Published : 6 hours ago
సరూర్నగర్ చెరువుపై 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం
Swachhata Hi Seva In Hyderabad 2024: హైదరాబాద్ మహానగరంలో మినీ ట్యాంక్బండ్గా పేరొందిన సరూర్నగర్ చెరువును జాతీయ గణాంక ప్రాంతీయ కార్యాలయ అధికారులు స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సరూర్నగర్ చెరువు కట్ట, పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తను తీసి స్వచ్చతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు పాల్గొన్నారు. కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ స్వచ్ఛత పైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కేవలం ఇంటిలోనే కాకుండా ఇంటి పరిసరాల్లో, పబ్లిక్ ప్రాంతాల్లో మన వంతుగా స్వచ్ఛత కార్యక్రమాలు చేయాలని తెలిపారు. ప్రజలు అంటువ్యాధులు ప్రభలకుండా పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.