ETV Bharat / bharat

పూరీ జగన్నాథ ఆలయం To శ్రీరాముని జన్మస్థలం - వయా వారణాసి - తక్కువ ధరలో IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! - IRCTC Punya Kshetra Yatra

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 12:02 PM IST

IRCTC Tour Packages : దేశంలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఐఆర్​సీటీసీ టూరిజం తక్కువ ధరకే అద్దిరిపోయే ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా కాశీ, అయోధ్య సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. మరి.. ఈ టూర్​ ఎన్ని రోజులు సాగనుంది? ధర ఎంత? ప్రయాణం ఎలా ఉంటుంది? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

IRCTC Tour Packages
IRCTC Tour Packages (ETV Bharat)

IRCTC Punya Kshetra Yatra Package: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర ప్రదేశాలను సందర్శించాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఎలా వెళ్లాలో తెలియక పోవడం, డబ్బులు ఎక్కువవుతాయనే సందేహంతో చాలా మంది దానిని వాయిదా వేసుకుంటారు. అయితే ఇప్పుడు అలాంటి టెన్షన్​ అక్కర్లేదు. కేవలం అందుబాటు ధరలోనే పలు ప్రదేశాలను చూసేందుకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్​ ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికోసం "అయోధ్య - కాశీ: పుణ్యక్షేత్ర యాత్ర" పేరుతో అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. మరి ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

ఈ టూర్​ హైదరాబాద్‌ నుంచి మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్‌, భువనగిరి, జనగాం, వరంగల్​, మహబూబాబాద్​, డోర్నకల్​, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. ఈ యాత్రలో భాగంగా పూరీ, కోణార్క్​, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్​ వంటి పుణ్యక్షేత్రాలను చూడొచ్చు. ఈ యాత్ర 9 రాత్రులు, 10 పగళ్లు కొనసాగనుంది. టూర్​ కంప్లీట్​ అయిన తర్వాత తిరిగి ఇదే స్టేషన్ల మీదుగా ట్రైన్ హైదరాబాద్ చేరుకుంటుంది.

ప్రయాణం ఇలా సాగుతుంది:

  • మొదటి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది. భువనగిరి, జనగాం, వరంగల్​, మహబూబాబాద్​, డోర్నకల్​, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో రైలు ఎక్కొచ్చు.
  • రెండో రోజు తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి ఉదయం 9 గంటలకు మాల్తీపాట్పూర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి పూరీ వెళ్లాలి.
  • ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. లంచ్​ తర్వాత పూరీ జగన్నాథుని దర్శించుకుంటారు. ఆ రాత్రి పూరీలోనే స్టే ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని సందర్శించుకుంటారు.. తర్వాత మాల్తీపాట్పూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి గయకు ప్రయాణం స్టార్ట్​ అవుతుంది.

శ్రావణమాసం స్పెషల్​ : అరుణాచలం TO తంజావూర్​ - అతి తక్కువ ధరకే IRCTC సూపర్​​ ప్యాకేజీ!

  • నాలుగో రోజు ఉదయానికి గయ చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్​ చేసిన హోటల్​లో ఫ్రెషప్ అవ్వాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత​ విష్ణుపాద దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం గయ నుంచి వారణాసికి స్టార్ట్​ అవుతారు. అక్కడ రైల్వే స్టేషన్​కు చేరుకుని స్టే చేయడానికి సారనాథ్​ చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం ఆరోజంతా సైట్​ సీయింగ్​ ఉంటుంది. అందులో భాగంగా కాశీ విశ్వనాథ్​ పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆ రోజు రాత్రి వారణాసిలో బస ఉంటుంది.
  • ఏడో రోజు వారణాసి నుంచి శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యకు చేరుకుంటారు. ఆ రోజు శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. ఒకవేళ కుదిరితే సాయంత్రం సరయూ హారతిని వీక్షించి రాత్రి భోజనం తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు స్టార్ట్​ అవుతారు.
  • ఎనిమిదో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. అక్కడ త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సికింద్రాబాద్​కు రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. తొమ్మిదో రోజు మొత్తం ట్రైన్​ జర్నీ ఉంటుంది.
  • పదో రోజు విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్​, మహబూబ్​బాద్​, వరంగల్​, కాజీపేట, జనగాం, భువనగిరి, సికింద్రాబాద్​ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది.

కాశీ టూ నైమిశారణ్య వయా అయోధ్య - IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ!

ప్యాకేజీ ఛార్జీలు:

  • కంఫర్ట్‌లో పెద్దలకు రూ.34,950, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.33,380 చెల్లించాలి.
  • స్టాండర్డ్​లో పెద్దలకు రూ.26,680, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.25,370 గా నిర్ణయించారు.
  • ఎకానమీ క్లాస్‌లో పెద్దలకు రూ. 16,280, 5 నుంచి 11 సంవ్సతరాల చిన్నారులకు రూ.15,700గా ధర నిర్ణయించారు.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయంటే:

  • సెలక్ట్​ చేసుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం సమకూరుస్తారు.
  • ఉదయం కాఫీ, బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​ ప్యాకేజీలో భాగంగా అందిస్తారు.
  • ప్రయాణికులకు ట్రావెల్​ ఇన్సూరెన్స్​ అందిస్తారు.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉన్నా, బోటింగ్‌ వంటివి ఉంటే ప్రయాణికులే చెల్లించాలి.
  • ప్యాకేజీలో లేని ప్రదేశాలను సందర్శించాలన్నా, గైడ్‌ని నియమించుకోవాలన్నా యాత్రికులే చూసుకోవాలి.
  • ఈ యాత్ర సెప్టంబర్​ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్​ చేసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ - తక్కువ ధరకే రెండు జ్యోతిర్లింగాలు, ప్రముఖ ఆలయాల దర్శనం!

