జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు - రెండో విడత పోలింగ్ ప్రారంభం - JK Assembly Elections Phase 2 LIVE
Published : 3 hours ago
JK Assembly Elections Phase 2 LIVE : జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల రెండోవిడత పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది. పీర్పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లో 26 స్థానాలకు ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
మొత్తం 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 25,78,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్లో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
JK Assembly Elections Phase 2 LIVE : జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల రెండోవిడత పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది. పీర్పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లో 26 స్థానాలకు ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
మొత్తం 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 25,78,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్లో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.