ACB Caught Electricity DE While Taking Bribe: రాష్ట్రంలో ఏసీబీ ఒక్కసారిగా దూకుడు పెంచింది. గత వారమే రంగారెడ్డి జిల్లా జేసీ, సీనియర్ అసిస్టెంట్ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు, తాజాగా వనస్థలిపురంలోని సరూర్నగర్ విద్యుత్ శాఖ డీఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గురువారం రోజున ఆటోనగర్లోని డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డీఈ రామ్మోహన్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
రూ.18 వేలు లంచం తీసుకుంటూ - ఏసీబీకి చిక్కిన సరూర్నగర్ విద్యుత్ శాఖ డీఈ
Published : Aug 22, 2024, 5:10 PM IST
|Updated : Aug 22, 2024, 7:39 PM IST
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆగపల్లి అనే గ్రామంలో రెండు ఎకరాల వెంచర్లో ఉన్న విద్యుత్ స్తంభాలను షిఫ్టింగ్ చేయడానికి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవడానికి ఓ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి రూ.18 వేలు ఇవ్వాలని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ను డీఈ రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోదాలు చేపట్టిన ఏసీబీ డీఈని పట్టుకుంది.