ETV Bharat / bharat

ట్రీట్​మెంట్​ కోసం వచ్చి డాక్టర్​ను​ కాల్చి చంపిన దుండుగులు- వైద్యుడి క్యాబిన్​లోకి వెళ్లి! - Doctor Shot Dead Inside Hospital

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 31 minutes ago

Doctor Shot Dead Inside Hospital In Delhi : ట్రీట్​మెంట్​ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు డాక్టర్​ను కాల్చి చంపిన ఘటన దిల్లీలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Doctor Shot Dead Inside Hospital In Delhi
Doctor Shot Dead Inside Hospital In Delhi (ETV Bharat)

Doctor Shot Dead Inside Hospital In Delhi : దిల్లీలో దారుణం జరిగింది. ట్రీట్​మెంట్​ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు డాక్టర్​ను కాల్చి చంపారు. కలింది కుంజ్ పోలీస్​ స్టేషన్​ ప్రాంతంలోని జైత్​పుర్​లో ఉన్న నీమ ఆస్పత్రిలో బుధవారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని యూనాని ప్రాక్టీషనర్ జావెద్​ అక్తర్​గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాయాలతో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రికి వచ్చారు. గాయాలకు డ్రెస్సింగ్​ చేసిన తర్వాత డాక్టర్​ను కలవాలని పట్టుబట్టారు. దీంతో ఆస్పత్రి స్టాఫ్​, నిందితులకు డాక్టర్​ అపాయింట్​మెంట్​ ఇచ్చారు. వెంటనే వైద్యుడి క్యాబిన్​లోకి వెళ్లిన దుండుగులు, అతడిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని హాస్పటల్ స్టాఫ్​ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డైనట్లు చెప్పారు.

దీనిపై సమచారం అందుకున్న వెంటనే జిల్లా క్రైమ్​​, ఫోరెన్సిక్ టీమ్​లు ఘటనస్థలికి చేరుకున్నాయి. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు. నిందితులు మైనర్లు అని, పక్కా ప్లాన్​తోనే డాక్టర్​ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

'ఎల్​జీ కారణంగానే దిల్లీలో నేరాలు పెరిగాయ్'
ఈ ఘటనపై ఆమ్​ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సౌరభ భరద్వాజ్​ స్పందిచారు. కేంద్ర ప్రభుత్వం, దిల్లీ ఎల్​జీ వీకే సక్సేనా విఫలమయ్యారని, దేశ రాజధానిలో నేరాలు పెరగడానికి వారే బాధ్యులని ఆరోపించారు.

Doctor Shot Dead Inside Hospital In Delhi : దిల్లీలో దారుణం జరిగింది. ట్రీట్​మెంట్​ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు డాక్టర్​ను కాల్చి చంపారు. కలింది కుంజ్ పోలీస్​ స్టేషన్​ ప్రాంతంలోని జైత్​పుర్​లో ఉన్న నీమ ఆస్పత్రిలో బుధవారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని యూనాని ప్రాక్టీషనర్ జావెద్​ అక్తర్​గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాయాలతో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రికి వచ్చారు. గాయాలకు డ్రెస్సింగ్​ చేసిన తర్వాత డాక్టర్​ను కలవాలని పట్టుబట్టారు. దీంతో ఆస్పత్రి స్టాఫ్​, నిందితులకు డాక్టర్​ అపాయింట్​మెంట్​ ఇచ్చారు. వెంటనే వైద్యుడి క్యాబిన్​లోకి వెళ్లిన దుండుగులు, అతడిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని హాస్పటల్ స్టాఫ్​ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డైనట్లు చెప్పారు.

దీనిపై సమచారం అందుకున్న వెంటనే జిల్లా క్రైమ్​​, ఫోరెన్సిక్ టీమ్​లు ఘటనస్థలికి చేరుకున్నాయి. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు. నిందితులు మైనర్లు అని, పక్కా ప్లాన్​తోనే డాక్టర్​ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

'ఎల్​జీ కారణంగానే దిల్లీలో నేరాలు పెరిగాయ్'
ఈ ఘటనపై ఆమ్​ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సౌరభ భరద్వాజ్​ స్పందిచారు. కేంద్ర ప్రభుత్వం, దిల్లీ ఎల్​జీ వీకే సక్సేనా విఫలమయ్యారని, దేశ రాజధానిలో నేరాలు పెరగడానికి వారే బాధ్యులని ఆరోపించారు.

Last Updated : 31 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.