ETV Bharat / bharat

కరెన్సీ నోట్లపై అవినీతి నేత నిద్ర!- సోషల్ మీడియాలో ఫొటో వైరల్- విషయం ఏంటంటే? - Politician Sleeping On Currency

Politician Sleeping On Currency Notes : అసోంకు చెందిన ఓ రాజకీయ నేత కరెన్సీ నోట్ల కట్టలపై నిద్రించిన చిత్రం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా సమయంలో ఇలాంటి చిత్రం బయటకు రావటం దేశ వ్యాప్తంగా హట్​ టాపిక్​ మారింది.

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 10:54 AM IST

Updated : Mar 28, 2024, 11:44 AM IST

Politician Sleeping On Currency Notes
Politician Sleeping On Currency Notes

A Politician Sleeping On Currency Notes : అసోంలో ఓ రాజకీయ నేత కరెన్సీ నోట్లపై అర్ధనగ్నంగా నిద్రించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. యూపీపీఎల్‌ పార్టీలో పనిచేసిన బెంజమిన్‌ బసుమతారీ అనే నాయకుడు 500 నోట్లపై పడుకున్న చిత్రం వైరల్‌గా మారింది. ఉదల్​గురీ జిల్లాకు చెందిన బెంజమిన్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంపై పార్టీకి బెంజమిన్​కు ఎలాంటి సంబంధం లేదని స్పంందిచింది.

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ బెంజమిన్​పై పలు కేసులున్నాయి. ఆయన విలేజ్‌ కౌన్సిల్ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై యూపీపీఎల్ పార్టీ చీఫ్ ప్రమోద్‌ బోరో స్పష్టత ఇచ్చారు. బెంజమిన్‌ను జనవరిలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు.

'పార్టీతో సంబంధం లేదు'
'జెంజమిన్ ఫొటో సోషల్​ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. జనవరి 10నే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. మాకు బెంజమిన్​కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయాలని అనుకుంటున్నా. హరిసింగ బ్లాక్ కమిటీ, యూపీపీఎల్ నుంచి జనవరి 5న లేఖ అందుకున్న తర్వాత బెంజమిన్​పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం. ఈ కారణంగా ఫిబ్రవరి 10న విలేజ్ కౌన్సిల్ డెవలప్​మెంట్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) సస్పెండ్ చేసింది. బెంజమిన్ బసుమతారీని యూపీఎల్ఎల్​ పార్టీతో లింక్ చేసి మాట్లాడటం మానుకోవాలని అన్ని మీడియా సంస్థలు, సోషల్​ మీడియా వినిమోగదారులను కోరుతున్నా. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో అతని వ్యక్తిగత వ్యవహారం. దానికి పార్టీ జవాబుదారీ కాదు' అని ఎక్స్ వేదికగా ప్రమోద్ బోరో పేర్కొన్నారు.

ఎన్నికల కోసం 60+ఏజ్​లో మాజీ గ్యాంగ్​స్టర్​ పెళ్లి
అతడో కరుడుగట్టిన మాజీ గ్యాంగ్​స్టర్​​. వయసు 60 ఏళ్లు. ఓ మర్డర్​ కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. ఇదంతా బాగానే ఉన్నా ప్రస్తుతం అతడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, వయసుతో పాటు చట్టపరంగా ఉన్న కొన్ని పరిమితులు అడ్డంకిగా మారాయి. దీంతో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యను సదరు పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దింపనున్నాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

బామ్మ, మనవరాలికి బస్సు జర్నీ ఫ్రీ- నాలుగు చిలుకలకు మాత్రం రూ.444 టికెట్ - RTC Bus Ticket For Parrots

ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్- ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ఆరుగురు హతం - Chhattisgarh Naxal Encounter

A Politician Sleeping On Currency Notes : అసోంలో ఓ రాజకీయ నేత కరెన్సీ నోట్లపై అర్ధనగ్నంగా నిద్రించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. యూపీపీఎల్‌ పార్టీలో పనిచేసిన బెంజమిన్‌ బసుమతారీ అనే నాయకుడు 500 నోట్లపై పడుకున్న చిత్రం వైరల్‌గా మారింది. ఉదల్​గురీ జిల్లాకు చెందిన బెంజమిన్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంపై పార్టీకి బెంజమిన్​కు ఎలాంటి సంబంధం లేదని స్పంందిచింది.

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ బెంజమిన్​పై పలు కేసులున్నాయి. ఆయన విలేజ్‌ కౌన్సిల్ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై యూపీపీఎల్ పార్టీ చీఫ్ ప్రమోద్‌ బోరో స్పష్టత ఇచ్చారు. బెంజమిన్‌ను జనవరిలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు.

'పార్టీతో సంబంధం లేదు'
'జెంజమిన్ ఫొటో సోషల్​ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. జనవరి 10నే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. మాకు బెంజమిన్​కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయాలని అనుకుంటున్నా. హరిసింగ బ్లాక్ కమిటీ, యూపీపీఎల్ నుంచి జనవరి 5న లేఖ అందుకున్న తర్వాత బెంజమిన్​పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం. ఈ కారణంగా ఫిబ్రవరి 10న విలేజ్ కౌన్సిల్ డెవలప్​మెంట్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) సస్పెండ్ చేసింది. బెంజమిన్ బసుమతారీని యూపీఎల్ఎల్​ పార్టీతో లింక్ చేసి మాట్లాడటం మానుకోవాలని అన్ని మీడియా సంస్థలు, సోషల్​ మీడియా వినిమోగదారులను కోరుతున్నా. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో అతని వ్యక్తిగత వ్యవహారం. దానికి పార్టీ జవాబుదారీ కాదు' అని ఎక్స్ వేదికగా ప్రమోద్ బోరో పేర్కొన్నారు.

ఎన్నికల కోసం 60+ఏజ్​లో మాజీ గ్యాంగ్​స్టర్​ పెళ్లి
అతడో కరుడుగట్టిన మాజీ గ్యాంగ్​స్టర్​​. వయసు 60 ఏళ్లు. ఓ మర్డర్​ కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. ఇదంతా బాగానే ఉన్నా ప్రస్తుతం అతడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, వయసుతో పాటు చట్టపరంగా ఉన్న కొన్ని పరిమితులు అడ్డంకిగా మారాయి. దీంతో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యను సదరు పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దింపనున్నాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

బామ్మ, మనవరాలికి బస్సు జర్నీ ఫ్రీ- నాలుగు చిలుకలకు మాత్రం రూ.444 టికెట్ - RTC Bus Ticket For Parrots

ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్- ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ఆరుగురు హతం - Chhattisgarh Naxal Encounter

Last Updated : Mar 28, 2024, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.