విజయనగరం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా వేకువ జాము నుంచే భోగి మంటలతో ప్రజలు సందడి చేశారు. ముఖ్యంగా నగరంలో సామూహిక భోగి వేడుకలు అంబరాన్నంటాయి. కాలనీ వాసులందరూ ఒక చోటకు చేరి వేడుకల్లో పాల్గొన్నారు. పొంగళ్లు, చెరకు గడలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రాంగణాలను అందంగా అలంకరించారు. యువతీ యువకులతో పాటు మహిళలు, పురుషులు, చిన్నారులందరూ సంప్రదాయ వస్త్రధారణతో సందడి చేశారు. అనంతరం భోగి మంటలు వేసి, గంగిరెద్దుల ఆటలతో సంబరాలు చేసుకున్నారు. దిల్లీలో రైతుల చేపట్టిన ఆందోళనకు మద్దతుగా రైతు, కార్మిక, ప్రజా సంఘాలు కలెక్టరేట్ వద్ద భోగిమంటలు వేసి, కేంద్రం జారీ చేసిన రైతు చట్టాల ప్రతులను తగులబెట్టారు.
పార్వతీపురంలో భోగి వేడుకలు..