తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పిచ్చికుక్కల స్వైర విహారం.. 12 మందికి గాయాలు

నిర్మల్​ జిల్లాలోని భైంసాలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ దాడిలో 12 మందికి గాయాలుకాగా... వారిని మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్​కు తరలించారు.

By

Published : Dec 20, 2019, 6:18 PM IST

12 people injures in dogs bite In Nirmal district
పిచ్చికుక్కల స్వైర విహారం.. 12 మందికి గాయాలు

పిచ్చికుక్కల స్వైర విహారం.. 12 మందికి గాయాలు

నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలోని పలు కాలనీల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ దాడిలో 12 మందికి గాయాలయ్యాయి. వారిని పట్టణ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ప్రథమచికిత్స అందించి... మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్​ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు దాడి చేసిన పిచ్చికుక్కలను హతమర్చడానికి 8 మంది సిబ్బందిని రెండు బృందాలుగా పంపించి.. చంపించినట్లు తెలిపారు. శనివారం పట్టణంలోని వీధికుక్కలను పట్టుకుపోవడానికి ప్రత్యేక టీమ్​ వస్తుందని.. మున్సిపల్​ అధికారి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

ABOUT THE AUTHOR

...view details