అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం గూటి బయలు వద్ద సుమారు 6 ఎకరాలలో విస్తరించి ఉన్న తిమ్మమ్మ మర్రిమాను... ఇటీవల కాలంలో సంరక్షణ కొరవడి ఎండిపోతోంది. 6వందల ఏళ్లకు పైగా వయసు కలిగి... వారసత్వ సంపదగా భావిస్తున్న ఈ మహావృక్షం ఎండిపోవటం... తిమ్మమాంబ వంశస్థులతో పాటు స్థానికులను కలవరపెడుతోంది.
సేవ్ తిమ్మమ్మ మర్రిమాను...
తిమ్మమ్మ మర్రిమాను బాధ్యతను అటవీశాఖకు అప్పగించే వరకు... దిన దిన ప్రవర్ధమానం చెందిందని, అధికారులు సకాలంలో స్పందించని కారణంగా మర్రిమాను దెబ్బతింటోందని తిమ్మమాంబ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంరక్షణ చర్యలు చేపట్టాలంటూ స్థానిక యువత 'సేవ్ తిమ్మమ్మ మర్రిమాను' అంటూ నిరసన ప్రదర్శన చేపడుతోంది.