ETV Bharat / bharat

షేర్ ట్రేడింగ్​లో మోసపోయిన టెకీ - రూ.1కోటి స్వాహా! ఎలా తప్పించుకోవాలి మరి? - Share Trading Fraud Techie

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 11:23 AM IST

Share Trading Fraud Techie : సైబర్ నేరాలకు సామాన్యులే కాదు. టెకీలు కూడా బలైపోతున్నారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా సాఫ్ట్​వేర్ ఇంజినీర్ రూ.91లక్షలకుపైగా మోసపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఇలాంటి మోసాల బారి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా?

Share Trading Fraud Techie
Share Trading Fraud Techie (Getty Images)

Share Trading Fraud Techie : సైబర్ మోసగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. ప్రజల అమయాకత్వాన్ని కొందరు క్యాష్ చేసుకుని మోసం చేస్తుంటే, మరికొందరు అత్యాశను ఆసరాగా తీసుకుని నిలువునా ముంచేస్తున్నారు. వాట్సాప్​, టెలిగ్రామ్, ఫేస్​బుక్​ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తామని చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా మంచి రాబడి అందిస్తామని హామీ ఇచ్చి మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ను కేటుగాళ్లు మోసం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఠాణె జిల్లాలోని డోంబివిలికి చెందిన బాధితురాలిని జులై నెలలో కొందరు వ్యక్తులు సంప్రందించారు. షేర్ ట్రేడింగ్​లోకి వస్తే మంచి రాబడి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. పలుమార్లు ఆమెతో మాట్లాడి ఆశ కల్పించారు. ఆ తర్వాత ఆమెను వివిధ సోషల్ మీడియా గ్రూప్స్​లో యాడ్ చేశారు. దీంతో మంచి రాబడిని ఆశించి రూ.91,05,000 పెట్టుబడి పెట్టారు బాధితురాలు.

కానీ ఇంతకుముందు సైబర్ మోసగాళ్లు చెప్పినట్లు, ఆమెకు ఎలాంటి డబ్బులు అందలేదు. దీంతో వారికి ఫోన్ చేయగా స్పందించలేదు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ, మాన్‌పాడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులపై సంబంధిత చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.

మరి ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి?

  • ఆన్​లైన్​లో పరిచయమైన వారిని తొందరగా నమ్మేయకూడదు.
  • మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ వివరాలు ఎవరికీ చెప్పకూడదు.
  • మీ అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూప్​ల్లో మిమ్మల్ని ఎవరైనా చేర్చితే, వెంటనే వాటి నుంచి బయటకు వచ్చేయండి.
  • వాట్సాప్​, టెలిగ్రామ్, ఫోన్​ల ద్వారా వచ్చే స్టాక్ మార్కెట్ టిప్స్​ను అస్సలు నమ్మకండి.
  • సోషల్ మీడియా అకౌంట్లలో ఉండే లింక్​లపై క్లిక్ చేయకండి.
  • అనధికార ఏపీకే ఫైల్స్​ను, థర్డ్ పార్టీ యాప్​లను డౌన్​లోడ్ చేసుకోవద్దు.
  • మీ అనుమతి లేకుండా, ఎవరూ మిమ్మల్ని వాట్సప్‌, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చడానికి వీలు లేకుండా, సెట్టింగ్స్‌ మార్చుకోవాలి.
  • ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలన్నా, సెబీ సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ఎక్స్​పర్ట్ నుంచి మాత్రమే సలహాలు తీసుకోవాలి.
  • యూట్యూబ్​ లాంటి ప్లాట్​ఫామ్స్​లో ఉండే నకిలీ ఎక్స్​పర్ట్స్​ మాటలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకండి.

సైబర్ నేరగాళ్ల​ ఉచ్చులో వైద్యుడు - స్టాక్​ మార్కెట్లో ఇన్వెస్ట్​ పేరిట రూ.74 లక్షలు మాయం - Doctor in Trap Of Cyber Criminals

మీ నాన్నను అరెస్ట్ చేశామంటూ కాల్స్ వస్తున్నాయా? - ఐతే వెంటనే మీరు చేయాల్సిందిదే! - FRAUD CALLS IN TELANGANA

Share Trading Fraud Techie : సైబర్ మోసగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. ప్రజల అమయాకత్వాన్ని కొందరు క్యాష్ చేసుకుని మోసం చేస్తుంటే, మరికొందరు అత్యాశను ఆసరాగా తీసుకుని నిలువునా ముంచేస్తున్నారు. వాట్సాప్​, టెలిగ్రామ్, ఫేస్​బుక్​ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తామని చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా మంచి రాబడి అందిస్తామని హామీ ఇచ్చి మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ను కేటుగాళ్లు మోసం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఠాణె జిల్లాలోని డోంబివిలికి చెందిన బాధితురాలిని జులై నెలలో కొందరు వ్యక్తులు సంప్రందించారు. షేర్ ట్రేడింగ్​లోకి వస్తే మంచి రాబడి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. పలుమార్లు ఆమెతో మాట్లాడి ఆశ కల్పించారు. ఆ తర్వాత ఆమెను వివిధ సోషల్ మీడియా గ్రూప్స్​లో యాడ్ చేశారు. దీంతో మంచి రాబడిని ఆశించి రూ.91,05,000 పెట్టుబడి పెట్టారు బాధితురాలు.

కానీ ఇంతకుముందు సైబర్ మోసగాళ్లు చెప్పినట్లు, ఆమెకు ఎలాంటి డబ్బులు అందలేదు. దీంతో వారికి ఫోన్ చేయగా స్పందించలేదు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ, మాన్‌పాడ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులపై సంబంధిత చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.

మరి ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి?

  • ఆన్​లైన్​లో పరిచయమైన వారిని తొందరగా నమ్మేయకూడదు.
  • మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ వివరాలు ఎవరికీ చెప్పకూడదు.
  • మీ అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూప్​ల్లో మిమ్మల్ని ఎవరైనా చేర్చితే, వెంటనే వాటి నుంచి బయటకు వచ్చేయండి.
  • వాట్సాప్​, టెలిగ్రామ్, ఫోన్​ల ద్వారా వచ్చే స్టాక్ మార్కెట్ టిప్స్​ను అస్సలు నమ్మకండి.
  • సోషల్ మీడియా అకౌంట్లలో ఉండే లింక్​లపై క్లిక్ చేయకండి.
  • అనధికార ఏపీకే ఫైల్స్​ను, థర్డ్ పార్టీ యాప్​లను డౌన్​లోడ్ చేసుకోవద్దు.
  • మీ అనుమతి లేకుండా, ఎవరూ మిమ్మల్ని వాట్సప్‌, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చడానికి వీలు లేకుండా, సెట్టింగ్స్‌ మార్చుకోవాలి.
  • ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలన్నా, సెబీ సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ఎక్స్​పర్ట్ నుంచి మాత్రమే సలహాలు తీసుకోవాలి.
  • యూట్యూబ్​ లాంటి ప్లాట్​ఫామ్స్​లో ఉండే నకిలీ ఎక్స్​పర్ట్స్​ మాటలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకండి.

సైబర్ నేరగాళ్ల​ ఉచ్చులో వైద్యుడు - స్టాక్​ మార్కెట్లో ఇన్వెస్ట్​ పేరిట రూ.74 లక్షలు మాయం - Doctor in Trap Of Cyber Criminals

మీ నాన్నను అరెస్ట్ చేశామంటూ కాల్స్ వస్తున్నాయా? - ఐతే వెంటనే మీరు చేయాల్సిందిదే! - FRAUD CALLS IN TELANGANA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.