ETV Bharat / bharat

పెళ్లికి రాని వరుడు- బావను వివాహం చేసుకున్న వధువు- ఆ పథకం డబ్బుల కోసమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 9:03 PM IST

Fraud In CM Samuhik Marriage Scheme : సామూహిక వివాహ వేడుకకు వరుడు రాలేకపోవడం వల్ల తన బావను పెళ్లి చేసుకుంది వధువు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. సీఎం సామూహిక వివాహ పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం కోసమే ఆమె ఇలా చేసినట్లుగా సమాచారం.

Fraud In CM Samuhik Marriage Scheme
Fraud In CM Samuhik Marriage Scheme

Fraud In CM Samuhik Marriage Scheme : ముహూర్తం సమయానికి పెళ్లి కుమారుడు రాకపోవడం వల్ల మరో వ్యక్తిని వివాహం చేసుకుంది ఓ వధువు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఝూన్సీలో జరిగింది. సీఎం సామూహిక వివాహాల పథకం ప్రయోజనాలను పొందేందుకే వదువు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీరియస్​ అయిన ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

ఇంతకీ ఏం జరిగిందింటే?
ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా ముఖ్యమంత్రి సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 132 జంటలు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాయి. ఇందులో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వధూవరులు వచ్చారు. ఇందులో ఝాన్సీ బామోర్​కు చెందిన ఖుషీ వివాహం మధ్యప్రదేశ్​లోని ఛతర్​పుర్​కు చెందిన బ్రిష్​భన్​తో నిశ్చయమైంది. ఈ సామూహిక వివాహ వేడుకలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్​ కూడా చేయించుకున్నారు. వారిద్దరి పేరుతో 36 నంబర్ రిజిస్ట్రేషన్​ నమోదైంది. అయితే, ఖుషీ వివాహం బ్రిష్​భన్​తో జరగాల్సి ఉండగా అతడికి బదులుగా మరో వ్యక్తి వరుడిగా కనిపించాడు. దీనిపై వారిని అడగగా, 'పెళ్లి కుమారుడు రాలేకపోయాడు. కొంతమంది అధికారుల సలహా మేరకు బ్రిష్​భన్ స్థానంలో తాను వరుడిని అయ్యాను' అని నకిలీ వరుడు చెప్పాడు. అతడికి ఇదివరకే పెళ్లి అయ్యిందని, ఖుషీకి వరుసకు బావ అవుతారని తెలిసింది.

ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కోసమే అతడు ఇలా చేసినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి లలితా యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం సామూహిక వివాహాల పథకం కింద వివాహం చేసుకున్న జంటలకు రూ.51వేలు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఇస్తోంది. ఆ మొత్తంలో రూ.35వేలను వధువు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మరో రూ.10వేలను బహుమతుల కోసం, రూ.6వేలను వివాహ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఇస్తుంది.

Fraud In CM Samuhik Marriage Scheme : ముహూర్తం సమయానికి పెళ్లి కుమారుడు రాకపోవడం వల్ల మరో వ్యక్తిని వివాహం చేసుకుంది ఓ వధువు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఝూన్సీలో జరిగింది. సీఎం సామూహిక వివాహాల పథకం ప్రయోజనాలను పొందేందుకే వదువు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీరియస్​ అయిన ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

ఇంతకీ ఏం జరిగిందింటే?
ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా ముఖ్యమంత్రి సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 132 జంటలు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాయి. ఇందులో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వధూవరులు వచ్చారు. ఇందులో ఝాన్సీ బామోర్​కు చెందిన ఖుషీ వివాహం మధ్యప్రదేశ్​లోని ఛతర్​పుర్​కు చెందిన బ్రిష్​భన్​తో నిశ్చయమైంది. ఈ సామూహిక వివాహ వేడుకలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్​ కూడా చేయించుకున్నారు. వారిద్దరి పేరుతో 36 నంబర్ రిజిస్ట్రేషన్​ నమోదైంది. అయితే, ఖుషీ వివాహం బ్రిష్​భన్​తో జరగాల్సి ఉండగా అతడికి బదులుగా మరో వ్యక్తి వరుడిగా కనిపించాడు. దీనిపై వారిని అడగగా, 'పెళ్లి కుమారుడు రాలేకపోయాడు. కొంతమంది అధికారుల సలహా మేరకు బ్రిష్​భన్ స్థానంలో తాను వరుడిని అయ్యాను' అని నకిలీ వరుడు చెప్పాడు. అతడికి ఇదివరకే పెళ్లి అయ్యిందని, ఖుషీకి వరుసకు బావ అవుతారని తెలిసింది.

ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కోసమే అతడు ఇలా చేసినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి లలితా యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం సామూహిక వివాహాల పథకం కింద వివాహం చేసుకున్న జంటలకు రూ.51వేలు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఇస్తోంది. ఆ మొత్తంలో రూ.35వేలను వధువు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మరో రూ.10వేలను బహుమతుల కోసం, రూ.6వేలను వివాహ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఇస్తుంది.

నేరుగా ఇంటికే అయోధ్య 'హనుమాన్​' ప్రసాదం- మనీ ఆర్డర్ చేస్తే చాలు!

'నేను రాజీనామా చేయలేదు- హిమాచల్​లో ఐదేళ్ల వరకు కాంగ్రెస్ సర్కారే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.