Old Couple Died due to Electric shock in Khammam : ఖమ్మం జిల్లా వైరా పురపాలికలోని హనుమాన్ బజార్లో విద్యుదాఘాతంతో వృద్ధ దంపతులు మృతి చెందారు. వైరాకు చెందిన పల్లపు ఆంజనేయులు(62), నర్సమ్మ(56) దంపతులు హనుమాన్ బజార్లో తన చిన్న కుమారుడి ఇంటి వెనక భాగంలోని గదిలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బాత్రూమ్కు వెళ్లిన నర్సమ్మ, ఇంట్లోకి వెళ్తూ ఇనుప దండెంపై ఉన్న టవల్ను తీసే ప్రయత్నం చేయగా విద్యుత్ షాక్ తగిలింది.
Published : Jun 22, 2024, 9:30 AM IST
విద్యుదాఘాతంతో వృద్ధ దంపతుల మృతి - కాపాడేందుకు వచ్చిన కోడలిని!
Old Couple Died Electric shock at Vira (ETV Bharat)
ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న భర్త ఆంజనేయులు పరుగులు తీస్తూ వచ్చి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడూ విద్యుత్ షాక్కు గురవడంతో దంపతులిద్దరూ మృత్యువాతపడ్డారు. ఆంజనేయులు కేకలు విని కోడలు వారి వద్దకు రాగా, మామ సైగలు చేస్తూ రావొద్దని చెప్పడంతో ఆమెకు ప్రాణహాని తప్పింది.