Cyber Criminal Gang Arrest :పెట్రోల్బంకు సిబ్బందిని టార్గెట్గా చేసుకుని స్వైపింగ్ మిషన్లోని ఆప్షన్లను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. ఈ మేరకు ఐదుగురు అంతర్రాష్ట నిందితులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,80,000ల నగదు, ఒక బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పెట్రోల్బంకు సిబ్బందిని స్వైపింగ్మిషన్లతో మోసగిస్తున్న ముఠా అరెస్టు
Published : Aug 3, 2024, 2:39 PM IST
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు గతంలో పెట్రోల్ బంకులో పనిచేసేవారు. ఆ క్రమంలోనే స్వైపింగ్ మిషన్లపై అవగాహన పెంచుకున్నారు. హాస్పిటల్ ఖర్చుల కోసం అత్యవసరంగా డబ్బు కావాలంటూ పెట్రోల్ బంకుల వద్ద క్రెడిట్కార్డు స్వైపింగ్ చేసి కావాల్సిన డబ్బు తీసుకుని వారిని మాటల్లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే void"అనే ఆప్షన్ ద్వారా తిరిగి తమ ఖాతాల్లోకి వేసుకుని డబ్బు కాజేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ముఠా పలు ప్రాంతాల్లో సైబర్నేరాలకు పాల్పడింది.