ETV Bharat / bharat

రైతులకు గుడ్​న్యూస్​- రూ.14వేల కోట్లతో 7 కొత్త పథకాలు - Union Cabinet Meeting Highlights

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 5:18 PM IST

Updated : Sep 2, 2024, 5:49 PM IST

Union Cabinet Meeting Highlights : వ్యవసాయం, అనుబంధ రంగాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏడు పథకాలు ప్రకటించింది. సుమారు 14వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మరోవైపు, ముంబయి, ఇందౌర్​ మధ్య కొత్త రైలు మార్గం నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపింది.

Union Cabinet Meeting Highlights
Union Cabinet Meeting Highlights (ANI)

Union Cabinet Meeting Highlights : దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఏడు పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుమారు 14వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, విద్య, వాతావరణ మార్పులు, సహజ వనరుల నిర్వాహణ, డిజిటలైజేషన్‌, పాడిపరిశ్రమ, ఉద్యాన పంటలకు ప్రోత్సాహకాలే లక్ష్యంగా ఈ పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు.

కేంద్రం ఆమోదించిన పథకాల వివరాలు :

  1. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్- రూ.2,817 కోట్లు
  2. క్రాప్​ సైన్స్ పథకం- రూ.3,979 కోట్లు
  3. వ్యవసాయ విద్యా రంగం బలోపేతం- రూ. 2,291 కోట్లు
  4. పాడిపశువుల ఆరోగ్యం, ఉత్పత్తి పథకం- రూ. 1,702
  5. హార్టికల్చర్ అభివృద్ధి- రూ.860 కోట్ల
  6. కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం- రూ. 1,202 కోట్లు
  7. సహజ వనరుల నిర్వహణ- రూ. 1,115 కోట్లు

ముంబయి, ఇండోర్ మధ్య కొత్త రైలు మార్గం
ముంబయి, ఇందౌర్ మధ్య 309 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.18,036 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2028-29నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఉజ్జయిన్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర్‌ ఆలయం సహా అనేక పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ కొత్త రైలు మార్గం ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మార్గంలో 30 కొత్త రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

కేనెస్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్
గుజరాత్‌లోని సనంద్‌లో కేనెస్‌ సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుచేసేందుకు సైతం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 3,307 కోట్ల పెట్టుబడితో రోజుకు 63లక్షల చిప్‌లు తయారీ సామర్థ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయన్నట్లు కేంద్రమంత్రి వివరించారు. విద్యుత్‌ రంగానికి సంబంధించిన, ఆటోమొబైల్స్‌, గృహోపకరణాల్లో ఉపయోగించే విద్యుత్‌ ఆధారిత చిప్‌లను ఈ కంపెనీ తయారు చేస్తుందని ఆయన చెప్పారు.

ఉద్యోగులకు యూనిఫైడ్‌ పింఛన్, విద్యార్థుల కోసం విజ్ఞాన ధార - కేంద్ర కేబినెట్ కొత్త నిర్ణయాలివే! - Union Cabinet 3 Decisions
బంగ్లాదేశ్​ పరిణామాలపై భారత్​ హైఅలర్ట్​- మోదీ నేతృత్వంలో కేబినెట్ మీటింగ్- హసీనాతో NSA భేటీ! - CCS Meeting

Union Cabinet Meeting Highlights : దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఏడు పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుమారు 14వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, విద్య, వాతావరణ మార్పులు, సహజ వనరుల నిర్వాహణ, డిజిటలైజేషన్‌, పాడిపరిశ్రమ, ఉద్యాన పంటలకు ప్రోత్సాహకాలే లక్ష్యంగా ఈ పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన వివరించారు.

కేంద్రం ఆమోదించిన పథకాల వివరాలు :

  1. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్- రూ.2,817 కోట్లు
  2. క్రాప్​ సైన్స్ పథకం- రూ.3,979 కోట్లు
  3. వ్యవసాయ విద్యా రంగం బలోపేతం- రూ. 2,291 కోట్లు
  4. పాడిపశువుల ఆరోగ్యం, ఉత్పత్తి పథకం- రూ. 1,702
  5. హార్టికల్చర్ అభివృద్ధి- రూ.860 కోట్ల
  6. కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం- రూ. 1,202 కోట్లు
  7. సహజ వనరుల నిర్వహణ- రూ. 1,115 కోట్లు

ముంబయి, ఇండోర్ మధ్య కొత్త రైలు మార్గం
ముంబయి, ఇందౌర్ మధ్య 309 కిలోమీటర్ల మేర కొత్త రైలు మార్గం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.18,036 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2028-29నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఉజ్జయిన్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర్‌ ఆలయం సహా అనేక పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ కొత్త రైలు మార్గం ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మార్గంలో 30 కొత్త రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

కేనెస్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్
గుజరాత్‌లోని సనంద్‌లో కేనెస్‌ సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుచేసేందుకు సైతం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 3,307 కోట్ల పెట్టుబడితో రోజుకు 63లక్షల చిప్‌లు తయారీ సామర్థ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయన్నట్లు కేంద్రమంత్రి వివరించారు. విద్యుత్‌ రంగానికి సంబంధించిన, ఆటోమొబైల్స్‌, గృహోపకరణాల్లో ఉపయోగించే విద్యుత్‌ ఆధారిత చిప్‌లను ఈ కంపెనీ తయారు చేస్తుందని ఆయన చెప్పారు.

ఉద్యోగులకు యూనిఫైడ్‌ పింఛన్, విద్యార్థుల కోసం విజ్ఞాన ధార - కేంద్ర కేబినెట్ కొత్త నిర్ణయాలివే! - Union Cabinet 3 Decisions
బంగ్లాదేశ్​ పరిణామాలపై భారత్​ హైఅలర్ట్​- మోదీ నేతృత్వంలో కేబినెట్ మీటింగ్- హసీనాతో NSA భేటీ! - CCS Meeting

Last Updated : Sep 2, 2024, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.