ETV Bharat / bharat

సత్సంగ్​లో తొక్కిసలాట- 116మంది మృతి- యూపీలో ఘోర విషాదం - Stampede In Uttarpradesh

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 4:15 PM IST

Updated : Jul 2, 2024, 5:46 PM IST

STAMPEDE IN UTTARPRADESH
STAMPEDE IN UTTARPRADESH (ETV Bharat)

Stampede In Uttarpradesh : ఉత్తర్​ప్రదేశ్​లోని హత్రస్​ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సత్సంగ్​ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 116మంది మృతి చెందారు. అందులో మహిళలు, పిల్లులు కూడా ఉన్నారు. అనేక మంది గాయపడ్డారు. రతిభాన్పూర్‌లో ఏర్పాటు చేసిన ఓ శివారాధన కార్యక్రమంలో ఈ విషాదం జరిగింది.

LIVE FEED

10:27 PM, 2 Jul 2024 (IST)

అయితే ఈ ఘటనలో దాదాపు 116మంది మృతిచెందినట్లు అలీగఢ్​ రేంజ్​ ఐజీ శలాభ్​ మథుర్​ ధ్రువీకరించారు.

8:28 PM, 2 Jul 2024 (IST)

ఈ ఘటనలో దాదాపు 87మంది మృతిచెందినట్లు ఆగ్రా ఏడీజీ డాక్టర్​ అనుపమ్​ కులశ్రేష్ఠ ధ్రువీకరించారు. అనేక మంది గాయపడ్డారని తెలిపారు.

5:44 PM, 2 Jul 2024 (IST)

హత్రాస్​లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 60కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదొక ప్రైవేటు కార్యక్రమం అని, దీని నిర్వహణకు ఎస్​డీఎమ్​ అనుమతి ఇచ్చారని సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్​ ఆశిష్​ కుమార్, సత్సంగ్​ అయిపోయిన తర్వాత, బయటకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, సహాయక చర్యలను సీఎం యోగి ఆదిత్యనాథ్​ స్వయంగా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయడానికి ఇద్దరు మంత్రులు, చీఫ్​ సెక్రటరీ, డీపీపీని ఘటనాస్థలికి పంపారు. వీరంతా ప్రత్యేక విమానంలో హత్రాస్​కు చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని హోం శాఖ అదనపు కార్యదర్శి దీపక్​ కుమార్​ను సీఎం ఆదేశించారు.

5:01 PM, 2 Jul 2024 (IST)

సీఎం యోగి ఆదిత్యనాథ్​ దిగ్భ్రాంతి
హత్రాస్​ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోలవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని, ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా యంత్రంగాన్ని ఆదేశించారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు చేయాలని ఆగ్రా ఏడీజీని యోగి ఆదేశించారు.

5:00 PM, 2 Jul 2024 (IST)

ఈ ఘటనపై స్పందించిన ఇటా వైద్యాధికారి ఉమేశ్​ కుమార్​ త్రిపాఠి, ఇప్పటివరకు పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి 27మృతదేహాలు వచ్చాయని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Stampede In Uttarpradesh : ఉత్తర్​ప్రదేశ్​లోని హత్రస్​ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సత్సంగ్​ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 116మంది మృతి చెందారు. అందులో మహిళలు, పిల్లులు కూడా ఉన్నారు. అనేక మంది గాయపడ్డారు. రతిభాన్పూర్‌లో ఏర్పాటు చేసిన ఓ శివారాధన కార్యక్రమంలో ఈ విషాదం జరిగింది.

LIVE FEED

10:27 PM, 2 Jul 2024 (IST)

అయితే ఈ ఘటనలో దాదాపు 116మంది మృతిచెందినట్లు అలీగఢ్​ రేంజ్​ ఐజీ శలాభ్​ మథుర్​ ధ్రువీకరించారు.

8:28 PM, 2 Jul 2024 (IST)

ఈ ఘటనలో దాదాపు 87మంది మృతిచెందినట్లు ఆగ్రా ఏడీజీ డాక్టర్​ అనుపమ్​ కులశ్రేష్ఠ ధ్రువీకరించారు. అనేక మంది గాయపడ్డారని తెలిపారు.

5:44 PM, 2 Jul 2024 (IST)

హత్రాస్​లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 60కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదొక ప్రైవేటు కార్యక్రమం అని, దీని నిర్వహణకు ఎస్​డీఎమ్​ అనుమతి ఇచ్చారని సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్​ ఆశిష్​ కుమార్, సత్సంగ్​ అయిపోయిన తర్వాత, బయటకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, సహాయక చర్యలను సీఎం యోగి ఆదిత్యనాథ్​ స్వయంగా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయడానికి ఇద్దరు మంత్రులు, చీఫ్​ సెక్రటరీ, డీపీపీని ఘటనాస్థలికి పంపారు. వీరంతా ప్రత్యేక విమానంలో హత్రాస్​కు చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని హోం శాఖ అదనపు కార్యదర్శి దీపక్​ కుమార్​ను సీఎం ఆదేశించారు.

5:01 PM, 2 Jul 2024 (IST)

సీఎం యోగి ఆదిత్యనాథ్​ దిగ్భ్రాంతి
హత్రాస్​ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోలవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని, ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా యంత్రంగాన్ని ఆదేశించారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు చేయాలని ఆగ్రా ఏడీజీని యోగి ఆదేశించారు.

5:00 PM, 2 Jul 2024 (IST)

ఈ ఘటనపై స్పందించిన ఇటా వైద్యాధికారి ఉమేశ్​ కుమార్​ త్రిపాఠి, ఇప్పటివరకు పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి 27మృతదేహాలు వచ్చాయని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Jul 2, 2024, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.