ETV Bharat / bharat

కేజ్రీవాల్​ రాజీనామాస్త్రం - హ్యాట్రిక్​ కోసమేనా? వ్యూహం పనిచేస్తుందా? - kejriwal resignation

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 7:49 AM IST

Kejriwal Political Strategy : సీఎం పదవికి రెండురోజుల్లో రాజీనామా చేస్తానన్న కేజ్రీవాల్‌ ప్రకటనతో ఇప్పుడు అందరి దృష్టి దిల్లీ రాజకీయాలపై ఉంది. 48 గంటల తర్వాత రాజీనామా చేసిన మరొకరికి సీఎం పగ్గాలు అప్పగిస్తానన్న ఆయన నిర్ణయంపై తీవ్ర చర్చ మొదలైంది. కేజ్రీవాల్‌ రాజీనామా నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలు అది ఈ మేరకు లాభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆప్‌ జాతీయ సమన్వయకర్త వ్యూహం ఫలిస్తుందా లేక బెడిసికొడుతుందా అనేది చూడాలి.

Kejriwal Political Strategy
Kejriwal Political Strategy (ETV Bharat)

Kejriwal Political Strategy : సీఎం పదవికి 48గంటల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్‌ ప్రకటించటం వల్ల దిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేజ్రీవాల్‌ రాజీనామాతో దిల్లీ రాజకీయాలపై ఎంత ప్రభావం ఉంటుందనే చర్చ సర్వత్రా మొదలైంది. ఆప్‌ జాతీయ సమన్వయకర్త నిర్ణయంతో ఆమ్​ ఆద్మీ పార్టీ దిల్లీ పీఠం ఎక్కటమో లేదా నష్టపోవటమో ఏదో ఒకటి ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తే ఆయనస్థానంలో ఆప్‌ నుంచి మరొకరు సీఎం పగ్గాలు చేపడతారు. ఒకవేళ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళితే మహారాష్ట్రతోపాటు దిల్లీ శాసనసభకు నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. కేజ్రీవాల్‌ రాజీనామా తర్వాత ఆప్‌ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముందస్తు ఎన్నికలు కోసమేనా?
తమ పార్టీని చీల్చాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిందని కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. ఈ వాదనను బలంగా తీసుకెళ్లాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ప్రజల్లో సానుభూతి సంపాదించి దిల్లీ శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టాలన్నది ఆయన లక్ష్యం కావొచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తే తమపై అక్రమకేసులు బనాయించి జైల్లో పెట్టారనే వాదన పెద్దగా ప్రభావం చూపదన్న అంచనాతోనే కేజ్రీవాల్‌ ముందస్తు ఎన్నికల అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆయన ఈ వ్యూహం ఫలిస్తే ఆప్‌ మూడోసారి అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

అంతా సులభమేమి కాదు!
అయితే ఈ రాజీనామా వల్ల లాభమే కాదు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం పదవిని వేరేవారికి ఇస్తే పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్‌కు పెద్ద సవాల్‌గా మారటమే కాకుండా విపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇతర నేతలకు పదవి ఇచ్చిన తర్వాత వారి నుంచి తిరిగి బాధ్యతలు తీసుకోవటం అంత సులభం కాదని బిహార్‌, ఝార్ఖండ్‌ రాజకీయ ఉదంతాలతో అర్థమవుతుంది. రాజకీయ కారణాలతో జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ సీఎం పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతను జితన్‌ రామ్‌ మాంఝీకి అప్పగించారు. ఆ తర్వాత మళ్లీ సీఎం పదవి చేపట్టేందుకు ఆయన నానా తంటాలుపడాల్సి వచ్చింది. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ కావటంతో ఆ బాధ్యతలు చంపయీ సోరెన్‌కు అప్పగించారు. బెయిలుపై విడుదలైన ఆయన తిరిగి సీఎం పదవి చేపట్టారు. దీంతో అసంతృప్తికి గురైన చంపయీసోరెన్ జేఎంఎంకు రాజీనామా చేసి బీజేపీ పంచన చేరారు. అలాంటి పరిస్థితులు ఆప్‌నకు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.

