ETV Bharat / entertainment

అత్యధిక మంది చూసిన ఇండియన్ వెబ్​ సిరీస్​ ఇదే - స్ట్రీమింగ్​ ఎక్కడంటే? - Most watched Indian web series

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 7:28 PM IST

Most Watched Indian Web series : బడా స్టార్ లేకపోయినా, భారీ బడ్జెట్​తో రూపొందించకపోయినా హీరామండీ, ఇండియన్ పోలీస్ ఫోర్స్ వంటి టాప్ సిరీస్​లను మించి విశేష ఆదరణ దక్కించుకుంది ఓ వెబ్​ సిరీస్​. ఎక్కువ మంది చూసిన ఇండియన్ వెబ్ సిరిస్​గా నిలిచింది. ఇంతకీ అదేంటంటే?

source Getty Images
Most Watched Indian Web series (source Getty Images)

Most Watched Indian Web series : ఓవైపు బాక్సాఫీస్‌ వద్ద వినోదాల జోరు కొనసాగుతున్నా మరోవైపు ఓటీటీలోనూ అదే స్థాయిలో వరుసగా సినిమా, సిరీస్​లు రిలీజ్ అవుతూ నాన్​ స్టాప్​గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఎందుకంటే సినిమా అభిమానులు, వెబ్​ సిరీస్ లవర్స్​ అభిరుచికి తగ్గట్టుగా కంటెంట్​లను తీసుకొస్తున్నాయి పలు ఓటీటీ సంస్థలు. టాలీవుడ్ టు బాలీవుడ్ - అగ్రస్థాయి నటులతో స్ట్రీమింగ్​ అవుతున్న సినిమాలతో పాటు చిన్న నటులతో రూపొందుతున్న ప్రాజెక్ట్​లు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కంటెంట్​ ఉండాలే కానీ నటుల ఇమేజ్‌తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటున్నాయి. అలా పెద్ద పెద్ద స్టార్లు లేకుండా తక్కువ పెట్టుబడితో రూపొంది హీరామండీ, ఇండియన్ పోలీస్ ఫోర్స్ వంటి టాప్ షోల కన్నా ఎక్కువ వీక్షకులను పొందింది రికార్డు సృష్టించింది ఓ వెబ్ సిరీస్.

అదేంటంటే? - ఆర్మాక్స్​ మీడియా ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం 2024 మొదటి ఆరు నెలల్లో ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన భారతీయ సిరీస్​గా "పంచాయత్" నిలిచింది. మే 28, 2024న అమెజాన్ ప్రైమ్​ వీడియోలో విడుదలైన ఈ సిరీస్​ మూడో సీజన్​ ఇప్పటి వరకూ 28.2 మిలియన్ల వీక్షకులను దక్కించుకుంది. తద్వారా ఇప్పటివరకూ అత్యధిక వ్యూస్ దక్కించుకున్న హీరామండి సిరీస్​ను రెండో స్థానంలోకి నెట్టింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​​ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతోన్న హీరామండీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్​తో తెరకెక్కించారు. భారతీయ వెబ్​సిరీస్​లోనే ఇది అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్. బాలీవుడ్​కు చెందిన ప్రముఖ నటులతో రూ.250కోట్లకు పైగా పెట్టుబడితో దీన్ని చిత్రీకరించారు. ఇది ఇప్పటివరకు 20.3 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.

దీని తర్వాత అత్యధిక స్థాయిలో 19.5 మిలియన్ల వ్యూయర్లను దక్కించుకున్న సిరీస్​గా ఇండియన్ పోలీస్ ఫోర్స్ నిలిచింది. దీంతో మొదటి స్థానంలో పంచాయత్​, రెండో స్థానంలో హీరామండి ఉండగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్ మూడో స్థానంలో నిలిచింది. ఇక ఓటీటీ షో బిగ్ బాస్-3 17.8మిలియన్ల వ్యూస్​తో ఓటీటీలో ఎక్కువమంది చూసిన నాన్ ఫిక్షన్ షోగా నిలిచింది.

పంచాయత్ సీజన్ 3 విషయానికొస్తే చందన్ కుమార్ రచించిన ఈ కథను ది వైరల్ పవర్ సంస్థ నిర్మాణంలో దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కించారు. గతంలో విడుదలైన పంచాయత్ వెబ్ సిరీస్ రెండు సీజన్లు మంచి ఆదరణ దక్కించుకోవడంతో ఈ ఏడాది మూడో సీజన్​ను రిలీజ్ చేశారు. పంచాయత్-3 అనేది గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఎలా ఉంటాయిస, స్థానిక వ్యవహారాలు ఎలా ఉంటాయి అనే విషయాలను చాలా ఎమోషనల్​గా చూపించారు. ప్రముఖ నటుడు జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించగా నీనా గుప్తా, రఘబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైజల్ మాలిక్ దుర్గేష్ కుమార్, పంకజ్ ఝాలు ముఖ్య పాత్రలు పోషించారు. వాస్తవానికి ఇవన్నీ తెలిసిన పేర్లే అయినప్పటికీ వీరిలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకూ పెద్ద పెద్ద షోలు, సినిమాలు చేసింది లేదు. అయినప్పటికీ పెద్ద పెద్ద షోలన్నింటినీ అధిగమించి ఈ సిరీస్ అత్యధిక వీక్షకులను సాధించి విమర్శకుల ప్రశంసలను పొందుతుంది.

