ETV Bharat / bharat

హైదరాబాద్​ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా తక్కువే! - IRCTC Punya Kshetra Yatra

author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 1:37 PM IST

IRCTC Punya Kshetra Yatra: వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్రాల దర్శనం బ్యాలెన్స్​ ఉన్నట్టయితే.. మీకో గుడ్​న్యూస్​. IRCTC సూపర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

IRCTC Punya Kshetra Yatra
IRCTC Punya Kshetra Yatra (Etv Bharat)

IRCTC Punya Kshetra Yatra Tour Package: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC).. "పుణ్యక్షేత్ర యాత్ర" పేరుతో ఓ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో కాశీ, గయ, పూరీ, అయోధ్య వంటి ప్రముఖ క్షేత్రాలను దర్శించుకోవటానికి వీలు కల్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్టేషన్ల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. 9 రాత్రులు, 10 పగళ్లు కొనసాగే ఈ యాత్రా విశేషాలు ఇప్పుడు చూద్దాం.

ప్రయాణం ఇలా..

  • మెదటి రోజున సికింద్రాబాద్‌ నుంచి పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది.
  • కాజీపేట, ఖమ్మం, విజయాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట గుండా రైలు ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉండే వారు అక్కడే రైలు ఎక్కొచ్చు.
  • రెండో రోజు పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి మాల్తీపాట్పూర్‌కు ఉదయం 9 గంటలకు చేరుతుంది. రైల్వే స్టేషన్​ నుంచి పూరీ వెళ్లాలి.
  • ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. లంచ్​ తర్వాత జగన్నాథుని దర్శించుకోవాలి. ఆ రాత్రి పూరీలోనే బస ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ కంప్లీట్​ అయిన తర్వాత ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని సందర్శించుకోవాలి. తర్వాత మాల్తీపాట్పూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి గయకు ప్రయాణం స్టార్ట్​ అవుతుంది.
  • నాలుగోరోజు ఉదయం 8:30 గంటలకు గయ చేరుకుంటారు. ఉదయం హోటల్‌లోనే అల్పాహారం తీసుకున్నాక విష్ణుపాద దేవాలయాన్ని చూశాక వారణాసికి ప్రయాణమవుతారు.

హైదరాబాద్​ To షిరిడీ- IRCTC స్పెషల్ టూర్‌​ ప్యాకేజీ- అతి తక్కువ ధరలో సాయి దర్శనం! - irctc shirdi tour package

  • ఐదో రోజు ఉదయం 6 గంటలకు వారణాసి చేరుకుంటారు. అక్కడే హోటల్లో బ్రేక్​ఫాస్ట్​ ముగించుకొని కాశీనాథుని పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆ రోజు రాత్రి వారణాసిలో బస ఉంటుంది.
  • ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి వారణాసిలోని ప్రముఖ దేవాలయాలు, ఘాట్లు దర్శించవచ్చు. రాత్రి భోజనం తర్వాత ఆ రోజు కూడా వారణాసిలో స్టే చేయాలి.
  • శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యకు ఏడో రోజు చేరుకుంటారు. ఆ రోజు శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. సాయంత్రం సరయూ హారతిని వీక్షించి రాత్రి భోజనం తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు స్టార్ట్​ అవుతారు.
  • ఎనిమిదో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం అక్కడ హనుమాన్​ ఆలయం, శంకర్‌ విమన్‌ మండపాన్ని సందర్శిస్తారు. త్రివేణి సంగమాన్ని చూసి తిరుగు ప్రయాణమవుతారు.
  • తొమ్మిదో రోజు విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు యాత్రా రైలు చేరుకుంటుంది.
  • పదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట ప్రాంతాల మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్‌ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది.

IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా! - IRCTC Tirumala Tour Package

ప్యాకేజీ ఛార్జీలు:

  • ఈ రైళ్లో ఒకరు ప్రయాణించాలంటే కంఫర్ట్‌లో రూ.33,955; స్టాండర్డ్‌లో రూ.25,980; ఎకానమీ క్లాస్‌లో రూ.16,525 చెల్లించాలి.
  • 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకైతే కంఫర్ట్‌లో రూ.32,380; స్టాండర్డ్‌లో రూ.24,670; ఎకానమీ క్లాస్‌లో రూ.15,410 చెల్లించాలి. ట్విన్‌ షేరింగ్‌, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ బట్టి ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయంటే:

  • సెలక్ట్​ చేసుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం సమకూరుస్తారు.
  • ఉదయం కాఫీ, బ్రేక్​ఫాస్ట్​, భోజనం ప్యాకేజీలోనే అందిస్తారు.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉన్నా, బోటింగ్‌ వంటివి ఉంటే ప్రయాణికులే చెల్లించాలి.
  • ప్యాకేజీలో లేని ప్రదేశాలను సందర్శించాలన్నా, గైడ్‌ని నియమించుకోవాన్నా యాత్రికులే చూసుకోవాలి.
  • జూన్​ 8, 2024న ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్​ చేసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ - యాదాద్రితో పాటు మరో 2 ప్రదేశాలు - టూర్‌ పూర్తి వివరాలివే! - Hyderabad to Yadagirigutta Tour

హైదరాబాద్​ To తిరుపతి - IRCTC స్పెషల్​ ప్యాకేజీ- శ్రీవారి స్పెషల్​ దర్శనంతో పాటు మరెన్నో! - IRCTC Poorva Sandhya Tour Packages

IRCTC Punya Kshetra Yatra Tour Package: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC).. "పుణ్యక్షేత్ర యాత్ర" పేరుతో ఓ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో కాశీ, గయ, పూరీ, అయోధ్య వంటి ప్రముఖ క్షేత్రాలను దర్శించుకోవటానికి వీలు కల్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్టేషన్ల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. 9 రాత్రులు, 10 పగళ్లు కొనసాగే ఈ యాత్రా విశేషాలు ఇప్పుడు చూద్దాం.

