ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పది గంటల వ్యవధిలోనే దోపిడీ కేసు ఛేదన

By

Published : Nov 15, 2020, 3:47 PM IST

విశాఖ మిథిలాపురి దోపిడీ ఘటనను పోలీసులు... పది గంటల వ్యవధిలోనే ఛేదించారు. నిందితుల నుంచి నగదు, చరవాణి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

vizag crime police chase robbery case within ten hours
వివరాలు వెల్లడిస్తున్న పోలీస్ అధికారి

విశాఖ మిథిలాపురి కాలనీలో శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తిపై ముగ్గురు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. అప్రమత్తమైన బాధితుడు పీఎం.పాలెం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పది గంటల్లోనే ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వీరిపై గతంలోనూ కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుల నుంచి వెయ్యి రూపాయల నగదు, ఒక చరవాణి, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details