national

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

ETV Bharat / snippets

బైక్‌పై వాగు దాటుతూ నీటిలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు - ఒకరు సేఫ్​, మరొకరు గల్లంతు

Man Swept away In Stream Water
Man Swept away In Stream Water (ETV Bharat)

Man Swept away In Stream Water : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి వద్ద ద్విచక్రవాహనంపై వాగుదాటుతూ ఇద్దరు వ్యక్తులు నీటిలో కొట్టుకుపోయారు. వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న ఓ వ్యక్తి చెట్ల కొమ్మలు పట్టుకొని ప్రాణాలు కాపాడుకోగా మరోవ్యక్తి నీటిప్రవాహంలో గల్లంతయ్యారు. కాగా నీటిలో గల్లంతైన వ్యక్తులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా మైలూరుకు చెందిన ఇస్మాయిల్ సాబ్(55), షాకీర్(40)గా అధికారులు గుర్తించారు. వ్యక్తి గల్లంతయిన నారింజ వాగును జహీరాబాద్ తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో మహేందర్ రెడ్డి సందర్శించి వాగు వద్ద రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు కోహిర్, జహీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే నారింజ వాగు పొంగి రాకపోకలకు కష్టంగా మారుతోందని వంతెన నిర్మించాలని బూచినెల్లి వాసులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details