ETV Bharat / entertainment

ఎడారిలో మహేశ్​ బాబు కొడుకు - అక్కడ ఏం చేస్తున్నాడంటే? - Gautam Ghattamaneni

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 9:57 AM IST

Updated : Jun 1, 2024, 10:12 AM IST

Mahesh Babu Son Gowtham Ghattamaneni : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని తన లేటెస్ట్ పిక్స్​ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎడారిలో దిగిన ఫొటోస్​ను షేర్ చేశాడు. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్​గా మారాయి.

Source ETV Bharat
Mahesh Babu family (Source ETV Bharat)

Mahesh Babu Son Gowtham Ghattamaneni : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - నమ్రత దంపతుల పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్స్​గా సితార, గౌతమ్​కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరిలో సితార సోషల్ మీడియాలో ఫుల్​ యాక్టివ్​గా ఉన్నప్పటికీ గౌతమ్ తక్కువగానే ఉంటాడు. కెమెరా ముందుకు ఎక్కువగా రాడు. నెట్టింట్లోనూ తక్కువగా పోస్ట్​లు చేస్తుంటాడు. అయితే తాజాగా అతడు తన లేటెస్ట్​ పిక్స్​ను పోస్ట్ చేసి ఘట్టమనేని ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ ఇచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే - అప్పుడెప్పుడో మహేశ్ నటించిన 1 – నేనొక్కడినే సినిమాలో మహేశ్​ బాబు చైల్డ్ హుడ్ క్యారెక్టర్​లో గౌతమ్ కనిపించి ఆకట్టుకున్నాడు. దీంతో ఆ తర్వాత కూడా గౌతమ్ వరుసగా సినిమాలలో కనిపిస్తాడని అందరూ ఆశించారు. ఎందుకంటే ఒకప్పుడు మహేశ్ కూడా చైల్డ్​ ఆర్టిస్ట్​గానే పలు సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే మహేశ్ కూడా తన కొడుకు విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. గౌతమ్​ పూర్తిగా స్టడీస్​పైనే ఫోకస్ పెట్టాడు. విదేశాల్లో చదువుకుంటున్నాడు. అలానే ఎక్స్​ట్రా యాక్టివిటీస్​లోనూ చురుగ్గానే పాల్గొంటున్నాడు గౌతమ్​. ప్రొఫెషనల్​ స్విమ్మర్​గా మారి మెడల్స్​ కూడా సంపాదించాడు.

ఆ మధ్యలో తన స్కూల్ డ్రామా కాంపిటీషన్​లోనూ పాల్గొని మహేశ్ ఫ్యాన్స్​లో ఉత్సాహాన్ని నింపాడు. అలా అని సినిమాల్లో కనిపించలేదు. చదువులపైనే దృష్టి పెట్టాడు. రీసెంట్​గానే అతడు గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తి చేశాడు. దీంతో మహేశ్ పుత్రోత్సాహం‌తో పొంగిపోతూ సోషల్​ మీడియోలోనూ పోస్ట్ చేశాడు.

అయితే ఇప్పుడు గౌతమ్ ఘట్టమనేని వెకేషన్ ట్రిప్​లో ఉన్నట్లు ఆయన ఇన్​స్టా అకౌంట్​ చూస్తుంటే తెలుస్తోంది. సాధారణంగా ఖాళీ దొరికితే ఫారెన్ టూర్స్​ వేస్తుంటారు మహేశ్ ఫ్యామిలీ. అలానే గౌతమ్ రీసెంట్​గా గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి కాస్త బ్రేక్ దొరకడంతో వెకేషన్​కు వెళ్లాడని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గౌతమ్ ఎడారిలో దిగిన ఫొటోలను పోస్ట్ చేశాడు. డిసర్ట్​మ్యాకింగ్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్​గా మారాయి. దీనికి ఫ్యాన్స్​తో పాటు నమ్రతా శిరోద్కర్, సితార కూడా కామెంట్లు చేశారు.

