రూ.20 వేల అప్పు చెల్లించలేదని ఎల్బీనగర్లో మహిళ హత్య
Published : Aug 3, 2024, 10:49 AM IST
Woman Murdered in LB Nagar (ETV Bharat)
Woman Murdered in LB Nagar : ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలన్నందుకు ఓ మహిళ తోటి మహిళను హత్య చేసింది. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగా కాలనీలో నర్సమ్మ అనే మహిళ హత్యకు గురైంది. తీసుకున్న రూ.20 వేల అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు నర్సమ్మ ముఖంపై ఆవేశంతో సరోజినీ సుత్తితో దాడి చేసింది. దీంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సరోజినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.