TG Govt Appoint Sub Committee for ORR :అవుటర్ రింగు రోడ్డు పరిధి లోపల ఉన్న గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనంపై, రాష్ట్రప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘానికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఛైర్మన్గా, పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహా సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం- మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
Published : Aug 22, 2024, 10:06 PM IST
Telangana Government Appointed Sub Committee for ORR (ETV Bharat)
ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై గతంలో చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం పూర్తిస్థాయి అధ్యయనం కోసం ఈ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఓఆర్ఆర్ వరకు ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీల ప్రజా ప్రతినిధులు, నిపుణులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. ఓఆర్ఆర్ వరకు స్థానిక సంస్థల పునర్ వ్యవస్థీకరణపై సిఫార్సులు చేయనుంది.