ప్రయాణం ఇలా..

  • మెదటి రోజున సికింద్రాబాద్‌ నుంచి పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది.
  • కాజీపేట, ఖమ్మం, విజయాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట గుండా రైలు ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉండే వారు అక్కడే రైలు ఎక్కొచ్చు.
  • రెండో రోజు పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి మాల్తీపాట్పూర్‌కు ఉదయం 9 గంటలకు చేరుతుంది. రైల్వే స్టేషన్​ నుంచి పూరీ వెళ్లాలి.
  • ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. లంచ్​ తర్వాత జగన్నాథుని దర్శించుకోవాలి. ఆ రాత్రి పూరీలోనే బస ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ కంప్లీట్​ అయిన తర్వాత ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని సందర్శించుకోవాలి. తర్వాత మాల్తీపాట్పూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి గయకు ప్రయాణం స్టార్ట్​ అవుతుంది.
  • నాలుగోరోజు ఉదయం 8:30 గంటలకు గయ చేరుకుంటారు. ఉదయం హోటల్‌లోనే అల్పాహారం తీసుకున్నాక విష్ణుపాద దేవాలయాన్ని చూశాక వారణాసికి ప్రయాణమవుతారు.

హైదరాబాద్​ To షిరిడీ- IRCTC స్పెషల్ టూర్‌​ ప్యాకేజీ- అతి తక్కువ ధరలో సాయి దర్శనం! - irctc shirdi tour package

  • ఐదో రోజు ఉదయం 6 గంటలకు వారణాసి చేరుకుంటారు. అక్కడే హోటల్లో బ్రేక్​ఫాస్ట్​ ముగించుకొని కాశీనాథుని పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆ రోజు రాత్రి వారణాసిలో బస ఉంటుంది.
  • ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి వారణాసిలోని ప్రముఖ దేవాలయాలు, ఘాట్లు దర్శించవచ్చు. రాత్రి భోజనం తర్వాత ఆ రోజు కూడా వారణాసిలో స్టే చేయాలి.
  • శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యకు ఏడో రోజు చేరుకుంటారు. ఆ రోజు శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. సాయంత్రం సరయూ హారతిని వీక్షించి రాత్రి భోజనం తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు స్టార్ట్​ అవుతారు.
  • ఎనిమిదో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం అక్కడ హనుమాన్​ ఆలయం, శంకర్‌ విమన్‌ మండపాన్ని సందర్శిస్తారు. త్రివేణి సంగమాన్ని చూసి తిరుగు ప్రయాణమవుతారు.
  • తొమ్మిదో రోజు విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు యాత్రా రైలు చేరుకుంటుంది.
  • పదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట ప్రాంతాల మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్‌ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది.

IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా! - IRCTC Tirumala Tour Package

ప్యాకేజీ ఛార్జీలు:

  • ఈ రైళ్లో ఒకరు ప్రయాణించాలంటే కంఫర్ట్‌లో రూ.33,955; స్టాండర్డ్‌లో రూ.25,980; ఎకానమీ క్లాస్‌లో రూ.16,525 చెల్లించాలి.
  • 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకైతే కంఫర్ట్‌లో రూ.32,380; స్టాండర్డ్‌లో రూ.24,670; ఎకానమీ క్లాస్‌లో రూ.15,410 చెల్లించాలి. ట్విన్‌ షేరింగ్‌, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ బట్టి ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయంటే:

  • సెలక్ట్​ చేసుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం సమకూరుస్తారు.
  • ఉదయం కాఫీ, బ్రేక్​ఫాస్ట్​, భోజనం ప్యాకేజీలోనే అందిస్తారు.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉన్నా, బోటింగ్‌ వంటివి ఉంటే ప్రయాణికులే చెల్లించాలి.
  • ప్యాకేజీలో లేని ప్రదేశాలను సందర్శించాలన్నా, గైడ్‌ని నియమించుకోవాన్నా యాత్రికులే చూసుకోవాలి.
  • జూన్​ 8, 2024న ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్​ చేసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ - యాదాద్రితో పాటు మరో 2 ప్రదేశాలు - టూర్‌ పూర్తి వివరాలివే! - Hyderabad to Yadagirigutta Tour

హైదరాబాద్​ To తిరుపతి - IRCTC స్పెషల్​ ప్యాకేజీ- శ్రీవారి స్పెషల్​ దర్శనంతో పాటు మరెన్నో! - IRCTC Poorva Sandhya Tour Packages

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.