ETV Bharat / bharat

'మార్కులు తగ్గితే తాతతో కలిసి అలా చేసేవాడిని'- JEE అడ్వాన్స్​డ్ టాపర్ సీక్రెట్ ఇదే! - JEE Advanced Topper 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 11:41 AM IST

JEE Advanced Topper Interview 2024 : కష్టపడి పనిచేస్తే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని వ్యాఖ్యానించాడు జేఈఈ అడ్వాన్స్​డ్​ ఆల్ ఇండియా టాపర్ వేద్ లహోటి. జీవితంలో ఒక పెద్ద లక్ష్యం ఉండాలని తెలిపాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో 360 మార్కులకుగాను 355 సాధించి టాపర్​గా నిలిచిన వేద్ విజయగాథను తెలుసుకుందాం.

JEE Advanced Topper Ved Lahoti
JEE Advanced Topper Ved Lahoti (ETV Bharat)

JEE Advanced Topper Interview 2024 : 'జీవితంలో సాధ్యం కానిది ఏదీ లేదు. దృఢ సంకల్పంతో ఉంటే అన్నీ సాధ్యమే. జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. అది పెద్దదిగా ఉండాలి' ఇవేవో పెద్దపెద్ద వ్యక్తులు చెప్పిన మాటలు కావు. జేఈఈ అడ్వాన్స్​డ్ ఆల్ ఇండియా టాపర్ వేద్ లహోటి చేసిన వ్యాఖ్యలు. కష్టపడి పనిచేస్తే జీవితంలో సాధ్యం కానిది ఏదీ లేదని వేద్ లహోటి తెలిపాడు. జేఈఈ అడ్వాన్స్​డ్​లో ఆల్ ఇండియా టాపర్​గా నిలిచిన వేద్ లహోటి ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

JEE Advanced Topper Interview 2024
తల్లిదండ్రులతో వేద్​ లహోటి (ETV Bharat)

చిన్నప్పటి నుంచి చదువులో టాపర్
వేద్ తండ్రి యోగేశ్ లహోటి రిలయన్స్ జియోలో కన్​స్ట్రక్షన్ మేనేజర్ కాగా, తల్లి జయ గృహిణి. వేద్ తాతయ్య ఆర్​సీ సోమాని రిటైర్డ్ ఇంజినీర్. 8వ తరగతిలో ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్​లో గోల్డ్ మెడల్ సాధించాడు వేద్. అలాగే పదో తరగతిలో 98.6 శాతం, 12వ తరగతిలో 97.6 శాతం మార్కులను సాధించాడు. జూన్ 9న విడుదలైన జేఈఈ అడ్వాన్స్​డ్ 2024 పరీక్షలో 360 మార్కులకు 355 సాధించాడు వేద్. అంటే 98.61శాతం మార్కులన్నమాట. అలాగే జేఈఈ మెయిన్స్ 2024లో 300 మార్కులకు 295 మార్కులు సాధించి, ఆల్ ఇండియా స్థాయిలో 119వ ర్యాంకు పొందాడు. స్కూల్​లో చదివినప్పుడు ఏదైనా సబ్జెక్టులో మార్కులు తగ్గితే తన తాతతో కలిసి పాఠశాలకు వెళ్లేవాడినని వేద్ తెలిపాడు. తనకు మార్కులు ఎందుకు తగ్గాయని టీచర్లను ప్రశ్నించేవాడినని చెప్పాడు.

"జేఈఈ అడ్వాన్స్​డ్​లో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. నాకు ఉపాధ్యాయులు, కుటుంబసభ్యులు అండగా నిలిచారు. జేఈఈ మెయిన్స్​లో పోటీ ఎక్కువగా ఉంది. ఒక ప్రశ్నకు తప్పు సమాధానం పెట్టడం వల్ల ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంకు రాలేదు. అందుకే జేఈఈ అడ్వాన్స్​డ్ కోసం చాలా కష్టపడ్డాను. చివరకు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు రాజస్థాన్​లోని కోటాకు వచ్చి జేఈఈకి ప్రిపేర్ అవుతారు. ఇక్కడ చదువుకోవడానికి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంది. ఐఐటీ బాంబేలో బీటెక్(సీఎస్ఈ)లో సీటు పొందడమే నా లక్ష్యం. భవిష్యత్తులో దేశానికి ఏదైనా చేయాలని ఉంది. భారత్​లోనే ఉద్యోగం చేస్తాను. కంప్యూటర్ సైన్స్ రంగంలో పరిశోధనలకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రజాదరణ పొందింది. అందుకే దానిపై పరిశోధనలు చేయాలనుకుంటున్నా. నేను నా గురువుల మాట వింటాను. వారు చూపిన మార్గంలో నడుస్తాను. జీవితంలో ఏదైనా సాధించాలంటే చాలా కష్టపడాలి. హార్డ్ వర్క్ చేయాలి. శ్రమపై నమ్మకం ఉంచాలి"