IRCTC Punya Kshetra Yatra Package: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర ప్రదేశాలను సందర్శించాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఎలా వెళ్లాలో తెలియక పోవడం, డబ్బులు ఎక్కువవుతాయనే సందేహంతో చాలా మంది దానిని వాయిదా వేసుకుంటారు. అయితే ఇప్పుడు అలాంటి టెన్షన్​ అక్కర్లేదు. కేవలం అందుబాటు ధరలోనే పలు ప్రదేశాలను చూసేందుకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్​ ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికోసం "అయోధ్య - కాశీ: పుణ్యక్షేత్ర యాత్ర" పేరుతో అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. మరి ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

ఈ టూర్​ హైదరాబాద్‌ నుంచి మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్‌, భువనగిరి, జనగాం, వరంగల్​, మహబూబాబాద్​, డోర్నకల్​, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. ఈ యాత్రలో భాగంగా పూరీ, కోణార్క్​, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్​ వంటి పుణ్యక్షేత్రాలను చూడొచ్చు. ఈ యాత్ర 9 రాత్రులు, 10 పగళ్లు కొనసాగనుంది. టూర్​ కంప్లీట్​ అయిన తర్వాత తిరిగి ఇదే స్టేషన్ల మీదుగా ట్రైన్ హైదరాబాద్ చేరుకుంటుంది.

ప్రయాణం ఇలా సాగుతుంది:

  • మొదటి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది. భువనగిరి, జనగాం, వరంగల్​, మహబూబాబాద్​, డోర్నకల్​, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో రైలు ఎక్కొచ్చు.
  • రెండో రోజు తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి ఉదయం 9 గంటలకు మాల్తీపాట్పూర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి పూరీ వెళ్లాలి.
  • ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. లంచ్​ తర్వాత పూరీ జగన్నాథుని దర్శించుకుంటారు. ఆ రాత్రి పూరీలోనే స్టే ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని సందర్శించుకుంటారు.. తర్వాత మాల్తీపాట్పూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి గయకు ప్రయాణం స్టార్ట్​ అవుతుంది.

శ్రావణమాసం స్పెషల్​ : అరుణాచలం TO తంజావూర్​ - అతి తక్కువ ధరకే IRCTC సూపర్​​ ప్యాకేజీ!

  • నాలుగో రోజు ఉదయానికి గయ చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్​ చేసిన హోటల్​లో ఫ్రెషప్ అవ్వాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత​ విష్ణుపాద దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం గయ నుంచి వారణాసికి స్టార్ట్​ అవుతారు. అక్కడ రైల్వే స్టేషన్​కు చేరుకుని స్టే చేయడానికి సారనాథ్​ చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం ఆరోజంతా సైట్​ సీయింగ్​ ఉంటుంది. అందులో భాగంగా కాశీ విశ్వనాథ్​ పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆ రోజు రాత్రి వారణాసిలో బస ఉంటుంది.
  • ఏడో రోజు వారణాసి నుంచి శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యకు చేరుకుంటారు. ఆ రోజు శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. ఒకవేళ కుదిరితే సాయంత్రం సరయూ హారతిని వీక్షించి రాత్రి భోజనం తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు స్టార్ట్​ అవుతారు.
  • ఎనిమిదో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. అక్కడ త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సికింద్రాబాద్​కు రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. తొమ్మిదో రోజు మొత్తం ట్రైన్​ జర్నీ ఉంటుంది.
  • పదో రోజు విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్​, మహబూబ్​బాద్​, వరంగల్​, కాజీపేట, జనగాం, భువనగిరి, సికింద్రాబాద్​ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది.

కాశీ టూ నైమిశారణ్య వయా అయోధ్య - IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ!

ప్యాకేజీ ఛార్జీలు:

  • కంఫర్ట్‌లో పెద్దలకు రూ.34,950, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.33,380 చెల్లించాలి.
  • స్టాండర్డ్​లో పెద్దలకు రూ.26,680, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.25,370 గా నిర్ణయించారు.
  • ఎకానమీ క్లాస్‌లో పెద్దలకు రూ. 16,280, 5 నుంచి 11 సంవ్సతరాల చిన్నారులకు రూ.15,700గా ధర నిర్ణయించారు.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయంటే:

  • సెలక్ట్​ చేసుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం సమకూరుస్తారు.
  • ఉదయం కాఫీ, బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​ ప్యాకేజీలో భాగంగా అందిస్తారు.
  • ప్రయాణికులకు ట్రావెల్​ ఇన్సూరెన్స్​ అందిస్తారు.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉన్నా, బోటింగ్‌ వంటివి ఉంటే ప్రయాణికులే చెల్లించాలి.
  • ప్యాకేజీలో లేని ప్రదేశాలను సందర్శించాలన్నా, గైడ్‌ని నియమించుకోవాలన్నా యాత్రికులే చూసుకోవాలి.
  • ఈ యాత్ర సెప్టంబర్​ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్​ చేసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ - తక్కువ ధరకే రెండు జ్యోతిర్లింగాలు, ప్రముఖ ఆలయాల దర్శనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.