కేజ్రీవాల్​కు పెద్ద సవాలే
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న కేజ్రీవాల్‌కు విజయం కత్తిమీద సాము కానుంది. కొన్నేళ్ల నుంచి ఆప్‌ కీలక నేతలంతా అనేక కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా బెయిల్‌పై బయటకు వచ్చినా సత్యేంద్ర జైన్‌, అమానతుల్లా ఖాన్‌ వంటి వారు జైల్లోనే ఉన్నారు. వివిధ కారణాలతో రాజకీయంగా ఆప్‌ కొంతమేర బలహీనపడింది. నవంబరులో ఎన్నికలు జరిగితే పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయటం కేజ్రీవాల్‌కు పెద్ద సవాల్‌ కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దిల్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా దిల్లీ అధికారం తమదేనని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ రాజీనామా ప్రకటనతోపాటు ముందస్తు ఎన్నికల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

కౌన్ బనేగా నెక్స్ట్​ దిల్లీ సీఎం? ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీరే! - Who will be next CM of Delhi

2రోజుల్లో రాజీనామా చేస్తా- అప్పటి వరకు సీఎంగా ఉండను: కేజ్రీవాల్‌ - Kejriwal Resignation

Kejriwal Political Strategy : సీఎం పదవికి 48గంటల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్‌ ప్రకటించటం వల్ల దిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేజ్రీవాల్‌ రాజీనామాతో దిల్లీ రాజకీయాలపై ఎంత ప్రభావం ఉంటుందనే చర్చ సర్వత్రా మొదలైంది. ఆప్‌ జాతీయ సమన్వయకర్త నిర్ణయంతో ఆమ్​ ఆద్మీ పార్టీ దిల్లీ పీఠం ఎక్కటమో లేదా నష్టపోవటమో ఏదో ఒకటి ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తే ఆయనస్థానంలో ఆప్‌ నుంచి మరొకరు సీఎం పగ్గాలు చేపడతారు. ఒకవేళ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళితే మహారాష్ట్రతోపాటు దిల్లీ శాసనసభకు నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. కేజ్రీవాల్‌ రాజీనామా తర్వాత ఆప్‌ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముందస్తు ఎన్నికలు కోసమేనా?
తమ పార్టీని చీల్చాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిందని కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. ఈ వాదనను బలంగా తీసుకెళ్లాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ప్రజల్లో సానుభూతి సంపాదించి దిల్లీ శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టాలన్నది ఆయన లక్ష్యం కావొచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తే తమపై అక్రమకేసులు బనాయించి జైల్లో పెట్టారనే వాదన పెద్దగా ప్రభావం చూపదన్న అంచనాతోనే కేజ్రీవాల్‌ ముందస్తు ఎన్నికల అంశాన్ని తెరమీదకు తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆయన ఈ వ్యూహం ఫలిస్తే ఆప్‌ మూడోసారి అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

అంతా సులభమేమి కాదు!
అయితే ఈ రాజీనామా వల్ల లాభమే కాదు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం పదవిని వేరేవారికి ఇస్తే పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్‌కు పెద్ద సవాల్‌గా మారటమే కాకుండా విపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇతర నేతలకు పదవి ఇచ్చిన తర్వాత వారి నుంచి తిరిగి బాధ్యతలు తీసుకోవటం అంత సులభం కాదని బిహార్‌, ఝార్ఖండ్‌ రాజకీయ ఉదంతాలతో అర్థమవుతుంది. రాజకీయ కారణాలతో జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ సీఎం పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతను జితన్‌ రామ్‌ మాంఝీకి అప్పగించారు. ఆ తర్వాత మళ్లీ సీఎం పదవి చేపట్టేందుకు ఆయన నానా తంటాలుపడాల్సి వచ్చింది. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ కావటంతో ఆ బాధ్యతలు చంపయీ సోరెన్‌కు అప్పగించారు. బెయిలుపై విడుదలైన ఆయన తిరిగి సీఎం పదవి చేపట్టారు. దీంతో అసంతృప్తికి గురైన చంపయీసోరెన్ జేఎంఎంకు రాజీనామా చేసి బీజేపీ పంచన చేరారు. అలాంటి పరిస్థితులు ఆప్‌నకు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.

కేజ్రీవాల్​కు పెద్ద సవాలే
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న కేజ్రీవాల్‌కు విజయం కత్తిమీద సాము కానుంది. కొన్నేళ్ల నుంచి ఆప్‌ కీలక నేతలంతా అనేక కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా బెయిల్‌పై బయటకు వచ్చినా సత్యేంద్ర జైన్‌, అమానతుల్లా ఖాన్‌ వంటి వారు జైల్లోనే ఉన్నారు. వివిధ కారణాలతో రాజకీయంగా ఆప్‌ కొంతమేర బలహీనపడింది. నవంబరులో ఎన్నికలు జరిగితే పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయటం కేజ్రీవాల్‌కు పెద్ద సవాల్‌ కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దిల్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా దిల్లీ అధికారం తమదేనని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ రాజీనామా ప్రకటనతోపాటు ముందస్తు ఎన్నికల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

కౌన్ బనేగా నెక్స్ట్​ దిల్లీ సీఎం? ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీరే! - Who will be next CM of Delhi

2రోజుల్లో రాజీనామా చేస్తా- అప్పటి వరకు సీఎంగా ఉండను: కేజ్రీవాల్‌ - Kejriwal Resignation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.