ETV Bharat / entertainment

అమ్మ కోరిక తీర్చిన తారక్- ఆమె బర్త్​ డేకు ఇదే స్పెషల్ గిఫ్ట్ - JR NTR With Mother

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 4:51 PM IST

JR NTR With Mother: స్టార్ హీరో ఎన్టీఆర్ తన తల్లితో కలిసి శనివారం ఉడుపి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

JR NTR With Mother
JR NTR With Mother (Source: Getty Images)

JR NTR With Mother: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి ఉడుపి (కర్ణాటక) శ్రీకృష్ణ ఆలయాన్ని శనివారం దర్శించారు. దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో దిగిన ఫొటోను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దర్శనంతో తన తల్లి కల నెరవేరిందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆయన వెంట డైరెక్టర్ ప్రశాంత్ నీల్, జాతీయ అవార్డు విజేత రిషబ్​శెట్టి కూడా ఉన్నారు.

'అమ్మ ఎప్పుడూ నన్ను తన సొంతూరు కుందాపురాతో పాటు, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనం చేయించాలని కల కంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ కల నిజమైంది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకు ఇచ్చే మంచి బహుమతి ఇదే. విజయ్‌ కిరంగదూర్‌ సర్‌ మీకు ధన్యవాదాలు. నా ప్రియమిత్రుడు ప్రశాంత్‌ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే రిషబ్‌శెట్టి కూడా వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు' అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.

ఎన్టీఆర్​- నీల్ సినిమా స్టార్ట్!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ రీసెంట్​గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కానీ, షూటింగ్, తదితర విషయాలపై మేకర్స్​ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా నిర్మాత రవి శంకర్‌ ఈ సినిమా గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇక ఎన్టీఆర్‌ డిసెంబర్‌ నుంచి ఈ మూవీ షూటింగ్​లో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఇక 'కేజీఎఫ్', 'సలార్' లాంటి బ్లాక్ ​బస్టర్ల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ మరో పాన్ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మేకర్స్ గతంలో ఓ పోస్టర్ కూడా వదిలారు. గంభీరమైన లుక్​తో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్​ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది. సినిమాలో నటించనున్న హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్​ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్- షూటింగ్ ఎప్పుడంటే?

'దేవర' రాకకు మరో నెల రోజులే - ఇంట్రెస్టింగ్​గా తారక్​ డబుల్ షేడ్​ పోస్టర్​ - NTR Devara

JR NTR With Mother: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి ఉడుపి (కర్ణాటక) శ్రీకృష్ణ ఆలయాన్ని శనివారం దర్శించారు. దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో దిగిన ఫొటోను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దర్శనంతో తన తల్లి కల నెరవేరిందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆయన వెంట డైరెక్టర్ ప్రశాంత్ నీల్, జాతీయ అవార్డు విజేత రిషబ్​శెట్టి కూడా ఉన్నారు.

'అమ్మ ఎప్పుడూ నన్ను తన సొంతూరు కుందాపురాతో పాటు, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనం చేయించాలని కల కంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ కల నిజమైంది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకు ఇచ్చే మంచి బహుమతి ఇదే. విజయ్‌ కిరంగదూర్‌ సర్‌ మీకు ధన్యవాదాలు. నా ప్రియమిత్రుడు ప్రశాంత్‌ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే రిషబ్‌శెట్టి కూడా వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు' అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.

ఎన్టీఆర్​- నీల్ సినిమా స్టార్ట్!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ రీసెంట్​గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కానీ, షూటింగ్, తదితర విషయాలపై మేకర్స్​ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా నిర్మాత రవి శంకర్‌ ఈ సినిమా గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇక ఎన్టీఆర్‌ డిసెంబర్‌ నుంచి ఈ మూవీ షూటింగ్​లో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఇక 'కేజీఎఫ్', 'సలార్' లాంటి బ్లాక్ ​బస్టర్ల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ మరో పాన్ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మేకర్స్ గతంలో ఓ పోస్టర్ కూడా వదిలారు. గంభీరమైన లుక్​తో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్​ ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది. సినిమాలో నటించనున్న హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్​ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్- షూటింగ్ ఎప్పుడంటే?

'దేవర' రాకకు మరో నెల రోజులే - ఇంట్రెస్టింగ్​గా తారక్​ డబుల్ షేడ్​ పోస్టర్​ - NTR Devara

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.