'అలాంటి పాత్రలను చేయాలని ఉంది'

భారీ బడ్జెట్ ఇండియన్​​ సీరియల్​ ఇదే - RRR, కల్కి, ఆదిపురుష్ బడ్జెట్​ కన్నా ఎక్కువ! - Indian Most Expensive TV Show

Mahesh Babu Son Gowtham Ghattamaneni : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - నమ్రత దంపతుల పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్స్​గా సితార, గౌతమ్​కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరిలో సితార సోషల్ మీడియాలో ఫుల్​ యాక్టివ్​గా ఉన్నప్పటికీ గౌతమ్ తక్కువగానే ఉంటాడు. కెమెరా ముందుకు ఎక్కువగా రాడు. నెట్టింట్లోనూ తక్కువగా పోస్ట్​లు చేస్తుంటాడు. అయితే తాజాగా అతడు తన లేటెస్ట్​ పిక్స్​ను పోస్ట్ చేసి ఘట్టమనేని ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ ఇచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే - అప్పుడెప్పుడో మహేశ్ నటించిన 1 – నేనొక్కడినే సినిమాలో మహేశ్​ బాబు చైల్డ్ హుడ్ క్యారెక్టర్​లో గౌతమ్ కనిపించి ఆకట్టుకున్నాడు. దీంతో ఆ తర్వాత కూడా గౌతమ్ వరుసగా సినిమాలలో కనిపిస్తాడని అందరూ ఆశించారు. ఎందుకంటే ఒకప్పుడు మహేశ్ కూడా చైల్డ్​ ఆర్టిస్ట్​గానే పలు సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే మహేశ్ కూడా తన కొడుకు విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. గౌతమ్​ పూర్తిగా స్టడీస్​పైనే ఫోకస్ పెట్టాడు. విదేశాల్లో చదువుకుంటున్నాడు. అలానే ఎక్స్​ట్రా యాక్టివిటీస్​లోనూ చురుగ్గానే పాల్గొంటున్నాడు గౌతమ్​. ప్రొఫెషనల్​ స్విమ్మర్​గా మారి మెడల్స్​ కూడా సంపాదించాడు.

ఆ మధ్యలో తన స్కూల్ డ్రామా కాంపిటీషన్​లోనూ పాల్గొని మహేశ్ ఫ్యాన్స్​లో ఉత్సాహాన్ని నింపాడు. అలా అని సినిమాల్లో కనిపించలేదు. చదువులపైనే దృష్టి పెట్టాడు. రీసెంట్​గానే అతడు గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తి చేశాడు. దీంతో మహేశ్ పుత్రోత్సాహం‌తో పొంగిపోతూ సోషల్​ మీడియోలోనూ పోస్ట్ చేశాడు.

అయితే ఇప్పుడు గౌతమ్ ఘట్టమనేని వెకేషన్ ట్రిప్​లో ఉన్నట్లు ఆయన ఇన్​స్టా అకౌంట్​ చూస్తుంటే తెలుస్తోంది. సాధారణంగా ఖాళీ దొరికితే ఫారెన్ టూర్స్​ వేస్తుంటారు మహేశ్ ఫ్యామిలీ. అలానే గౌతమ్ రీసెంట్​గా గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి కాస్త బ్రేక్ దొరకడంతో వెకేషన్​కు వెళ్లాడని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గౌతమ్ ఎడారిలో దిగిన ఫొటోలను పోస్ట్ చేశాడు. డిసర్ట్​మ్యాకింగ్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్​గా మారాయి. దీనికి ఫ్యాన్స్​తో పాటు నమ్రతా శిరోద్కర్, సితార కూడా కామెంట్లు చేశారు.

'అలాంటి పాత్రలను చేయాలని ఉంది'

భారీ బడ్జెట్ ఇండియన్​​ సీరియల్​ ఇదే - RRR, కల్కి, ఆదిపురుష్ బడ్జెట్​ కన్నా ఎక్కువ! - Indian Most Expensive TV Show

Last Updated : Jun 1, 2024, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.