సినిమాల్లోకి షారుక్‌ ఖాన్‌ చిన్న కొడుకు - ట్రైలర్ అదిరింది - Mufasa The lion king

ఇండిపెండెన్స్ డే వీక్- థియేటర్లలో హై వోల్టేజ్ మూవీస్- OTTలో క్రేజీ సిరీస్​లు - Independence Day Movie Releases

Most Watched Indian Web series : ఓవైపు బాక్సాఫీస్‌ వద్ద వినోదాల జోరు కొనసాగుతున్నా మరోవైపు ఓటీటీలోనూ అదే స్థాయిలో వరుసగా సినిమా, సిరీస్​లు రిలీజ్ అవుతూ నాన్​ స్టాప్​గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఎందుకంటే సినిమా అభిమానులు, వెబ్​ సిరీస్ లవర్స్​ అభిరుచికి తగ్గట్టుగా కంటెంట్​లను తీసుకొస్తున్నాయి పలు ఓటీటీ సంస్థలు. టాలీవుడ్ టు బాలీవుడ్ - అగ్రస్థాయి నటులతో స్ట్రీమింగ్​ అవుతున్న సినిమాలతో పాటు చిన్న నటులతో రూపొందుతున్న ప్రాజెక్ట్​లు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కంటెంట్​ ఉండాలే కానీ నటుల ఇమేజ్‌తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటున్నాయి. అలా పెద్ద పెద్ద స్టార్లు లేకుండా తక్కువ పెట్టుబడితో రూపొంది హీరామండీ, ఇండియన్ పోలీస్ ఫోర్స్ వంటి టాప్ షోల కన్నా ఎక్కువ వీక్షకులను పొందింది రికార్డు సృష్టించింది ఓ వెబ్ సిరీస్.

అదేంటంటే? - ఆర్మాక్స్​ మీడియా ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం 2024 మొదటి ఆరు నెలల్లో ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన భారతీయ సిరీస్​గా "పంచాయత్" నిలిచింది. మే 28, 2024న అమెజాన్ ప్రైమ్​ వీడియోలో విడుదలైన ఈ సిరీస్​ మూడో సీజన్​ ఇప్పటి వరకూ 28.2 మిలియన్ల వీక్షకులను దక్కించుకుంది. తద్వారా ఇప్పటివరకూ అత్యధిక వ్యూస్ దక్కించుకున్న హీరామండి సిరీస్​ను రెండో స్థానంలోకి నెట్టింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​​ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతోన్న హీరామండీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్​తో తెరకెక్కించారు. భారతీయ వెబ్​సిరీస్​లోనే ఇది అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్. బాలీవుడ్​కు చెందిన ప్రముఖ నటులతో రూ.250కోట్లకు పైగా పెట్టుబడితో దీన్ని చిత్రీకరించారు. ఇది ఇప్పటివరకు 20.3 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.

దీని తర్వాత అత్యధిక స్థాయిలో 19.5 మిలియన్ల వ్యూయర్లను దక్కించుకున్న సిరీస్​గా ఇండియన్ పోలీస్ ఫోర్స్ నిలిచింది. దీంతో మొదటి స్థానంలో పంచాయత్​, రెండో స్థానంలో హీరామండి ఉండగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్ మూడో స్థానంలో నిలిచింది. ఇక ఓటీటీ షో బిగ్ బాస్-3 17.8మిలియన్ల వ్యూస్​తో ఓటీటీలో ఎక్కువమంది చూసిన నాన్ ఫిక్షన్ షోగా నిలిచింది.

పంచాయత్ సీజన్ 3 విషయానికొస్తే చందన్ కుమార్ రచించిన ఈ కథను ది వైరల్ పవర్ సంస్థ నిర్మాణంలో దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కించారు. గతంలో విడుదలైన పంచాయత్ వెబ్ సిరీస్ రెండు సీజన్లు మంచి ఆదరణ దక్కించుకోవడంతో ఈ ఏడాది మూడో సీజన్​ను రిలీజ్ చేశారు. పంచాయత్-3 అనేది గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఎలా ఉంటాయిస, స్థానిక వ్యవహారాలు ఎలా ఉంటాయి అనే విషయాలను చాలా ఎమోషనల్​గా చూపించారు. ప్రముఖ నటుడు జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించగా నీనా గుప్తా, రఘబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైజల్ మాలిక్ దుర్గేష్ కుమార్, పంకజ్ ఝాలు ముఖ్య పాత్రలు పోషించారు. వాస్తవానికి ఇవన్నీ తెలిసిన పేర్లే అయినప్పటికీ వీరిలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకూ పెద్ద పెద్ద షోలు, సినిమాలు చేసింది లేదు. అయినప్పటికీ పెద్ద పెద్ద షోలన్నింటినీ అధిగమించి ఈ సిరీస్ అత్యధిక వీక్షకులను సాధించి విమర్శకుల ప్రశంసలను పొందుతుంది.

సినిమాల్లోకి షారుక్‌ ఖాన్‌ చిన్న కొడుకు - ట్రైలర్ అదిరింది - Mufasa The lion king

ఇండిపెండెన్స్ డే వీక్- థియేటర్లలో హై వోల్టేజ్ మూవీస్- OTTలో క్రేజీ సిరీస్​లు - Independence Day Movie Releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.