National Cyclist Asha Malviya met CM Revanth Reddy :మన దేశానికి చెందిన సాహసోపేతమైన అథ్లెట్, ప్రముఖ జాతీయ సైక్లిస్ట్ ఆశా మాల్వియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆశా మాల్వియా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. గత నెల జూన్ 24వ తేదీన ఈ సైకిల్ యాత్రను ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వియా
Published : Jul 7, 2024, 3:19 PM IST
National Cyclist Asha Malviya met CM Revanth Reddy (ETV Bharat)
అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్ చేరుకున్న ఆమెను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. గతంలోనూ మహిళల భద్రత, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు 28 రాష్ట్రాల్లో 25 వేల కిలోమీటర్ల మేర సోలో సైకిల్ యాత్ర చేస్తూ సైక్లిస్ట్గా ఎన్నో రికార్డులు సృష్టించారు మధ్యప్రదేశ్కు చెందిన యువతి ఆశా మాల్వియా.