-- ఈటీవీ భారత్​తో జేఈఈ ఆల్ ఇండియా టాపర్ వేద్ లహోటి

'దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చాడు'
తన కుమారుడు వేద్ దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చాడని అతడి తండ్రి యోగేశ్ ఆనందం వ్యక్తం చేశారు. వేద్ తన బ్యాచ్​లో విద్యార్థులతో గట్టి పోటీని ఎదుర్కొన్నాడని తెలిపారు. జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షలో ప్రతి ఒక్క మార్కు కోసం స్నేహితుల మధ్య చాలా పోటీ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. క్లాసులో స్నేహితులందరూ కలిసి సందేహాలను క్లియర్ చేసుకునేవారని పేర్కొన్నారు.

పక్కాగా 8గంటల నిద్ర
వేద్ నిత్య విద్యార్థి. తిన్నప్పుడు కూడా ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. ప్రతిరోజూ కొత్త సబ్జెక్టుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. వేద్ కచ్చితంగా రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతాడు. అలాగే అతడికి చెస్, క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. కానీ వాటి కోసం చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. సమయం దొరికనప్పుడల్లా వేద్ చదువుతూనే ఉంటాడు. వేద్‌ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. అందుకే మ్యాథ్స్ ప్రశ్నలను పరిష్కరించేందుకు ఇష్టపడుతుంటాడు. ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్​డ్ టాపర్​గా నిలిచాడు.

జేఈఈ అడ్వాన్స్​ టాపర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి (JEE Advanced Topper Interview 2024)

ఒడిశా సీఎం ఎంపిక- రంగంలోకి రాజ్​నాథ్​, భూపేందర్​- దిల్లీకి సురేశ్ పూజారి! - Odisha New CM

'మోదీ 3.0' కేబినెట్​లో 33 కొత్త ముఖాలు- ముగ్గురు మాజీ సీఎంలకు తొలిసారి అవకాశం - Firstime Ministers In Modi Cabinet

JEE Advanced Topper Interview 2024 : 'జీవితంలో సాధ్యం కానిది ఏదీ లేదు. దృఢ సంకల్పంతో ఉంటే అన్నీ సాధ్యమే. జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. అది పెద్దదిగా ఉండాలి' ఇవేవో పెద్దపెద్ద వ్యక్తులు చెప్పిన మాటలు కావు. జేఈఈ అడ్వాన్స్​డ్ ఆల్ ఇండియా టాపర్ వేద్ లహోటి చేసిన వ్యాఖ్యలు. కష్టపడి పనిచేస్తే జీవితంలో సాధ్యం కానిది ఏదీ లేదని వేద్ లహోటి తెలిపాడు. జేఈఈ అడ్వాన్స్​డ్​లో ఆల్ ఇండియా టాపర్​గా నిలిచిన వేద్ లహోటి ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

JEE Advanced Topper Interview 2024
తల్లిదండ్రులతో వేద్​ లహోటి (ETV Bharat)

