ETV Bharat / state

కేంద్ర సమాచారశాఖలో చేరేందుకు ఐఐఎస్‌ అధికారి విజయకుమార్‌రెడ్డి విఫలయత్నం - నిరాకరించిన కేంద్రం - IIS officer Vijayakumar deputation

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 10:02 PM IST

IIS officer Vijayakumar Reddy Try to Join Central Information Department: కేంద్ర సమాచారశాఖలో చేరేందుకు ఐఐఎస్‌ అధికారి తుమ్మా విజయకుమార్‌రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ విజయకుమార్‌రెడ్డిని కేంద్ర సమాచారశాఖ తీసుకునేందుకు నిరాకరించడంతో చేసేదిలేక మళ్లీ రాష్ట్రానికి తిరిగివచ్చారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

IIS officer Vijayakumar Reddy Try to Join Central Information Department : అధికారి తుమ్మా విజయకుమార్‌రెడ్డి డిప్యుటేషన్ కాలపరిమితి జూన్‌ 9తో ముగిసింది. దీంతో కేంద్ర సమాచారశాఖలో చేరేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ విజయకుమార్‌రెడ్డిని కేంద్ర సమాచారశాఖ తీసుకునేందుకు నిరాకరించడంతో చేసేదిలేక మళ్లీ రాష్ట్రానికి తిరిగివచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆయన నిర్ణయాలపై విచారణ : విజయకుమార్‌రెడ్డి డిప్యుటేషన్ కాలపరిమితి జూన్‌ 9తో ముగియడంతో ఆటో రిలీవ్ నిబంధనతో రాష్ట్ర సర్వీసు నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించడంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఇక్కడే కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కేంద్రానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ఉత్తర్వుల దృష్ట్యా సర్వీసులోకి తీసుకునేందుకు కేంద్రం నిరాకరించింది. చేసేది లేక మళ్లీ రాష్ట్రానికి తిరిగివచ్చారు. సమాచారశాఖ కమిషనర్‌గా తీసుకున్న నిర్ణయాలపై, ప్రకటనలు, పుస్తకాలు, కరపత్రాల ముద్రణపై ప్రభుత్వం విచారణ చేయనుంది. అక్రమాల్లో విజయకుమార్‌రెడ్డి, ఇతరుల ప్రమేయంపై ప్రభుత్వం అరా తీస్తోంది.

మూడేళ్లు కొనసాగింపు : సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మ విజయకుమార్ రెడ్డి డిప్యుటేషన్​ను మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ మూడు సంవత్సరాలు క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్ 10 నుంచి 2024 జూన్ 9 వరకూ ఆయన ఏపీలో డిప్యుటేషన్​పై కొనసాగుతారని పేర్కొంది. ఇందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు ఇచ్చారు. విజయకుమార్ రెడ్డి డిప్యుటేషన్ పొడిగింపునకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అంగీకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర సమాచార కమిషనర్​ పదవీ కాలం మరో మూడేళ్లు పొడిగింపు

IIS officer Vijayakumar Reddy Try to Join Central Information Department : అధికారి తుమ్మా విజయకుమార్‌రెడ్డి డిప్యుటేషన్ కాలపరిమితి జూన్‌ 9తో ముగిసింది. దీంతో కేంద్ర సమాచారశాఖలో చేరేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ విజయకుమార్‌రెడ్డిని కేంద్ర సమాచారశాఖ తీసుకునేందుకు నిరాకరించడంతో చేసేదిలేక మళ్లీ రాష్ట్రానికి తిరిగివచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆయన నిర్ణయాలపై విచారణ : విజయకుమార్‌రెడ్డి డిప్యుటేషన్ కాలపరిమితి జూన్‌ 9తో ముగియడంతో ఆటో రిలీవ్ నిబంధనతో రాష్ట్ర సర్వీసు నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించడంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఇక్కడే కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కేంద్రానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ఉత్తర్వుల దృష్ట్యా సర్వీసులోకి తీసుకునేందుకు కేంద్రం నిరాకరించింది. చేసేది లేక మళ్లీ రాష్ట్రానికి తిరిగివచ్చారు. సమాచారశాఖ కమిషనర్‌గా తీసుకున్న నిర్ణయాలపై, ప్రకటనలు, పుస్తకాలు, కరపత్రాల ముద్రణపై ప్రభుత్వం విచారణ చేయనుంది. అక్రమాల్లో విజయకుమార్‌రెడ్డి, ఇతరుల ప్రమేయంపై ప్రభుత్వం అరా తీస్తోంది.

మూడేళ్లు కొనసాగింపు : సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మ విజయకుమార్ రెడ్డి డిప్యుటేషన్​ను మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ మూడు సంవత్సరాలు క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్ 10 నుంచి 2024 జూన్ 9 వరకూ ఆయన ఏపీలో డిప్యుటేషన్​పై కొనసాగుతారని పేర్కొంది. ఇందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు ఇచ్చారు. విజయకుమార్ రెడ్డి డిప్యుటేషన్ పొడిగింపునకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అంగీకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర సమాచార కమిషనర్​ పదవీ కాలం మరో మూడేళ్లు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.