీ డ్రోన్లను పంపారు.

నెక్స్ట్​ ప్రెసిడెంట్​ ఆయనే
మరోవైపు రైసీ మరణం నేపథ్యంలో ఇరాన్​ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు మహ్మద్​ మోక్బర్​ను నియమించారు సుప్రీం నేత అయోతల్లా ఖమోని. ఐదు రోజుల పాటు దేశంలో సంతాప దినాలు ప్రకటించారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్‌ 131లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పార్లమెంట్ స్పీకర్‌, న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది గరిష్ఠంగా 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు దుర్మరణం - ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - Iran President Helicopter Crash

ఇరాన్​ అధ్యక్షుడి హెలికాప్టర్​కు ప్రమాదం- అందరిలోనూ టెన్షన్ టెన్షన్ - Iran President Helicopter Accident

Iran President Helicopter Crash : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం, సిరియా సంక్షోభం, అణు ఒప్పందం, ఎర్ర సముద్రంలో హూతీ రెబెల్స్‌ దాడులు వంటి పలు సంక్షోభాలు నెలకొన్న వేళ ఇరాన్‌ వ్యూహాలను నడిపించాల్సిన అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి ఇద్దరూ హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ దేశానికి ఎదురు దెబ్బే.

మహమ్మద్‌ రైసీ ఇరాన్‌లోని బలమైన సంప్రదాయ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన 15వ ఏట క్వామ్‌లో మత విద్యను అభ్యసించారు. అక్కడే గతంలో ఇరాన్‌లోని ప్రముఖ ముస్లిం స్కాలర్లు కూడా చదువుకొన్నారు. రైసీ 20వ ఏట ఆయన్ను ప్రభుత్వం ప్రాసిక్యూటర్‌గా నియమించింది. పలు నగరాల్లో రైసీ విధులు నిర్వహించారు. 1983లో జమైలానుమను రైసీ వివాహం చేసుకొన్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1988లో రైసీ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన బాధ్యతలను స్వీకరించారు. రాజకీయ ఖైదీలకు మరణశిక్షలను ఆయన పర్యవేక్షించారు. ఈ పదవితో ఆయన ప్రతిపక్షాల్లో అపఖ్యాతి పాలయ్యారు. అమెరికా కూడా ఆయనపై ఆంక్షలు విధించింది.

తొలిసారి పోటీ చేసి ఓటమి
1989లో ఖొమైనీ మరణం తర్వాత టెహ్రాన్‌ ప్రాసిక్యూటర్‌గా రైసీ బాధ్యతలను అందుకొన్నారు. 2016లో మషాద్‌లోని అస్టాన్‌ ఖుద్స్‌ రజావీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2015లో ఇరాన్‌ అణుఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో నాటి అధ్యక్షుడు హసన్‌ రౌహానీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ, దేశంలోని అతివాద వర్గం నుంచి బలమైన మద్దతు ఆయనకు లభించింది. నాటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. 2021లో ఆయన కల నెరవేరి ఆ ఎన్నికల్లో గెలిచారు. అప్పటికే ట్రంప్‌ అమెరికాను అణుఒప్పందం నుంచి బయటకు తెచ్చేశారు.

దివంగత ఖొమైనీ, ప్రస్తుతం సుప్రీం లీడర్‌ ఖమేనీలతో రైసీకి మంచి సంబంధాలున్నాయి. ఆయన సైన్యం, న్యాయ, పాలన విభాగాలతో అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తారనే పేరుంది. 2022లో మాషా అమిని అనే యువతిపై ఇరాన్‌ మోరల్‌ పోలీసులు దాడి చేసి చంపడం వల్ల రైసీ సర్కారుపై దేశవ్యాప్తంగా తొలిసారి వ్యతిరేకత వచ్చింది. ఈ అల్లర్లలో దాదాపు 500 మంది చనిపోయి ఉంటారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌, హుతీల దుందుడుకు చర్యలు వంటి వివాదాల్లో ఇరాన్‌ వైఖరిని రైసీనే నిర్దేశించారు. దీనికి తోడు సిరియాలో ఇరాన్‌ దౌత్యకార్యాలయంపై దాడికి తీవ్రంగా స్పందించారు. నేరుగా ఇజ్రాయెల్‌పైకి వందల కొద్దీ డ్రోన్లను పంపారు.

నెక్స్ట్​ ప్రెసిడెంట్​ ఆయనే
మరోవైపు రైసీ మరణం నేపథ్యంలో ఇరాన్​ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు మహ్మద్​ మోక్బర్​ను నియమించారు సుప్రీం నేత అయోతల్లా ఖమోని. ఐదు రోజుల పాటు దేశంలో సంతాప దినాలు ప్రకటించారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్‌ 131లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పార్లమెంట్ స్పీకర్‌, న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది గరిష్ఠంగా 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు దుర్మరణం - ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - Iran President Helicopter Crash

ఇరాన్​ అధ్యక్షుడి హెలికాప్టర్​కు ప్రమాదం- అందరిలోనూ టెన్షన్ టెన్షన్ - Iran President Helicopter Accident

Last Updated : May 20, 2024, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.