చిన్నప్పటి నుంచి చదువులో టాపర్
వేద్ తండ్రి యోగేశ్ లహోటి రిలయన్స్ జియోలో కన్​స్ట్రక్షన్ మేనేజర్ కాగా, తల్లి జయ గృహిణి. వేద్ తాతయ్య ఆర్​సీ సోమాని రిటైర్డ్ ఇంజినీర్. 8వ తరగతిలో ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్​లో గోల్డ్ మెడల్ సాధించాడు వేద్. అలాగే పదో తరగతిలో 98.6 శాతం, 12వ తరగతిలో 97.6 శాతం మార్కులను సాధించాడు. జూన్ 9న విడుదలైన జేఈఈ అడ్వాన్స్​డ్ 2024 పరీక్షలో 360 మార్కులకు 355 సాధించాడు వేద్. అంటే 98.61శాతం మార్కులన్నమాట. అలాగే జేఈఈ మెయిన్స్ 2024లో 300 మార్కులకు 295 మార్కులు సాధించి, ఆల్ ఇండియా స్థాయిలో 119వ ర్యాంకు పొందాడు. స్కూల్​లో చదివినప్పుడు ఏదైనా సబ్జెక్టులో మార్కులు తగ్గితే తన తాతతో కలిసి పాఠశాలకు వెళ్లేవాడినని వేద్ తెలిపాడు. తనకు మార్కులు ఎందుకు తగ్గాయని టీచర్లను ప్రశ్నించేవాడినని చెప్పాడు.

"జేఈఈ అడ్వాన్స్​డ్​లో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. నాకు ఉపాధ్యాయులు, కుటుంబసభ్యులు అండగా నిలిచారు. జేఈఈ మెయిన్స్​లో పోటీ ఎక్కువగా ఉంది. ఒక ప్రశ్నకు తప్పు సమాధానం పెట్టడం వల్ల ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంకు రాలేదు. అందుకే జేఈఈ అడ్వాన్స్​డ్ కోసం చాలా కష్టపడ్డాను. చివరకు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు రాజస్థాన్​లోని కోటాకు వచ్చి జేఈఈకి ప్రిపేర్ అవుతారు. ఇక్కడ చదువుకోవడానికి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంది. ఐఐటీ బాంబేలో బీటెక్(సీఎస్ఈ)లో సీటు పొందడమే నా లక్ష్యం. భవిష్యత్తులో దేశానికి ఏదైనా చేయాలని ఉంది. భారత్​లోనే ఉద్యోగం చేస్తాను. కంప్యూటర్ సైన్స్ రంగంలో పరిశోధనలకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రజాదరణ పొందింది. అందుకే దానిపై పరిశోధనలు చేయాలనుకుంటున్నా. నేను నా గురువుల మాట వింటాను. వారు చూపిన మార్గంలో నడుస్తాను. జీవితంలో ఏదైనా సాధించాలంటే చాలా కష్టపడాలి. హార్డ్ వర్క్ చేయాలి. శ్రమపై నమ్మకం ఉంచాలి"

-- ఈటీవీ భారత్​తో జేఈఈ ఆల్ ఇండియా టాపర్ వేద్ లహోటి

'దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చాడు'
తన కుమారుడు వేద్ దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చాడని అతడి తండ్రి యోగేశ్ ఆనందం వ్యక్తం చేశారు. వేద్ తన బ్యాచ్​లో విద్యార్థులతో గట్టి పోటీని ఎదుర్కొన్నాడని తెలిపారు. జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షలో ప్రతి ఒక్క మార్కు కోసం స్నేహితుల మధ్య చాలా పోటీ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. క్లాసులో స్నేహితులందరూ కలిసి సందేహాలను క్లియర్ చేసుకునేవారని పేర్కొన్నారు.

పక్కాగా 8గంటల నిద్ర
వేద్ నిత్య విద్యార్థి. తిన్నప్పుడు కూడా ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. ప్రతిరోజూ కొత్త సబ్జెక్టుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. వేద్ కచ్చితంగా రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతాడు. అలాగే అతడికి చెస్, క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. కానీ వాటి కోసం చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. సమయం దొరికనప్పుడల్లా వేద్ చదువుతూనే ఉంటాడు. వేద్‌ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. అందుకే మ్యాథ్స్ ప్రశ్నలను పరిష్కరించేందుకు ఇష్టపడుతుంటాడు. ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్​డ్ టాపర్​గా నిలిచాడు.

జేఈఈ అడ్వాన్స్​ టాపర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి (JEE Advanced Topper Interview 2024)

ఒడిశా సీఎం ఎంపిక- రంగంలోకి రాజ్​నాథ్​, భూపేందర్​- దిల్లీకి సురేశ్ పూజారి! - Odisha New CM

'మోదీ 3.0' కేబినెట్​లో 33 కొత్త ముఖాలు- ముగ్గురు మాజీ సీఎంలకు తొలిసారి అవకాశం - Firstime Ministers In Modi Cabinet

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.