ETV Bharat / bharat

ఎయిర్​సెల్‌- మ్యాక్సిస్‌ కేసులో - కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఊరట - CHIDAMBARAM AIRCEL MAXIS CASE

ఎయిర్​సెల్‌- మ్యాక్సిస్‌ మనీ లాండరింగ్ కేసు - చిదంబరంపై విచారణకు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దిల్లీ హైకోర్టు స్టే

Chidambaram Aircel Maxis Case
Chidambaram Aircel Maxis Case (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2024, 3:42 PM IST

Updated : Nov 20, 2024, 3:51 PM IST

Chidambaram Aircel Maxis Case : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి దిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎయిర్​సెల్​ - మ్యాక్సిస్‌ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఎయిర్​సెల్‌- మ్యాక్సిస్‌ కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ట్రయిల్‌ కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనితో చిదంబరంపై విచారణకు ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ చిదంబరం దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఆయనపై విచారణను నిలిపివేయాలని కోర్ట్ ఆదేశించింది.

మనీ లాండరింగ్!
చిదంబరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్- మ్యాక్సిస్‌ ఒప్పందంలో ఫారిన్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు అనుమతుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. యూపీఏ-1 సర్కార్​ అధికారంలో ఉండగా 2006లో, అప్పటికి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఈ డీల్‌కు అనుమతులు ఇచ్చారు. రూ.3,500 కోట్ల విలువైన ఈ డీల్‌లో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ముడుపులు తీసుకున్నారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై 2018 జూలైలో సీబీఐ, ఈడీలు వేర్వేరుగా ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. 2021లో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లను ట్రయల్​ కోర్టు పరిగణనలో తీసుకుంది. చిందబరం, ఆయన కుమారుడు, ఇతర నిందితులకు మనీలాండరింగ్ కింద సమన్లు జారీ చేసేందుకు తగిన ఆధారాలున్నాయని ట్రయల్​ కోర్టు పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ దిల్లీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Chidambaram Aircel Maxis Case : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి దిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎయిర్​సెల్​ - మ్యాక్సిస్‌ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఎయిర్​సెల్‌- మ్యాక్సిస్‌ కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ట్రయిల్‌ కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనితో చిదంబరంపై విచారణకు ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ చిదంబరం దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఆయనపై విచారణను నిలిపివేయాలని కోర్ట్ ఆదేశించింది.

మనీ లాండరింగ్!
చిదంబరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్- మ్యాక్సిస్‌ ఒప్పందంలో ఫారిన్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు అనుమతుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. యూపీఏ-1 సర్కార్​ అధికారంలో ఉండగా 2006లో, అప్పటికి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఈ డీల్‌కు అనుమతులు ఇచ్చారు. రూ.3,500 కోట్ల విలువైన ఈ డీల్‌లో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ముడుపులు తీసుకున్నారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై 2018 జూలైలో సీబీఐ, ఈడీలు వేర్వేరుగా ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. 2021లో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లను ట్రయల్​ కోర్టు పరిగణనలో తీసుకుంది. చిందబరం, ఆయన కుమారుడు, ఇతర నిందితులకు మనీలాండరింగ్ కింద సమన్లు జారీ చేసేందుకు తగిన ఆధారాలున్నాయని ట్రయల్​ కోర్టు పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ దిల్లీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Nov 20, 2024, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.