Private Bus Overturns In Nalgonda :నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం వద్ద నార్కట్పల్లి రహదారిపై ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం జగిత్యాల నుంచి ఓ ప్రైవేటు బస్సు ప్రయాణికులతో దర్శికి బయలుదేరింది. కొంతదూరం వెళ్లేసరికే మార్గమాధ్యలో తెల్లవారుజామున బస్సు అదుపుతప్పి నార్కెట్పల్లి రహదారిపై బోల్తాపడింది.
నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా - 30 మందికి స్వల్పగాయాలు
Published : Aug 25, 2024, 12:03 PM IST
Private Bus overturns In Nalgonda (ETV Bharat)
సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు డ్రైవర్ తెలిపారు. రహదారికి అడ్డంగా బస్సు పడటంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. జేసీబీ, క్రేన్తో బస్సును రోడ్డుపై నుంచి తొలగింపజేశారు.