ETV Bharat / bharat

దిల్లీ నెక్స్ట్​ సీఎం కోసం ఆప్​ హంట్​ స్టార్ట్​- PAC సభ్యుల పర్సనల్ ఫీడ్​బ్యాక్​ తీసుకున్న కేజ్రీవాల్ - Delhi News Live Updates

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 3:55 PM IST

Updated : Sep 17, 2024, 9:03 AM IST

Delhi News Live Updates
Delhi News Live Updates (ANI)

Delhi News Live Updates : దిల్లీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు ఆమ్​ ఆద్మీ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా పలు సమావేశాలను నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం జరగననున్న ఆప్​ పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ మీటింగ్​లో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికంటే ముందు అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోదియా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో దిల్లీ తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

LIVE FEED

7:33 PM, 16 Sep 2024 (IST)

PAC సభ్యుల ఫీడ్​బ్యాక్​ తీసుకున్న కేజ్రీవాల్

కేజ్రీవాల్​ సోమవారం ఆప్​ పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ(పీఏసీ) సభ్యులతో 'వన్​ ఆన్​ వన్' మీటింగ్​ నిర్వహించారు క్రేజీవాల్. ఈ విషయాన్ని ఆప్​ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఈ సమావేశంలో తదుపరి సీఎం ఎవరనేదానిపై ఒక్కో నేతతో కేజ్రీవాల్‌ విడిగా మాట్లాడి అభిప్రాయం తీసుకున్నట్లు సౌరభ్​ పేర్కొన్నారు. "ఈ మీటింగ్​లో క్రేజీవాల్​ తన స్థానంలో ఎవరిని సీఎంను ఎంపిక చేయాలనే విషయమై ప్రతి ఒక్కరి దగ్గరి నుంచి పర్సనల్​ ఫీడ్​బ్యాక్​ కోరారు. రేపు లెజిస్లేటివ్​ పార్టీ సమావేశంలో ఇదే విషయమై మరోసారి(రెండో దఫ) చర్చిస్తారు." అని భరద్వాజ్​ వెల్లడించారు.

5:51 PM, 16 Sep 2024 (IST)

ఆప్​ లెజిస్లేటివ్​ పార్టీ మీటింగ్

దిల్లీ కొత్త సీఎం ఎంపికపై చర్చించేందుకు ఆప్​ లెజిస్లేటివ్​ పార్టీ సమావేశం మంగళవారం జరగనుంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు అరవింద్​ కేజ్రీవాల్​ నివాసంలో ఈ సమావేశం జరగనుందని ఆప్​ వర్గాలు తెలిపాయి.

3:49 PM, 16 Sep 2024 (IST)

కేజ్రీవాల్​ రాజీనామాకు ముహూర్తం ఖరారు!

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ రాజీనామాకు ముహూర్తం ఖరారు అయింది!. ఈ మేరకు కేజ్రీవాల్​​ దిల్లీ ఎల్​జీ వీకే సక్సేనాను కలిసేందుకు మంగళవారం అపాయింట్​మెంట్​ తీసుకున్నారని ఆప్​ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్​ అపాయింట్​మెంట్​ ఇచ్చినట్లు రాజ్​భవన్​ వర్గాలు వెల్లడించాయి. అప్పుడే కేజ్రీవాల్​ రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు ఆప్​ నేతలు ఇంతకుముందు చెప్పారు. మరోవైపు, దిల్లీ తర్వాతి సీఎం ఎంపిక విషయంలో​ కేజ్రీవాల్​తో చర్చించేందుకు మనీశ్​ సిసోదియా భేటీ అయ్యారు.

3:47 PM, 16 Sep 2024 (IST)

సీఎం పీఠం ఎవరికి దక్కేనో?

రెండు రోజుల్లో రాజీనామా చేస్తానన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేజ్రీవాల్‌ తర్వాత దిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్​ భార్య సునీత, దిల్లీ మంత్రులు అతిషీ, గోపాల్​ రాయ్​, సౌరభ్​ భరద్వాజ్, కైలాశ్ గెహ్లోత్​ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ రాఖి బిర్లా వంటి కొందరు రిజర్వ్​డ్​ కేటగిరీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా సీఎం రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ప్రజలతో మంచివారు అనిపించుకున్న తర్వాతే తాను, మనీశ్​ సిసోదియా సీఎం, డిప్యూటీ సీఎంలు ఛార్జ్​ తీసుకుంటామని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిసోదియా సీఎం రేసులో లేనట్లు తేలిపోయింది.

