గ్రూప్-1 మెయిన్స్కు లైన్ క్లియర్ - పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 18, 2024, 5:23 PM IST
Telangana Group 1 Mains Exam: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్కు లైన్ క్లియర్ అయింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ప్రాథమిక 'కీ'లో తప్పులున్నాయనే పిటిషన్పై డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ మేరకు గ్రూప్-1 పరీక్షపై దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్కు 31 వేల 383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం మొత్తం 46 కేంద్రాలు ఏర్పాటు చేశారు.