ETV Bharat / business

పతనమైన స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్‌ 662 పాయింట్స్ డౌన్‌ - లక్షల కోట్లు ఆవిరి!

వరుసగా ఐదో రోజు మదుపరులకు భారీ నష్టాలు - కారణం అదే!

Bear Market
Stock Market (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

Stock Market Close Today October 25th, 2024 : గత 5 రోజులుగా మదుపర్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు, శుక్రవారం కూడా భారీ నష్టాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడమే ఇందుకు కారణం. దీనికి తోడు పెద్దపెద్ద కంపెనీల త్రైమాసిక ఫలితాల్లో మెరుపులు లేకపోవడం సూచీల పతనానికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు.

దీనితో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు క్షీణించి దాదాపు రూ.437 లక్షల కోట్లకు చేరింది.

చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 662 పాయింట్లు నష్టపోయి 79,402 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,180 వద్ద ముగిసింది.

  • లాభపడిన షేర్లు : ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్‌, హిందూస్థాన్ యూనిలివర్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్‌, నెస్లే ఇండియా
  • నష్టపోయిన షేర్లు : ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఎం అండ్ ఎం, ఎల్‌ అండ్ టీ, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌, మారుతి సుజుకి, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.5,062.45 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,620.47 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

గ్లోబల్ మార్కెట్స్‌
ఆసియా మార్కెట్లలో సియోల్‌, షాంఘై, హాంకాంగ్ లాభాలతో ముగియగా, టోక్యో మార్కెట్‌ నష్టాలను చవిచూసింది. గురువారం యూఎస్‌ మార్కెట్లు మంచి లాభాలతో స్థిరపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడవుతున్నాయి.

ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలు 0.42 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 74.69 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ ఒక్క పైసా తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ రూ.84.08గా ఉంది.

Stock Market Close Today October 25th, 2024 : గత 5 రోజులుగా మదుపర్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు, శుక్రవారం కూడా భారీ నష్టాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడమే ఇందుకు కారణం. దీనికి తోడు పెద్దపెద్ద కంపెనీల త్రైమాసిక ఫలితాల్లో మెరుపులు లేకపోవడం సూచీల పతనానికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు.

దీనితో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు క్షీణించి దాదాపు రూ.437 లక్షల కోట్లకు చేరింది.

చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 662 పాయింట్లు నష్టపోయి 79,402 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,180 వద్ద ముగిసింది.

  • లాభపడిన షేర్లు : ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్‌, హిందూస్థాన్ యూనిలివర్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్‌, నెస్లే ఇండియా
  • నష్టపోయిన షేర్లు : ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఎం అండ్ ఎం, ఎల్‌ అండ్ టీ, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌, మారుతి సుజుకి, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.5,062.45 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,620.47 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

గ్లోబల్ మార్కెట్స్‌
ఆసియా మార్కెట్లలో సియోల్‌, షాంఘై, హాంకాంగ్ లాభాలతో ముగియగా, టోక్యో మార్కెట్‌ నష్టాలను చవిచూసింది. గురువారం యూఎస్‌ మార్కెట్లు మంచి లాభాలతో స్థిరపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడవుతున్నాయి.

ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలు 0.42 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 74.69 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ ఒక్క పైసా తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ రూ.84.08గా ఉంది.

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.