Young Engineer killed in Narsingi :హైదరాబాద్ నగర శివారు నార్సింగిలో ఓ యువ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. మిట్ట మద్యాహ్నం వేళ క్వాలిస్ కారులో నిర్మానుష్య ప్రాంతానికి తరలించి ఇదాయత్ అలీ అనే ఇంజినీర్ను కత్తులతో అతి దారుణంగా హత్య చేశారు. ఈ కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ మహిళ సైతం ఉన్నట్లు సమాచారం. దారుణంగా కత్తితో గొంతు కోసి కారు వదిలేసి పారిపోయారు.
Published : Jun 29, 2024, 7:24 PM IST
నార్సింగిలో దారుణం- గొంతుకోసి ఓ యువ ఇంజినీర్ హత్య
Young Engineer killed in Narsingii (ETV Bharat)
ఇదాయత్ అలీ దుబాయ్లో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. గత 20 రోజుల క్రితం ఇండియాకు వచ్చాడు. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి పలు ఆధారాలు సేకరిస్తున్నారు. అలీని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో క్వాలిస్ కారుతో పాటు రెండు ఫోన్లు లభ్యమయ్యాయి.