Delhi News Live Updates : దిల్లీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు ఆమ్​ ఆద్మీ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా పలు సమావేశాలను నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం జరగననున్న ఆప్​ పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ మీటింగ్​లో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికంటే ముందు అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోదియా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో దిల్లీ తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

LIVE FEED

7:33 PM, 16 Sep 2024 (IST)

PAC సభ్యుల ఫీడ్​బ్యాక్​ తీసుకున్న కేజ్రీవాల్

కేజ్రీవాల్​ సోమవారం ఆప్​ పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ(పీఏసీ) సభ్యులతో 'వన్​ ఆన్​ వన్' మీటింగ్​ నిర్వహించారు క్రేజీవాల్. ఈ విషయాన్ని ఆప్​ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఈ సమావేశంలో తదుపరి సీఎం ఎవరనేదానిపై ఒక్కో నేతతో కేజ్రీవాల్‌ విడిగా మాట్లాడి అభిప్రాయం తీసుకున్నట్లు సౌరభ్​ పేర్కొన్నారు. "ఈ మీటింగ్​లో క్రేజీవాల్​ తన స్థానంలో ఎవరిని సీఎంను ఎంపిక చేయాలనే విషయమై ప్రతి ఒక్కరి దగ్గరి నుంచి పర్సనల్​ ఫీడ్​బ్యాక్​ కోరారు. రేపు లెజిస్లేటివ్​ పార్టీ సమావేశంలో ఇదే విషయమై మరోసారి(రెండో దఫ) చర్చిస్తారు." అని భరద్వాజ్​ వెల్లడించారు.

5:51 PM, 16 Sep 2024 (IST)

ఆప్​ లెజిస్లేటివ్​ పార్టీ మీటింగ్

దిల్లీ కొత్త సీఎం ఎంపికపై చర్చించేందుకు ఆప్​ లెజిస్లేటివ్​ పార్టీ సమావేశం మంగళవారం జరగనుంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు అరవింద్​ కేజ్రీవాల్​ నివాసంలో ఈ సమావేశం జరగనుందని ఆప్​ వర్గాలు తెలిపాయి.

3:49 PM, 16 Sep 2024 (IST)

కేజ్రీవాల్​ రాజీనామాకు ముహూర్తం ఖరారు!

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ రాజీనామాకు ముహూర్తం ఖరారు అయింది!. ఈ మేరకు కేజ్రీవాల్​​ దిల్లీ ఎల్​జీ వీకే సక్సేనాను కలిసేందుకు మంగళవారం అపాయింట్​మెంట్​ తీసుకున్నారని ఆప్​ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్​ అపాయింట్​మెంట్​ ఇచ్చినట్లు రాజ్​భవన్​ వర్గాలు వెల్లడించాయి. అప్పుడే కేజ్రీవాల్​ రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు ఆప్​ నేతలు ఇంతకుముందు చెప్పారు. మరోవైపు, దిల్లీ తర్వాతి సీఎం ఎంపిక విషయంలో​ కేజ్రీవాల్​తో చర్చించేందుకు మనీశ్​ సిసోదియా భేటీ అయ్యారు.

3:47 PM, 16 Sep 2024 (IST)

సీఎం పీఠం ఎవరికి దక్కేనో?

రెండు రోజుల్లో రాజీనామా చేస్తానన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేజ్రీవాల్‌ తర్వాత దిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్​ భార్య సునీత, దిల్లీ మంత్రులు అతిషీ, గోపాల్​ రాయ్​, సౌరభ్​ భరద్వాజ్, కైలాశ్ గెహ్లోత్​ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ రాఖి బిర్లా వంటి కొందరు రిజర్వ్​డ్​ కేటగిరీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా సీఎం రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ప్రజలతో మంచివారు అనిపించుకున్న తర్వాతే తాను, మనీశ్​ సిసోదియా సీఎం, డిప్యూటీ సీఎంలు ఛార్జ్​ తీసుకుంటామని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిసోదియా సీఎం రేసులో లేనట్లు తేలిపోయింది.

Last Updated : Sep 17, 2024, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.