ETV Bharat / bharat

'కాంగ్రెస్​లో చేరుతున్నారా?'- వినేశ్ ఫొగాట్ ఆన్సర్ ఇదే! - Vinesh Phogat Politics

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 5:18 PM IST

Vinesh Phogat Politics : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఆమె స్పందించారు. ఏమన్నారంటే?

Vinesh Phogat Farmers Protest
Vinesh Phogat At Farmers Protest (ANI)

Vinesh Phogat Politics : హరియాణాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మద్దతు తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం ఆమెదించాలని కోరారు. శంభూ సరిహద్దు వద్ద కొనసాగిస్తున్న ఆందోళనలు 200వ రోజుకు చేరిన సందర్భంగా రైతులకు వినేశ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా "మీరు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారా?" అని ఓ విలేకరి ప్రశ్నించారు.

అయితే రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని వినేశ్‌ స్పష్టంచేశారు. రైతు కుటుంబాల్ని కలుసుకోవడానికే తాను వచ్చానని తెలిపారు. మీడియా దృష్టి తన వైపు తిప్పితే రైతుల పోరాటం, కష్టాలు వృథా అవుతాయని వినేశ్‌ అభిప్రాయపడ్డారు. క్రీడాకారిణిగా, భారతీయురాలిగా తనకు ఎన్నికలపై ఎలాంటి ఆందోళన లేదని రైతుల సంక్షేమంపై మాత్రమే దృష్టి ఉందని చెప్పారు. మన హక్కుల కోసం మనమే నిలబడాలని, వాటిని సాధించుకోకుండా వెను దిరగవద్దని రైతులకు ఫొగట్‌ సూచించారు. రైతుల డిమాండ్లు నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

అంతవరకు వెనక్కి తగ్గొద్దు
"నేను రైతు కుటుంబంలో పుట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ కుమార్తె మీతోనే ఉందన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మన హక్కుల కోసం మనమే నిలబడాలి. మనకోసం ఎవరూ రారు. మీ డిమాండ్లు పూర్తి కావాలని ఆ భగవంతుడ్ని నేను ప్రార్థిస్తున్నాను. వాటిని సాధించుకోకుండా వెనుదిగొద్దు. ఇక్కడున్న రైతులు తమ హక్కుల కోసం 200 రోజులుగా కూర్చొని ఉన్నారు. ఈ డిమాండ్లను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. కానీ, కేంద్రం ఇన్నాళ్లుగా మీ డిమాండ్లు వినకపోవడం ఎంతో బాధాకరం" అని వినేశ్‌ పేర్కొన్నారు.

ఆందోళనలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు రైతు నేత స్వర్ణ సింగ్‌ పంధేర్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వారి దీక్షను పరీక్షిస్తోందని పేర్కొన్నారు. మరోసారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, దీంతోపాటు కొత్త అంశాలను కూడా ప్రకటిద్దామని పంధేర్‌ రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దిల్లీలో ర్యాలీకి అధికారులు నిరాకరించిన కారణంగా రైతులు ఫిబ్రవరి 13 నుంచి శంభూ సరిహద్దుల వద్దే ఆందోళన చేపట్టారు. పంటలకు చెల్లించే కనీస మద్దతు ధరకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్‌ చేశారు.

రాజకీయాల్లోకి వినేశ్ ఫొగాట్​! సోదరిపైనే పోటీ? - Vinesh Phogat Politics

వినేశ్ రాఖీ సెలబ్రేషన్స్- సోదరుడి స్పెషల్ గిఫ్ట్​

Vinesh Phogat Politics : హరియాణాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మద్దతు తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం ఆమెదించాలని కోరారు. శంభూ సరిహద్దు వద్ద కొనసాగిస్తున్న ఆందోళనలు 200వ రోజుకు చేరిన సందర్భంగా రైతులకు వినేశ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా "మీరు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారా?" అని ఓ విలేకరి ప్రశ్నించారు.

అయితే రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని వినేశ్‌ స్పష్టంచేశారు. రైతు కుటుంబాల్ని కలుసుకోవడానికే తాను వచ్చానని తెలిపారు. మీడియా దృష్టి తన వైపు తిప్పితే రైతుల పోరాటం, కష్టాలు వృథా అవుతాయని వినేశ్‌ అభిప్రాయపడ్డారు. క్రీడాకారిణిగా, భారతీయురాలిగా తనకు ఎన్నికలపై ఎలాంటి ఆందోళన లేదని రైతుల సంక్షేమంపై మాత్రమే దృష్టి ఉందని చెప్పారు. మన హక్కుల కోసం మనమే నిలబడాలని, వాటిని సాధించుకోకుండా వెను దిరగవద్దని రైతులకు ఫొగట్‌ సూచించారు. రైతుల డిమాండ్లు నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

అంతవరకు వెనక్కి తగ్గొద్దు
"నేను రైతు కుటుంబంలో పుట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ కుమార్తె మీతోనే ఉందన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మన హక్కుల కోసం మనమే నిలబడాలి. మనకోసం ఎవరూ రారు. మీ డిమాండ్లు పూర్తి కావాలని ఆ భగవంతుడ్ని నేను ప్రార్థిస్తున్నాను. వాటిని సాధించుకోకుండా వెనుదిగొద్దు. ఇక్కడున్న రైతులు తమ హక్కుల కోసం 200 రోజులుగా కూర్చొని ఉన్నారు. ఈ డిమాండ్లను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. కానీ, కేంద్రం ఇన్నాళ్లుగా మీ డిమాండ్లు వినకపోవడం ఎంతో బాధాకరం" అని వినేశ్‌ పేర్కొన్నారు.

ఆందోళనలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు రైతు నేత స్వర్ణ సింగ్‌ పంధేర్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వారి దీక్షను పరీక్షిస్తోందని పేర్కొన్నారు. మరోసారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, దీంతోపాటు కొత్త అంశాలను కూడా ప్రకటిద్దామని పంధేర్‌ రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దిల్లీలో ర్యాలీకి అధికారులు నిరాకరించిన కారణంగా రైతులు ఫిబ్రవరి 13 నుంచి శంభూ సరిహద్దుల వద్దే ఆందోళన చేపట్టారు. పంటలకు చెల్లించే కనీస మద్దతు ధరకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్‌ చేశారు.

రాజకీయాల్లోకి వినేశ్ ఫొగాట్​! సోదరిపైనే పోటీ? - Vinesh Phogat Politics

వినేశ్ రాఖీ సెలబ్రేషన్స్- సోదరుడి స్పెషల్ గిఫ్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.