Huge Devotees To Vemulawada Temple :వేసవి సెలవులు ముగుస్తుండటంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. భక్తులు ధర్మగుండంలో పుణ్యాస్నానాలు ఆచరించి స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా గర్భాలయంలో అభిషేకాలు, అర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ముగుస్తున్న వేసవి సెలవులు - వేములవాడకు పోటెత్తిన భక్తులు
Published : Jun 10, 2024, 4:13 PM IST
Huge Devotees To Vemulawada Temple (ETV Bharat)
కోడె మొక్కులు చెల్లించుకున్న వారికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనం చేసుకుంటున్నవారికి రెండు గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.