national

వైఎస్సార్​ జిల్లాలో విషాదం - పిడుగుపాటుకు ముగ్గురు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Published : 5 hours ago

Three Persons Died
Three Persons Died (ETV Bharat)

Three Persons Died with Thunderbolt in YSR District: వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలో పిడుగు పడి ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కూలీ పనులు చేసుకుని తిరిగి వస్తుండగా సాయంత్రం వర్షం రావడం వల్ల ముగ్గురు చెట్టు కిందకు వెళ్లారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పిడుగులు పడ్డాయి. చెట్టుపైన పెద్ద శద్ధంతో పిడుగు పడటంతో చెట్టు కాలిపోయి ఆ చెట్టు కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నందిరెడ్డి శివపార్వతి (30), నందిరెడ్డి తేజేశ్వర్ రడ్డి (10), మారుతిప్రసాద్ రెడ్డి (30) మృతి చెందారు. మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. శరీరాలన్నీ నలుపు రంగులోకి మారిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details