Accident Suryapet District : సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ఆకుపాముల వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై నాలుగు బస్సులు, ఓ డీసీఎం వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, ఓ చిన్నారికి స్వల్ప గాయాలు కాగా 80 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం ముందుగా వెళ్తున్న బస్సును మరో బస్సు ఓవర్ టేక్ చేయబోతుండగా ప్రమాదం జరిగింది.
వీటి వెనుక వస్తున్న ఓ డీసీఎం, మరో బస్సు కూడా ఢీ కొట్టాయి. ఈ సమయంలో నాలుగు బస్సుల్లో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగలోకి దిగి సమస్యను పరిష్కరించారు. ఉదయం 3 గంటలకు గాఢనిద్రలో ఉన్న సమయంలో అంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయిందని బాధితులు వాపోయారు.