ETV Bharat / snippets

పోయిందనుకున్న బంగారం మళ్లీ దక్కింది.. ఎలాగంటే

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

50 GRAMS GOLD IN RICE BAG
GOLD ISSUE IN JANAGAON DISTRICT (ETV Bharat)

50 Grams Gold in Rice Bag: జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండలంలోని సముద్రాల గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కట్ల సోమలక్ష్మి అనే వృద్ధురాలు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం సంచిలో ఐదు తులాల బంగారం దాచి పెట్టింది. గ్రామంలోని ఓ వ్యక్తికి ఆ బియ్యాన్ని విక్రయించింది. బంగారం దాచుకున్న సంచి వేరే ఉందని భావించి, అందులో చూడగా బంగారం కనిపించలేదు.

బంగారం దాచిన బియ్యం సంచినే విక్రయించినట్లు తెలుసుకుని విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. మరుసటి రోజు బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా గ్రామంలోని ఓ చోట 15 బస్తాల వరకు బియ్యాన్ని నిలువ చేసినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యుల సహాయంతో బియ్యం సంచులను విప్పి వెతకగా అందులో బంగారం దొరికింది. దీంతో వృద్ధురాలు సోమలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

50 Grams Gold in Rice Bag: జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండలంలోని సముద్రాల గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కట్ల సోమలక్ష్మి అనే వృద్ధురాలు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం సంచిలో ఐదు తులాల బంగారం దాచి పెట్టింది. గ్రామంలోని ఓ వ్యక్తికి ఆ బియ్యాన్ని విక్రయించింది. బంగారం దాచుకున్న సంచి వేరే ఉందని భావించి, అందులో చూడగా బంగారం కనిపించలేదు.

బంగారం దాచిన బియ్యం సంచినే విక్రయించినట్లు తెలుసుకుని విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. మరుసటి రోజు బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా గ్రామంలోని ఓ చోట 15 బస్తాల వరకు బియ్యాన్ని నిలువ చేసినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యుల సహాయంతో బియ్యం సంచులను విప్పి వెతకగా అందులో బంగారం దొరికింది. దీంతో వృద్ధురాలు సోమలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.